రండి రండి.. ఓటుకు రూ.3 వేలు
నందికొట్కూరులో రెండో రోజు మంగళవారం పోస్టల్ బ్యాలట్ ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగులకు వైకాపా నాయకులు ఒక్కొక్కరికి రూ.3 వేలు ఇచ్చి ఓటు వేసేటప్పుడు తమకు చూపించివేయాలన్నారు.
నందికొట్కూరు, న్యూస్టుడే : నందికొట్కూరులో రెండో రోజు మంగళవారం పోస్టల్ బ్యాలట్ ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగులకు వైకాపా నాయకులు ఒక్కొక్కరికి రూ.3 వేలు ఇచ్చి ఓటు వేసేటప్పుడు తమకు చూపించివేయాలన్నారు. దీంతో కొందరు డబ్బు తీసుకుని వైకాపా నాయకుడి వెంట వెళ్లి ఓటు వేసి వచ్చారు. మరికొందరు కేంద్రంలోకి వచ్చి ఇలా చేయడమేంటని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు పట్టించుకోకపోవడం లేదని మండిపడ్డారు. అలాగే కేంద్రం వద్ద పోస్టల్ ఓటర్ల జాబితా గోడకు అతికించక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం పోస్టల్ బ్యాలట్కు సంబంధించిన కవర్లు చెత్తలో దర్శనమిచ్చాయి.
ఆత్మకూరు, న్యూస్టుడే: ఆత్మకూరులోని ఎన్నికల కేంద్రం వద్ద రెండో రోజు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శ్రీశైల నియోజకవర్గంలో విధులు కేటాయించిన ఉద్యోగుల పేర్లు జాబితాలో లేకపోవడంతో ఆందోళన చెందారు. తమ ఓటు హక్కు ఎక్కడుందని ప్రశ్నిస్తుంటే అధికారుల నుంచి సరైన సమాధానం రాలేదన్నారు. గడువు పెంచి అందరూ ఓటు వినియోగించుకోనేలా చూడాలన్నారు. మరి కొందరు కేంద్రం వద్ద గెజిట్ సంతకం, సీల్ వేయించుకునేందుకు సంబంధిత అధికారుల కోసం వెతకాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఓటుకు రూ.2 వేలు
చరవాణికి ఓటీపీ వస్తేనే డబ్బులు
ఆత్మకూరు పట్టణం, న్యూస్టుడే: ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార పార్టీ నాయకులు ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. ఆత్మకూరు పురపాలక సంఘంలోని వార్డుల్లో మంగళవారం వైకాపా నాయకులు ఇంటింటికి వెళ్లి రూ.2 వేల నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారని స్థానికులు తెలిపారు. పంపిణీ ముందురోజు ఇంటింటికి వెళ్లి టోకెన్లు అందజేశారు. టోకెన్ ఇచ్చిన ఇంటికెళ్లి డబ్బులు పంపిణీ చేసే ముందు ఓటర్ల చరవాణి తీసుకొని టోల్ ఫ్రీ నంబరుకు డయల్ చేస్తున్నారు. అనంతరం చరవాణికి వచ్చిన ఓటీపీ నంబరును రాసుకొని నగదు ఇస్తున్నారు. దీనిపై పోలీసులు , ఎన్నికల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
[ 19-05-2024]
ద్వాదశ జ్యోతిర్లంగ క్షేత్రమైన శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. -
టిడ్కో ఇళ్లలో పోలీసుల సోదాలు
[ 19-05-2024]
పట్టణంలోని కోయిలకుంట్ల రోడ్డులో ఉన్న ప్రభుత్వ టిడ్కో ఇళ్ల సముదాయాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. -
పుర జనం గొంతులో గరళం
[ 19-05-2024]
ఏటా నీటి పన్నుల కింద రూ.లక్షలు సమకూరుతున్నాయి. నీటి శుద్ధి పుర బడ్జెట్ కింద భారీగా వెచ్చిస్తున్నారు.. లీకేజీల నివారణకు రూ.లక్షలు ధారబోస్తున్నారు.. నీరు రంగు మారుతోంది.. దుర్వాసన వస్తోంది.. తాగలేకపోతున్నామని పుర ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. -
ఆర్యూ.. అక్రమాల పుట్ట
[ 19-05-2024]
రాయలసీమ విశ్వవిద్యాలయంలో అక్రమాలు వెలుగులోకి వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.. విచారణ సమగ్రంగా కొనసాగడం లేదు.. కొన్ని ఘటనల్లో విచారణలు పూర్తైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. -
పరీక్ష ప్రశ్నార్థకం
[ 19-05-2024]
రాయలసీమ విశ్వవిద్యాలయంలోని పరీక్షల విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి నిర్లక్ష్యంతో వందల విద్యార్థుల జీవితాలు ఇబ్బందుల్లో పడ్డాయి. -
చిరుజల్లులకే ఛిద్రం
[ 19-05-2024]
కొత్తగా నిర్మిస్తున్న 340(బి) జాతీయ రహదారి చిరుజల్లులకే ఛిద్రమైంది.. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పగుల్లొచ్చాయి. హడావుడిగా పనులు చేయడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
బాక్సింగ్ కింగ్లు.. ఆదోని కుర్రాళ్లు
[ 19-05-2024]
ఆ కుర్రాళ్లు కొట్టే దెబ్బలకు దవడలు అదిరిపోతాయి.. మెదడులోని నరాల్లో కదలికలు పుడతాయి.. రింగులోకి ప్రత్యర్థి రావాలంటేనే భయపడే పరిస్థితి.. పతకాలు మాత్రం వచ్చి వాలిపోతాయి. -
స్ట్రాంగ్ రూమ్ల ఎదుట నిరంతర నిఘా: కలెక్టర్
[ 19-05-2024]
పార్లమెంట్, శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల ఎదుట 24 గంటలు నిరంతర నిఘా ఉంచినట్లు కలెక్టర్ కె.శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్రెడ్డి పేర్కొన్నారు. -
ఓపీక పడితేనే వైద్యం
[ 19-05-2024]
నంద్యాల సర్వజన ఆసుపత్రిలో ఓపీ సేవలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పెంచినా వైద్యులు మాత్రం గదుల్లో ఉండకపోవడంతో అరకొరగా సేవలు అందుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. -
లక్ష్య సాధనలోగెలుపు సందేశం
[ 19-05-2024]
తల్లిదండ్రుల ప్రోత్సాహం.. కష్టపడి చదవడం.. అనుకున్న లక్ష్యం చేరుకోవాలన్న కసి.. వెరసి ఆ విద్యార్థిని విజయం వైపు నడిపించాయి. పదో తరగతిలో పదికి పది.. ఇంటర్లో ఉత్తమ ఫలితాలతో ప్రశంసలు అందుకున్నాడు. -
బీఎల్వోలకు అందని భృతి
[ 19-05-2024]
ఎన్నికల విధులకు సంబంధించి బీఎల్వోలు నిరంతరం కష్టపడ్డారు. క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు.. ఓటర్ల మార్పులు, చేర్పుల్లో కీలకపాత్ర పోషించారు. పైసా పారితోషికం అందడం లేదు. -
తెలంగాణ ఎంసెట్లో విద్యార్థుల ప్రతిభ
[ 19-05-2024]
తెలంగాణ ఎంసెట్ (అగ్రికల్చర్)లో కర్నూలు నారాయణ విద్యార్థులు ప్రతిభ చాటారని డీజీఎం గోవర్ధన్ తెలిపారు. -
మహానంది క్షేత్రంలో భక్తుల రద్దీ
[ 19-05-2024]
మహానంది పుణ్యక్షేత్రంలో శనివారం భక్తుల రద్దీతో సందడి నెలకొంది. వరుసగా సెలవులు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి మహానందికి తరలివచ్చారు. -
నృసింహస్వామి జయంతి బ్రహ్మోత్సవాలు
[ 19-05-2024]
వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో నరహరుడు అహోబిలం లక్ష్మీనృసింహస్వామి వేణుగోపాల స్వామి అలంకరణలో శనివారం భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా పల్లకిపై కొలువుదీర్చి ఆలయ తిరువీధుల్లో మేళతాళాలతో ఊరేగించారు.
తాజా వార్తలు (Latest News)
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ అసంతృప్తి
-
తెలంగాణ మంత్రివర్గ భేటీకి ముహూర్తం ఖరారు
-
తెలంగాణలో పలు చోట్ల వర్షం.. పిడుగుపాటుకు ముగ్గురి మృతి
-
నరసరావుపేటలో రెండో రోజు సిట్ దర్యాప్తు.. పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్