రేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈసారి ఉమ్మడి జిల్లాలో ఫలితాలు అనుకున్న స్థాయిలో రాలేదు.
హాజరుకానున్న 30,978 మంది విద్యార్థులు
మహబూబ్నగర్ బాలికల జూనియర్ కళాశాలలో సన్నద్ధత పరీక్ష రాస్తున్న విద్యార్థినులు
న్యూస్టుడే, మహబూబ్నగర్ విద్యావిభాగం : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈసారి ఉమ్మడి జిల్లాలో ఫలితాలు అనుకున్న స్థాయిలో రాలేదు. రాష్ట్రస్థాయిలో ప్రథమ సంవత్సరం ఫలితాల్లో చివరి నుంచి రెండో స్థానం(34వ స్థానం)లో జోగులాంబ గద్వాల జిల్లా ఉండగా.. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో చివరి నుంచి రెండో స్థానంలో నారాయణపేట జిల్లా నిలిచింది. రాష్ట్రస్థాయిలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో వరుసగా మహబూబ్నగర్ జిల్లా 53.94 (ప్ర.సం.) - 64.21 (ద్వి.సం.), నాగర్కర్నూల్ 53.48 - 59.06, నారాయణపేట 52.78 - 53.81, వనపర్తి 45.57 - 64.75, జోగులాంబ-గద్వాల 44.3 (ప్ర.సం.) - 62.82 (ద్వి.సం.) శాతం ఉత్తీర్ణత నమోదైంది.
తరగతులతో సందేహాల నివృత్తి.. : ఈ నెల 24 నుంచి ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షలను విద్యార్థులు రాయనున్నారు. ఫలితాలు మెరుగయ్యేందుకు ఈ పరీక్షలపై అధికారులు దృష్టి పెట్టారు. ఈసారి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో అనుత్తీర్ణులైన విద్యార్థులకు కొన్నిచోట్ల ఆన్లైన్ తరగతులు, మరికొన్ని చోట్ల ప్రత్యక్ష తరగతులు నిర్వహించి వారి సందేహాలను నివృత్తి చేశారు. వివిధ సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులకు నిపుణులు నెల పాటు శిక్షణ ఇచ్చారు. జిల్లాలో పరీక్షల పర్యవేక్షణనకు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ముఖ్య పర్యవేక్షకులు, విభాగ పర్యవేక్షకులు, సిట్టింగ్ స్వ్కాడ్లు, ప్లయింగ్ స్క్వాడ్లను పరీక్షల పర్యవేక్షణకు ఏర్పాటు చేశారు. తరగతి గదుల్లో చీకటి లేకుండా విద్యుత్తు సౌకర్యం కల్పించారు. వేసవి నేపథ్యంలో తాగునీరు, ఫ్యాన్లు తదితర వసతులు కల్పించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 30,978 మంది విద్యార్థులకు అధికారులు 74 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదు : సప్లిమెంటరీ పరీక్ష రాసే విద్యార్థులు సంబంధిత కళాశాలలో లేదా ఇంటర్ విద్యాశాఖ పోర్టల్ నుంచి హాల్టికెట్లు పొందవచ్చు. పోర్టల్ నుంచి తీసుకున్న హాల్టికెట్పై కళాశాల ప్రిన్సిపల్ సంతకం లేకున్నా పరీక్షకు అనుమతిస్తారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సుంకేసుల జలాశయం నుంచి నీటి విడుదల
[ 16-06-2024]
రాజోలి శివారులోని సుంకేశుల జలాశయం నుంచి రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. -
అత్తారింట్లో అల్లుడి దారుణ హత్య
[ 16-06-2024]
ఉండవెల్లి మండల కేంద్రంలో అత్తారింటికి వచ్చిన అల్లుడు హత్యకు గురైన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన -
ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి: డీకే అరుణ
[ 16-06-2024]
పాలమూరు అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం దేవరకద్ర మండలం చిన్నరాజమూర్ గ్రామంలోని శ్రీఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కు తీర్చుకున్నారు. -
పాలమూరుకు కొత్త పాలనాధికారులు
[ 16-06-2024]
ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేసిన ఐఏఎస్ల బదిలీల్లో ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల కలెక్టర్లకు స్థాన చలనం కలిగింది. ఆయా జిల్లాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఏఏఎస్ అధికారులు కలెక్టర్లుగా వస్తున్నారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి. -
నాన్నా వందనం.. విజయం నీకంకితం!
[ 16-06-2024]
తల్లి బిడ్డను నవమాసాలు మోస్తే.. తండ్రి పాతికేళ్లు మోస్తాడు. కలలో, మెలకువలో పిల్లల గురించే ఆలోచిస్తాడు. సమాజంలో ఉన్నత స్థానంలో నిలిపేందుకు రెక్కలు ముక్కలు చేసుకుంటాడు. ఎంత ఖర్చయినా భరిస్తాడు. -
జనరంజకంగా ప్రజాపాలన
[ 16-06-2024]
రాష్ట్రంలో ప్రజాపాలన జనరంజకంగా కొనసాగుతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి పేర్కొన్నారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లిలో పర్యటించారు. -
చిన్నపొర్ల ఘటనలో ఐదుగురి అరెస్టు
[ 16-06-2024]
విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. చిన్నపొర్ల ఘటనకు సంబంధించి శనివారం ఆయన ఇక్కడ ఠాణా వద్ద విలేకరులతో మాట్లాడారు. -
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం
[ 16-06-2024]
రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం పాలైన ఘటన మహబూబ్నగర్ మండలంలో చోటు చేసుకుంది. గ్రామీణ ఠాణా ఎస్సై విజయ్కుమార్ కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేటకు చెందిన తౌసిఫ్ అన్వర్ అలీ(20) దేవరకద్ర సమీపంలోని స్విట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. -
భవనాలు శిథిలం.. సమస్యలు అనేకం
[ 16-06-2024]
భాషాభివృద్ధికి, స్వాతంత్య్రోద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన గ్రంథాలయాలు అవసాన దశకు చేరుతున్నాయి. రెండు దశాబ్దాలుగా లైబ్రేరియన్ల నియామకం లేకపోవడంతో జిల్లాలో ఉన్న ఒకరిద్దరికి మూడు, నాలుగు గ్రంథాలయాలకు ఇన్ఛార్జిలుగా నియమించారు. -
సీట్లు తక్కువ.. దరఖాస్తులు ఎక్కువ
[ 16-06-2024]
ఈ చిత్రం శనివారం మధ్యాహ్నం ధన్వాడ కస్తూర్బా గాంధీ పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న మరికల్ ఆంగ్ల మాధ్యమ కేజీబీవీ వద్ద కనిపించింది. ఆరో తరగతి ప్రవేశాల కోసం పిల్లల్ని తీసుకొని వచ్చిన తల్లిదండ్రులు ఎలాగైనా ప్రవేశం కల్పించాల్సిందిగా ప్రత్యేకాధికారి రాజ్యలక్ష్మికి విన్నవిస్తుండగా తీసింది. -
సుంకేశుల నుంచి నీటి విడుదల
[ 16-06-2024]
వర్షాల ప్రభావంతో తుంగభద్ర నదికి వరద ప్రవాహం పెరగడంతో రాజోలి శివారులోని సుంకేశుల జలాశయం నుంచి 2 గేట్లను ఎత్తి శనివారం నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి జలాశయానికి 18,500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. -
గత కలెక్టర్పై భూ అక్రమాల ఆరోపణ
[ 16-06-2024]
జిల్లా కలెక్టర్గా వల్లూరు క్రాంతి పనిచేసిన సమయంలో భూ అక్రమాలకు పాలడ్డారని జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఓఎస్డీ హరిప్రసాద్కు శనివారం సచివాలయంలో ఫిర్యాదు చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పవన్ కల్యాణ్కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్.. అదేంటంటే?
-
దర్శన్, పవిత్రా గౌడలకు వివాహమైందా? ఆయన లాయర్ ఏమన్నారంటే..
-
ఆరోగ్యశ్రీలో గత ప్రభుత్వ అక్రమాలపై చర్యలు: మంత్రి సత్యకుమార్
-
మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటా: నారా లోకేశ్
-
రామోజీరావు జీవితం నుంచి చాలా నేర్చుకోవాలి: ఎం. నాగేశ్వరరావు