ప్రజాధనం గాలికొదిలేశారు
అత్యవసర వైద్యసేవల సమయంలో రోగికి కృత్రిమశ్వాస అందించడం తప్పనిసరి. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ కోసం ఎన్నో అగచాట్లు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పేట జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంటుకు తాళం
మీకు అన్ని వసతులతో ఇల్లుంది..
దానికి తాళం వేసి పక్కనే వేరొక గృహం అద్దెకు తీసుకుంటారా?
అలా చేస్తే ఏమనుకోవాలి?
నారాయణపేట జిల్లా ఆస్పత్రిలో అచ్చంగా అలాగే చేస్తున్నారు. అధునాతన ఆక్సిజన్ ప్లాంట్కు మూతవేసి రూ.లక్షలతో బయట ఆక్సిజన్ కొంటున్నారు. ఇదేమిటో చోద్యం.
న్యూస్టుడే-(పాతబస్టాండ్)నారాయణపేట : అత్యవసర వైద్యసేవల సమయంలో రోగికి కృత్రిమశ్వాస అందించడం తప్పనిసరి. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ కోసం ఎన్నో అగచాట్లు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కొవిడ్ రెండో వేవ్ సమయంలో నారాయణపేట జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.1.2 కోట్లతో 2021 అక్టోబరులో ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంటు ఏర్పాటు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సహజ సిద్ధమైన గాలిని ఒత్తిడికి గురిచేసి నైట్రోజన్, కార్బన్డై ఆక్సైడ్లను వేరుచేసి ఆక్సిజన్ ఉత్పత్తి చేసేలా అమర్చారు.
ఈ ప్లాంటు గంటకు సుమారు 500 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది. వందలాది కరోనా బాధితుల ప్రాణాలు కాపాడటం సాధ్యమయ్యింది.
ఆస్పత్రిలోని 92 పడకలకు ఆక్సిజన్ లైన్ బిగించారు. కరోనా తగ్గిపోయినా ఆస్పత్రికి వివిధ సమస్యలతో వచ్చే వారికి ఆక్సిజన్ ఎంతో అవసరం. అయినా నిర్వహణను పట్టించుకోకుండా మూలపడేశారు.
ఎంతో అవసరం
ప్రమాదాలలో క్షతగాత్రులైన వారు, గుండె జబ్బుల పీడితులు, మెదడు సక్రమంగా పనిచేయని రోగులు, ప్రసవ సమయంలో గర్భిణులకు ఇబ్బందులు ఎదురైనప్పుడు, ఉపిరితిత్తుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారికి కృత్రిమ శ్వాస అందించాలి. అన్ని ఐసీయూలలో ఆక్సిజన్ ఏర్పాట్లు తప్పనిసరి. అత్యవసర సమయంలో అందుబాటులో లేకపోతే రోగి ప్రాణాలకే ముప్పు.
వ్యయం తగ్గించే అవకాశం ఉన్నా..
ప్రస్తుతం నారాయణపేట జిల్లా ఆస్పత్రికి ట్యాంకర్ల ద్వారా ఆక్సిజన్ తెప్పిస్తున్నారు. ఒక్కొక్క ట్యాంకరు ఖరీదు రూ.3లక్షల వరకు ఉంటుంది. సాధారణ రోజుల్లో నెలకు 3 నుంచి 4 ట్యాంకర్లు అవసరం. సీజనల్ వ్యాధులు విజృంభించే సమయంలో వినియోగం మరింత పెరుగుతుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న ప్లాంట్ను మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకువస్తే ఎంతో డబ్బు ఆదా అవుతుంది. ఆ నిధులతో మరింత నాణ్యమైన వైద్యం అందించడానికి వీలు కలుగుతుంది. ఇది తెలిసినా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్నది అంతుచిక్కని ప్రశ్న.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం..
ఆక్సిజన్ ప్లాంటులో కొంతకాలంగా ఉత్పత్తి నిలిచిపోయింది. మరమ్మతులు అవసరం. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. దిల్లీ నుంచి నిపుణులను రప్పించి బాగుచేయించాలి.ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతానికి జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్కు కొరత లేదు.
డా.రంజిత్కుమార్. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, నారాయణపేట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సుంకేసుల జలాశయం నుంచి నీటి విడుదల
[ 16-06-2024]
రాజోలి శివారులోని సుంకేశుల జలాశయం నుంచి రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. -
అత్తారింట్లో అల్లుడి దారుణ హత్య
[ 16-06-2024]
ఉండవెల్లి మండల కేంద్రంలో అత్తారింటికి వచ్చిన అల్లుడు హత్యకు గురైన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన -
ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి: డీకే అరుణ
[ 16-06-2024]
పాలమూరు అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం దేవరకద్ర మండలం చిన్నరాజమూర్ గ్రామంలోని శ్రీఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కు తీర్చుకున్నారు. -
పాలమూరుకు కొత్త పాలనాధికారులు
[ 16-06-2024]
ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేసిన ఐఏఎస్ల బదిలీల్లో ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల కలెక్టర్లకు స్థాన చలనం కలిగింది. ఆయా జిల్లాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఏఏఎస్ అధికారులు కలెక్టర్లుగా వస్తున్నారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి. -
నాన్నా వందనం.. విజయం నీకంకితం!
[ 16-06-2024]
తల్లి బిడ్డను నవమాసాలు మోస్తే.. తండ్రి పాతికేళ్లు మోస్తాడు. కలలో, మెలకువలో పిల్లల గురించే ఆలోచిస్తాడు. సమాజంలో ఉన్నత స్థానంలో నిలిపేందుకు రెక్కలు ముక్కలు చేసుకుంటాడు. ఎంత ఖర్చయినా భరిస్తాడు. -
జనరంజకంగా ప్రజాపాలన
[ 16-06-2024]
రాష్ట్రంలో ప్రజాపాలన జనరంజకంగా కొనసాగుతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి పేర్కొన్నారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లిలో పర్యటించారు. -
చిన్నపొర్ల ఘటనలో ఐదుగురి అరెస్టు
[ 16-06-2024]
విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. చిన్నపొర్ల ఘటనకు సంబంధించి శనివారం ఆయన ఇక్కడ ఠాణా వద్ద విలేకరులతో మాట్లాడారు. -
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం
[ 16-06-2024]
రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం పాలైన ఘటన మహబూబ్నగర్ మండలంలో చోటు చేసుకుంది. గ్రామీణ ఠాణా ఎస్సై విజయ్కుమార్ కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేటకు చెందిన తౌసిఫ్ అన్వర్ అలీ(20) దేవరకద్ర సమీపంలోని స్విట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. -
భవనాలు శిథిలం.. సమస్యలు అనేకం
[ 16-06-2024]
భాషాభివృద్ధికి, స్వాతంత్య్రోద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన గ్రంథాలయాలు అవసాన దశకు చేరుతున్నాయి. రెండు దశాబ్దాలుగా లైబ్రేరియన్ల నియామకం లేకపోవడంతో జిల్లాలో ఉన్న ఒకరిద్దరికి మూడు, నాలుగు గ్రంథాలయాలకు ఇన్ఛార్జిలుగా నియమించారు. -
సీట్లు తక్కువ.. దరఖాస్తులు ఎక్కువ
[ 16-06-2024]
ఈ చిత్రం శనివారం మధ్యాహ్నం ధన్వాడ కస్తూర్బా గాంధీ పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న మరికల్ ఆంగ్ల మాధ్యమ కేజీబీవీ వద్ద కనిపించింది. ఆరో తరగతి ప్రవేశాల కోసం పిల్లల్ని తీసుకొని వచ్చిన తల్లిదండ్రులు ఎలాగైనా ప్రవేశం కల్పించాల్సిందిగా ప్రత్యేకాధికారి రాజ్యలక్ష్మికి విన్నవిస్తుండగా తీసింది. -
సుంకేశుల నుంచి నీటి విడుదల
[ 16-06-2024]
వర్షాల ప్రభావంతో తుంగభద్ర నదికి వరద ప్రవాహం పెరగడంతో రాజోలి శివారులోని సుంకేశుల జలాశయం నుంచి 2 గేట్లను ఎత్తి శనివారం నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి జలాశయానికి 18,500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. -
గత కలెక్టర్పై భూ అక్రమాల ఆరోపణ
[ 16-06-2024]
జిల్లా కలెక్టర్గా వల్లూరు క్రాంతి పనిచేసిన సమయంలో భూ అక్రమాలకు పాలడ్డారని జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఓఎస్డీ హరిప్రసాద్కు శనివారం సచివాలయంలో ఫిర్యాదు చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ నీటి సంక్షోభం.. పైపులైన్లకు పోలీసు పహారా?
-
రైల్లో ప్రయాణించిన కేంద్ర మంత్రి..ఫొటోలు వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పవన్ కల్యాణ్కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్.. అదేంటంటే?
-
దర్శన్, పవిత్రా గౌడలకు వివాహమైందా? ఆయన లాయర్ ఏమన్నారంటే..
-
ఆరోగ్యశ్రీలో గత ప్రభుత్వ అక్రమాలపై చర్యలు: మంత్రి సత్యకుమార్