తరలొచ్చిన ఉద్యోగులు.. వణికిపోయిన వైకాపా
ఎన్నికల తేదీ సమీపిస్తున్నకొద్దీ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పోస్టల్ బ్యాలట్ ఓటు వినియోగించుకునే కేంద్రాల వద్దకు అధికార పార్టీ అభ్యర్థులు, నేతలు తమ అనుచరులు వచ్చి ఉద్యోగులతో మాటలు కలిపి ప్రలోభాలకు తెరలేపారు.
69.80 శాతం ఓటు హక్కు వినియోగం
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: ఎన్నికల తేదీ సమీపిస్తున్నకొద్దీ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పోస్టల్ బ్యాలట్ ఓటు వినియోగించుకునే కేంద్రాల వద్దకు అధికార పార్టీ అభ్యర్థులు, నేతలు తమ అనుచరులు వచ్చి ఉద్యోగులతో మాటలు కలిపి ప్రలోభాలకు తెరలేపారు. ఓటు వేసేందుకు వెళ్తున్నవారితో తమకు అవకాశమివ్వాలని కోరారు. కొందరు ఉద్యోగులు మీరెవరని నిలదీస్తే అక్కడినుంచి తప్పించుకుని వెళ్లిపోతున్నారు. మరోవైపు ఎన్నడూ లేనివిధంగా పోస్టల్ ఓట్లు వేసేందుకు ఉద్యోగులు భారీగా తరలివస్తుండటంతో అధికార వైకాపాకు ఓటమి భయం పట్టుకుంది. ఎలాగైనా ఓట్లు కొనేసి గెలిచేందుకు అడ్డదారులు వెతుకుతోంది.
కేంద్రాల్లో తప్పని ఇబ్బందులు
పీవోలు, ఏపీవోలకు రెండో విడత శిక్షణ ఇచ్చి అక్కడ పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఇచ్చారు. ఫలితంగా చాలాచోట్ల ఉద్యోగులు గంటల తరబడి వరుసలో నిల్చోవాల్సి వస్తోంది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తొలి రోజున ఇరుకు ప్రదేశాల్లో.. ఒకేచోట కౌంటర్లు ఏర్పాటు చేయడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. రెండోరోజూ ఇదే పరిస్థితి నెలకొంది.
ఆ ఓట్లు చెల్లనట్లేనా
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల బాగోతం ఆరంభం నుంచి విమర్శల పాలవుతోంది. ఫారం-12 దరఖాస్తుల స్వీకరణ నుంచి ఓటు వేసే దాకా బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. కొంతమంది ఆర్వోలు తప్పు చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చే డిక్లరేషన్ ఫామ్పై అక్కడే ఉన్న గెజిటెడ్ అధికారి ఓటరు వివరాలు ధ్రువీకరిస్తూ సంతకం చేసి స్టాంప్ వేయాల్సి ఉంటుంది. లేకుంటే అనర్హత కింద పక్కన పెడతారు. కొందరు ఉద్యోగ, ఉపాధ్యాయులు డిక్లరేషన్ ఫారాలపై గెజిటెడ్ అధికారితో సంతకాలు చేయించుకొని స్టాంపు వేయించుకోకుండా హడావుడిగా ఓట్లేసేస్తున్నారు. ఈ తరహా ఓట్లు వందల్లోనే ఉంటాయని అంచనా..
భారీగా తరలివచ్చి..
రెండో రోజైన మంగళవారం పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు వేసేందుకు ఉద్యోగ, ఉపాధ్యాయులు పోటెత్తారు. పీవోలు, ఏపీవోలు, ఇతర విధులు నిర్వహించే ఉద్యోగులు, పోలీసులు, బీఎల్వోలు, అంగన్వాడీ కార్యకర్తలు ఇలా.. అందరూ ఓటేసేందుకు కేంద్రాలకు తరలివచ్చారు. మొదటి రోజు 6,291 మంది ఓటేయగా.. రెండో రోజు కర్నూలు, పాణ్యం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో అత్యధిక మంది ఓట్లేయడం విశేషం. మొత్తం రెండో రోజు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి 7,916 మంది ఓటేశారు. రెండు రోజుల్లో 14,207 (69.80 శాతం) మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
నేడు ఓటింగ్కు చివరి గడువు
పోస్టల్ బ్యాలట్ ఓట్లేసేందుకు వచ్చే ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు. పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి బి.క్యాంపులోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఏర్పాటుచేసిన పోస్టల్ బ్యాలట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఆమె మంగళవారం పరిశీలించారు. ఉద్యోగులందరూ బుధవారం సాయంత్రంలోగా పోస్టల్ బ్యాలట్ను సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ఎలాంటి పొరబాట్లకు తావులేకుండా ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ వెంట పాణ్యం ఆర్వో, జేసీ నారపురెడ్డి మౌర్య, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చల్లా కల్యాణి తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుర జనం గొంతులో గరళం
[ 19-05-2024]
ఏటా నీటి పన్నుల కింద రూ.లక్షలు సమకూరుతున్నాయి. నీటి శుద్ధి పుర బడ్జెట్ కింద భారీగా వెచ్చిస్తున్నారు.. లీకేజీల నివారణకు రూ.లక్షలు ధారబోస్తున్నారు.. నీరు రంగు మారుతోంది.. దుర్వాసన వస్తోంది.. తాగలేకపోతున్నామని పుర ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. -
ఆర్యూ.. అక్రమాల పుట్ట
[ 19-05-2024]
రాయలసీమ విశ్వవిద్యాలయంలో అక్రమాలు వెలుగులోకి వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.. విచారణ సమగ్రంగా కొనసాగడం లేదు.. కొన్ని ఘటనల్లో విచారణలు పూర్తైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. -
పరీక్ష ప్రశ్నార్థకం
[ 19-05-2024]
రాయలసీమ విశ్వవిద్యాలయంలోని పరీక్షల విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి నిర్లక్ష్యంతో వందల విద్యార్థుల జీవితాలు ఇబ్బందుల్లో పడ్డాయి. -
చిరుజల్లులకే ఛిద్రం
[ 19-05-2024]
కొత్తగా నిర్మిస్తున్న 340(బి) జాతీయ రహదారి చిరుజల్లులకే ఛిద్రమైంది.. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పగుల్లొచ్చాయి. హడావుడిగా పనులు చేయడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
బాక్సింగ్ కింగ్లు.. ఆదోని కుర్రాళ్లు
[ 19-05-2024]
ఆ కుర్రాళ్లు కొట్టే దెబ్బలకు దవడలు అదిరిపోతాయి.. మెదడులోని నరాల్లో కదలికలు పుడతాయి.. రింగులోకి ప్రత్యర్థి రావాలంటేనే భయపడే పరిస్థితి.. పతకాలు మాత్రం వచ్చి వాలిపోతాయి. -
స్ట్రాంగ్ రూమ్ల ఎదుట నిరంతర నిఘా: కలెక్టర్
[ 19-05-2024]
పార్లమెంట్, శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల ఎదుట 24 గంటలు నిరంతర నిఘా ఉంచినట్లు కలెక్టర్ కె.శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్రెడ్డి పేర్కొన్నారు. -
ఓపీక పడితేనే వైద్యం
[ 19-05-2024]
నంద్యాల సర్వజన ఆసుపత్రిలో ఓపీ సేవలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పెంచినా వైద్యులు మాత్రం గదుల్లో ఉండకపోవడంతో అరకొరగా సేవలు అందుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. -
లక్ష్య సాధనలోగెలుపు సందేశం
[ 19-05-2024]
తల్లిదండ్రుల ప్రోత్సాహం.. కష్టపడి చదవడం.. అనుకున్న లక్ష్యం చేరుకోవాలన్న కసి.. వెరసి ఆ విద్యార్థిని విజయం వైపు నడిపించాయి. పదో తరగతిలో పదికి పది.. ఇంటర్లో ఉత్తమ ఫలితాలతో ప్రశంసలు అందుకున్నాడు. -
బీఎల్వోలకు అందని భృతి
[ 19-05-2024]
ఎన్నికల విధులకు సంబంధించి బీఎల్వోలు నిరంతరం కష్టపడ్డారు. క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు.. ఓటర్ల మార్పులు, చేర్పుల్లో కీలకపాత్ర పోషించారు. పైసా పారితోషికం అందడం లేదు. -
తెలంగాణ ఎంసెట్లో విద్యార్థుల ప్రతిభ
[ 19-05-2024]
తెలంగాణ ఎంసెట్ (అగ్రికల్చర్)లో కర్నూలు నారాయణ విద్యార్థులు ప్రతిభ చాటారని డీజీఎం గోవర్ధన్ తెలిపారు. -
మహానంది క్షేత్రంలో భక్తుల రద్దీ
[ 19-05-2024]
మహానంది పుణ్యక్షేత్రంలో శనివారం భక్తుల రద్దీతో సందడి నెలకొంది. వరుసగా సెలవులు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి మహానందికి తరలివచ్చారు. -
నృసింహస్వామి జయంతి బ్రహ్మోత్సవాలు
[ 19-05-2024]
వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో నరహరుడు అహోబిలం లక్ష్మీనృసింహస్వామి వేణుగోపాల స్వామి అలంకరణలో శనివారం భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా పల్లకిపై కొలువుదీర్చి ఆలయ తిరువీధుల్లో మేళతాళాలతో ఊరేగించారు.