వైకాపాను సాగనంపేందుకు సిద్ధం
వైకాపాను సాగనంపేందుకు జనం సిద్ధంగా ఉన్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఏపీ న్యాయయాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆదోని పట్టణం స్థానిక అంబేడ్కర్ కూడలిలో నిర్వహించిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు.
జగన్ హామీలు మద్యం దుకాణాల్లోనే
ఆదోని సభలో వైఎస్ షర్మిల
ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్టుడే: వైకాపాను సాగనంపేందుకు జనం సిద్ధంగా ఉన్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఏపీ న్యాయయాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆదోని పట్టణం స్థానిక అంబేడ్కర్ కూడలిలో నిర్వహించిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. వైకాపా కార్యకర్తలు కొందరు సిద్ధం జెండాలు పట్టుకొని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.. సమీపంలోని ఓ మేడపై నుంచి వైకాపా సిద్ధం జెండాలు చూపుతూ కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. మిమ్మల్ని పంపేందుకు మేము సిద్ధమన్నారు. పోలీసులు మేడపైకి వెళ్లి వైకాపా వారిని అక్కడి నుంచి తరిమివేశారు. వైకాపా అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని జగన్మోహన్రెడ్డి చెప్పారు.. ఐదేళ్లుగా గడిచినా ఆ మాటే మరిచారు.. ఖాళీలు భర్తీ చేయకుండా ఐదేళ్లు ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. జగన్ ఇచ్చిన హామీలు మద్యం దుకాణాల్లోనే ఉండిపోయాయని ఎద్దేవా చేశారు. ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోవడం లేదన్నారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా భాజపాకు గులాంగిరీ చేస్తున్నారన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం.. గుండు సున్నా ఇచ్చిందన్నారు. ఆదోని ఎమ్మెల్యే పేకాటరాయుడు అంటకదా.. ఇలాంటి దోపిడీదారులకా ఓట్లు వేసేది? అని ప్రశ్నించారు. ఆదోని కాంగ్రెస్ అభ్యర్థిగా రమేశ్యాదవ్, కర్నూలు ఎంపీ అభ్యర్థి రాంపుల్లయ్యయాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఇండియా కూటమి నాయకులు నీలకంఠప్ప, దేవిశెట్టి ప్రకాశ్, దిలీప్దోకా, అజయ్బాబు, లింగన్న, సాయినాథ్, వీరేశ్, ఉమ్మి యూసుఫ్, నూర్ పాల్గొన్నారు.
చేనేతను విస్మరించారు
ఎమ్మిగనూరు గ్రామీణం, న్యూస్టుడే: చేనేతలకు టెక్స్టైల్ పార్కు నిర్మిస్తానని, రుణమాఫీ చేస్తానని, ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏమీ చేయలేదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కాంగ్రెస్ న్యాయ యాత్రలో భాగంగా శుక్రవారం ఆమె ఎమ్మిగనూరు గాంధీ కూడలిలో మాట్లాడారు. ముఖ్యమంత్రి సంపూర్ణ మద్యనిషేధం చేస్తానని ఐదేళ్ల కిందట చెప్పారు..చేయకపోతే ఎన్నికల్లో ఓట్లే అడగనన్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, డీఎస్సీ, రాజధాని ఇలా పలు వాగ్దానాలన్నీ ముఖ్యమంత్రి మద్యం దుకాణాల్లో పెట్టుకున్నారని విమర్శించారు. సొంత చిన్నాన్నను చంపినవారిని సీఎం పక్కన పెట్టుకుని తిరుగుతున్నారని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి
[ 03-05-2024]
గుండె పోటుతో ఉపాధి కూలీ మృతి చెందిన సంఘటన మండలంలోని సింగరాజుపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. -
రైతు సంక్షేమం తెదేపాతోనే సాధ్యం
[ 03-05-2024]
రైతు సంక్షేమం తెదేపాతోనే సాధ్యమని నంద్యాల పార్లమెంట్ తెదేపా బాధ్యుడుమాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్య అన్నారు. -
ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి
[ 03-05-2024]
ఇండియా కూటమి పత్తికొండ సీపీఐ అభ్యర్థి రామచంద్రయ్యను గెలిపించాలని సీపీఐ మండల కార్యదర్శి కృష్ణ కోరారు. -
తెదేపాలో చేరికలు
[ 03-05-2024]
స్థానిక తెదేపా కార్యాలయంలో నికిలేశ్, సుబ్బరాయుడు, జ్ఞానేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు వైకాపా నాయకులు తెదేపాలో చేరారు. -
వైకాపాను సాగనంపుదాం
[ 03-05-2024]
రానున్న ఎన్నికల్లో వైకాపాను సాగనంపుదామని మండల తెదేపా నాయకులు కేఈ నిఖిలేష్, సుబ్బరాయుడు అన్నారు. -
తెదేపాలోకి భారీగా చేరికలు
[ 03-05-2024]
పట్టణంలోని 31వ వార్డు సోమప్ప నగర్కు చెందిన 400 కుటుంబాలు తెదేపాలో చేరారు. -
జగన్ నాటకాలను ప్రజలు నమ్మరు
[ 03-05-2024]
సీఎం జగన్మోహన్ రెడ్డికి వృద్ధుల శాపం తప్పదని, పెన్షన్ బ్యాంకుల్లో వేసి వారిని బ్యాంకులు చుట్టూ తిప్పుతున్నారని జడ్పీటీసీల రాష్ట్ర సంఘం మాజీ అధ్యక్షుడు మీనాక్షి నాయుడు అన్నారు. -
కూటమి గెలుపుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశాయి. -
జగనాసురుడి రాజ్యం.. ఐసీయూలో ఆరోగ్యశ్రీ
[ 03-05-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చేరిన రోగులకు తిప్పలు తప్పడం లేదు. నెట్వర్క్ ఆసుపత్రులకు ఇవ్వాల్సిన సొమ్ము గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. -
జగన్ కుట్ర ఎండలో పండుటాకుల విలవిల
[ 03-05-2024]
నడవలేనివారు.. మంచానికే పరిమితమైనవారు.. దివ్యాంగులకు ఇంటివద్ద సొమ్ము పంపిణీ చేయాలని ఆదేశాలున్నా సుమారు 50 శాతం సచివాలయ సిబ్బంది గ్రామ, వార్డు సచివాలయాల్లో కూర్చొని పంపిణీ చేయడం గమనార్హం. -
ఉమ్మడి జిల్లా ఓటర్లు 34,48,38211
[ 03-05-2024]
ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాలు 34,48,382 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం గురువారం వెల్లడించింది. అందులో పురుషులు 16,98,607, మహిళలు 17,49,199, ఇతరులు 576 మంది ఉన్నారు. -
విపణి వేదికపై విఫల పాలన
[ 03-05-2024]
అన్నదాతకు అండగా నిలిచి వారికి.. వారికి ఆర్థిక చేయూత ఇచ్చేందుకు మార్కెట్ యార్డులు ఏర్పాటు చేశారు. యార్డుల్లో చేపట్టిన పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. -
జగన్ పాలనలో రైతుల పరిస్థితి దారుణం
[ 03-05-2024]
తెదేపా ప్రవేశ పెట్టిన మేనిఫెస్టో జనరంజకంగా ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి పేర్కొన్నారు. ఆలూరులోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
ప్రచార భేరి
[ 03-05-2024]
ఆదోనిలోని 8, 9 వార్డుల్లో ఆదోని నియోజకవర్గ భాజపా అభ్యర్థి డా.పార్థసారథి గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన బాధ్యుడు మల్లప్ప, తెదేపా, ఎమ్మార్పీఎస్, నాయకులు పాల్గొన్నారు. -
జగన్ ఆరాచకం.. తెలుగు గంగకు శోకం
[ 03-05-2024]
నాడు ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగు గంగ ప్రాజెక్టుపై ప్రస్తుత వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం రైతులకు శాపంగా పరిణమించింది. అయిదేళ్లలో జగనన్న ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ఎటువంటి శ్రద్ధ చూపకపోవడంతో తాగు, సాగునీటికి కష్టాలేర్పడ్డాయి. -
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 03-05-2024]
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నంద్యాల తెదేపా ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, శ్రీశైలం నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్రెడ్డి స్పష్టం చేశారు. -
సైకో పార్టీకి డిపాజిట్ కూడా రాదు
[ 03-05-2024]
ప్రజల్లో ఉత్సాహం చూస్తుంటే ఈసారి సైకో పార్టీకి డిపాజిట్ కూడా రాదని అర్థమవుతోందని నంద్యాల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అని ధ్వజమెత్తారు. -
స్వచ్ఛందంగా తెదేపాలోకి చేరికలు: బీసీ
[ 03-05-2024]
ప్రజలు అభివృద్ధిని కోరి స్వచ్ఛందంగా తెదేపాలోకి వస్తున్నారని తెదేపా అభ్యర్థి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం సంజామల మండలం కానాలకు చెందిన 60 కుటుంబాలు, ఆకుమళ్లకు చెందిన మైనార్టీ నాయకులు పార్టీలో చేరారు. -
తెదేపాలో చేరిన ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు
[ 03-05-2024]
నంద్యాలకు చెందిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఐఎంఏ యాక్షన్ కమిటీ ఛైర్మన్ డా.గుర్రాల రవికృష్ణ వైకాపాను వీడి తెదేపాలో చేరారు. -
కోట్ల, కేఈ కుటుంబాలతోనే అభివృద్ధి
[ 03-05-2024]
డోన్ నియోజకవర్గంలో కోట్ల, కేఈ కుటుంబాల పాలనలోనే అభివృద్ధి జరిగిందని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ పేర్కొన్నారు. -
5వ తేదీన నీట్
[ 03-05-2024]
వైద్య కళాశాలల్లో ప్రవేశాలకుగాను 5వ తేదీన ఎన్టీఏ ఆధ్వర్యంలో ‘నీట్’ నిర్వహించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు