logo

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నంద్యాల తెదేపా ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, శ్రీశైలం నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు.

Published : 03 May 2024 03:49 IST

మహానంది, న్యూస్‌టుడే : చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నంద్యాల తెదేపా ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, శ్రీశైలం నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. మహానంది క్షేత్రంలో కొలువైన కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వరస్వామిని గురువారం వారు దర్శించుకొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్‌ పాలనలో అరాచకాలు, దౌర్జన్యాలు తప్ప అభివృద్ధి చేయలేదన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆర్భాటాలు తప్ప ఆచరణలు శూన్యమని విమర్శించారు. తెదేపా ప్రభుత్వం వస్తే ప్రజా సంక్షేమం పదిలంగా ఉంటుందని చెప్పారు. అనంతరం మండలంలోని శ్రీనగరం, అల్లినగరం, నందిపల్లె, తమ్మడపల్లె, బుక్కాపురం, బొల్లవరంలో వారు పర్యటించి తెదేపాను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు నాగభూపాల్‌రెడ్డి, బన్నూరు రామలింగారెడ్డి, బుడ్డారెడ్డి యశస్విని, శ్రీనివాసరెడ్డి, మధు పాల్గొన్నారు.

సున్నిపెంట సర్కిల్‌, న్యూస్‌టుడ్‌ : సున్నిపెంటలోని పలు ప్రాంతాల్లో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్‌రెడ్డి కుమార్తె బుడ్డా మేఘనరెడ్డి గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని