logo

రానున్నది చంద్రన్న రాజ్యం: తిక్కారెడ్డి

రానున్నది చంద్రన్న రాజ్యమని కర్నూలు జిల్లా తెదేపా పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఎమ్మిగనూరు పట్టణంలోని తిలక్‌నగర్‌, చెన్నకేశవకాలనీలో ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడుతో కలిసి ప్రచారం చేశారు.

Updated : 07 May 2024 06:29 IST

సూపర్‌ సిక్స్‌ పథకాల కరపత్రాన్ని చూపుతున్న తిక్కారెడ్డి, బీవీ జయనాగేశ్వరరెడ్డి, బీటీ నాయుడు

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: రానున్నది చంద్రన్న రాజ్యమని కర్నూలు జిల్లా తెదేపా పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఎమ్మిగనూరు పట్టణంలోని తిలక్‌నగర్‌, చెన్నకేశవకాలనీలో ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడుతో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వ ఆరాచక పాలనలో రాష్ట్ర ప్రజలు విసుగు చెందారని ఈ ఎన్నికల్లో జగన్‌కు దిమ్మ తిరిగే తీర్పు వస్తుందన్నారు. వైకాపా ప్రభుత్వానికి ప్రజలు సమాధి కట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు. దౌర్జన్యాలు చేస్తున్న ఈ సర్కార్‌ను కూల్చివేయాలన్నారు. తెదేపా సూపర్‌ సిక్స్‌ పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు రాందాస్‌గౌడు, కొండయ్యచౌదరి, మధుబాబు, ముల్లా కల్లీముల్లా, బందేనవాజ్‌, భాస్కర్‌, లక్ష్మన్న, ఉరుకుందు, భీమన్న, దయాసాగర్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని