logo

వైకాపాను సాగనంపుదాం

రానున్న ఎన్నికల్లో వైకాపాను సాగనంపుదామని మండల తెదేపా నాయకులు కేఈ నిఖిలేష్, సుబ్బరాయుడు అన్నారు.

Updated : 03 May 2024 16:20 IST

వెల్దుర్తి: రానున్న ఎన్నికల్లో వైకాపాను సాగనంపుదామని మండల తెదేపా నాయకులు కేఈ నిఖిలేష్, సుబ్బరాయుడు అన్నారు. సర్పరాజపురం, బాలాపురం, సిద్ధనగట్టు గ్రామాలలో తెదేపా నాయకులు శుక్రవారం ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు తెదేపా సంక్షేమ పథకాలతో పాటు, రూ.10 లక్షలు దాకా వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. పత్తికొండ తెదేపా అభ్యర్థి కేఈ. శ్యాంబాబు, ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు జ్ఞానేశ్వర్ గౌడ్, రమాకాంత్ రెడ్డి, వెంకట్ రాముడు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని