logo

అభివృద్ధిపై పాలక వర్గాలను నిలదీయండి

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాయలసీమలో ఓట్లు అడగడానికి వచ్చే అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులను రాయలసీమ అభివృద్ధి, ప్రాజెక్టులు, ఉపాధి అంశాలపై ప్రశ్నించి నిలదీయాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షురాలు విమలక్క అన్నారు.

Published : 08 May 2024 17:58 IST

గోనెగండ్ల: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాయలసీమలో ఓట్లు అడగడానికి వచ్చే అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులను రాయలసీమ అభివృద్ధి, ప్రాజెక్టులు, ఉపాధి అంశాలపై ప్రశ్నించి నిలదీయాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షురాలు విమలక్క అన్నారు. బుధవారం గోనెగండ్లతో పాటు వివిధ గ్రామాల్లో ఆమె సీమచాటింపు యాత్ర కార్యక్రమం నిర్వహించారు. విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఏళ్ళ తరబడి పాలిస్తున్న నాయకులు సీమ వెనుకబాటు తనానికి గురి చేస్తూ ప్రజలను ఓట్ల యంత్రాలు గానే భావిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్త్రీ విముక్తి సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సుజ్ఞానమ్మ కరీంబాషా, మన్సూర్, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుంకన్న పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని