logo

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన శనివారం  పత్తికొండ పట్టణ శివారులోని రామకృష్ణారెడ్డి నగర్‌లో జరిగింది.

Published : 20 Apr 2024 13:59 IST

పత్తికొండ రూరల్‌: విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన శనివారం  పత్తికొండ పట్టణ శివారులోని రామకృష్ణారెడ్డి నగర్‌లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రామకృష్ణానగర్‌లో నివాసం ఉండే తాయప్ప (35) అనే వ్యక్తి రాత్రి కురిసిన వర్షపు నీటిని తొలగిస్తుండగా విద్యుత్ తీగను తగిలాడు. దీంతో  విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.  మృతుడికి భార్య కమల ముగ్గురు పిల్లలు ఉన్నారు. స్థానిక మార్కెట్ యార్డులోని కూరగాయల మండీలో దినసరి కూలిగా పని చేస్తూ జీవనం సాగించేవాడని స్థానికులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని