తొడలోకి దూసుకెళ్లిన చెట్టుకొమ్మ
ఓ యువకుడి తొడలోకి చెట్టు కొమ్మ దూసుకెళ్లి ప్రాణాపాయ స్థితికి చేరుకోగా కర్నూలు సర్వజన ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి ప్రాణాలు నిలిపారు. తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా మానవపాడు మండలం అమరవాయి గ్రామానికి చెందిన మాలిక్ (21) ట్రాక్టర్ డ్రైవరుగా ఉన్నారు.
క్లిష్టమైన ఆపరేషన్ చేసి ప్రాణాలు నిలిపిన డాక్టర్లు
కర్నూలు సర్వజన ఆస్పత్రి వైద్యుల ఘనత
వివరాలు వెల్లడిస్తున్న వైద్యులు
కర్నూలు వైద్యాలయం, న్యూస్టుడే : ఓ యువకుడి తొడలోకి చెట్టు కొమ్మ దూసుకెళ్లి ప్రాణాపాయ స్థితికి చేరుకోగా కర్నూలు సర్వజన ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి ప్రాణాలు నిలిపారు. తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా మానవపాడు మండలం అమరవాయి గ్రామానికి చెందిన మాలిక్ (21) ట్రాక్టర్ డ్రైవరుగా ఉన్నారు. ఈనెల 2న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడిన ఘటనలో అతని తొడలోకి చెట్టు కొమ్మ బలంగా దూసుకెళ్లింది. వెంటనే అతడిని కర్నూలు సర్వజన ఆస్పత్రికి తీసుకొచ్చారు. అనస్థీషియా వైద్యురాలు సంధ్య, వైద్యులు విజయ్శంకర్, భాస్కరరెడ్డి, జగన్మోహన్రెడ్డి, అనూషా కలిసి 2వ తేదీ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల వరకు క్లిష్టమైన ఆపరేషన్ను విజయవంతంగా చేసి తొడలోకి దిగిన చెట్టు కొమ్మను జాగ్రత్తగా తొలగించి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం అతను పూర్తిగా కోలుకోవడంతో బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు. అతనికి ఆరోగ్యశ్రీ లేకున్నా శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ వెంకటరంగారెడ్డి మాట్లాడుతూ ఇలాంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలు కేవలం బోధనా ఆస్పత్రుల్లోనే సాధ్యమవుతాయని చెప్పారు. మొదట ప్లాస్టిక్ సర్జరీ, కార్డియోథొరాసిక్ విభాగంతోపాటు వివిధ విభాగాల వైద్యులు పరిశీలించి పలు పరీక్షలు నిర్వహించిన తర్వాత జనరల్ సర్జరీ వైద్యులు డాక్టర్ చక్రవర్తి, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ విశాల ఆధ్వర్యంలో వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేశారని చెప్పారు. వైద్యాలయంలో గతేడాది సుమారు 17,798 శస్త్రచికిత్సలు చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నట్లు చెప్పారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టినరసమ్మ, డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ విజయ్శంకర్, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ విశాల, జనరల్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ హరిచరణ్, డాక్టర్ రామకృష్ణనాయక్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సర్వే తప్పులు.. రుణానికి తిప్పలు
[ 20-05-2024]
భూసర్వేలో జరిగిన తప్పులు రైతులకు శాపంగా మారాయి.. భూహక్కు పత్రాల్లో తప్పులు.. విస్తీర్ణంలో తేడాలు.. ఉమ్మడి హక్కు పత్రాల కారణంగా పంట రుణాల నవీకరణకు బ్యాంకర్లు కొర్రీలు పెడుతున్నారు. -
గేట్లు ఎత్తలేరు.. తాళ్లు బిగించలేరు
[ 20-05-2024]
7.10 లక్షల ఎకరాలకు సాగునీరు.. వేలాది పల్లెలకు మంచినీరు అందించే సాగు నీటి ప్రాజెక్టుల నిర్వహణ అటకెక్కింది.. గత కొంతకాలంగా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. -
అతిసారం.. కలవరం
[ 20-05-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 973 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.. ఇందులో మేజర్ 32, మైనర్ 941 వరకు ఉన్నాయి. 2021లో జరిగిన ఎన్నికల్లో 159 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. -
గుట్టుగా ఇసుకను తోడేస్తున్నారు
[ 20-05-2024]
తుంగభద్ర నదిలోని రీచ్ల వద్ద ఇసుకను గుట్టుగా తవ్వుతున్నట్లు తేలింది..కౌతాళం మండలం గుడికంబాలి, మరళి రీచ్లను ఆదివారం కలెక్టర్ సృజన ఆకస్మికంగా తనిఖీ చేశారు. -
దాచిన సొమ్ము దోచుకున్నారు
[ 20-05-2024]
పేద, మధ్యతరగతి ప్రజలు పైసా..పైసా కూడబెట్టి పోస్టాఫీసుల్లో డబ్బును దాచుకుందామంటే కొందరు సిబ్బంది అప్పనంగా సొంతానికి వాడేస్తున్నారు. -
మీటరు గిర్రు.. గుండె గుబిల్లు
[ 20-05-2024]
ఫిబ్రవరి వేడెక్కింది.. మార్చి ‘మాడ’కొట్టింది.. ఏప్రిల్ కుతకుత ఉడికింది.. ఇలా మే మొదటి వారం వరకు ఎండలు దంచికొట్టాయి.. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉమ్మడి జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉంది. -
కళలకు వేదిక..ప్రతిభా వీచిక
[ 20-05-2024]
చిన్నారుల అభిరుచులకు అనుగుణంగా వివిధ కళల్ని నేర్చుకునేందుకు నంద్యాలలోని కళారాధన సంస్థ ప్రోత్సాహాన్ని అందిస్తోంది. -
నిధుల ఆటంకం
[ 20-05-2024]
క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా అవి కేవలం మాటలకే పరిమితమయ్యాయి. ఆటలు అటకెక్కాయి. క్రీడాభివృద్ధికి నిధుల కేటాయింపు అంతంతమాత్రంగానే ఉంది. -
పంట నష్టం.. గణన కష్టం
[ 20-05-2024]
రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24వ తేదీలోగా పంట నష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ కమిషన్ వెల్లడించింది. -
చెరువులో శవాలు
[ 20-05-2024]
నగర శివారు.. గార్గేయపురం పరిధిలోని నగరవనం చెరువులో ముగ్గురు గుర్తు తెలియని మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం కలకలం రేపింది.
తాజా వార్తలు (Latest News)
-
సార్వత్రిక సమరం.. ఐదో విడత పోలింగ్ ప్రారంభం.. ఆ 2 స్థానాలపై అందరి దృష్టి
-
రోజూ రూ.కోటిన్నర.. మరి నష్టాలెలా?.. మెట్రోకు భారమవుతున్న వడ్డీలు
-
‘నైరుతి’ ప్రయాణం మొదలైంది..
-
ఏమిటీ చెల్లింపులు.. ఎన్నికల విధుల పట్ల ఉద్యోగుల పెదవి విరుపు
-
ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారు
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే