ముడా కల సాకారం
మూడేళ్లుగా ఎదురు చూస్తున్న మహబూబ్నగర్ నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) ఏర్పాటు కల సాకారమయింది. ప్రభుత్వం సోమవారం జీవో విడుదల చేయడంతో స్థానికంగా ఆనందం వ్యక్తమవుతోంది.. మహబూబ్నగర్, జడ్చర్ల, భూత్పూరు పురపాలికలతోపాటు 12 మండలాల పరిధిలోని 143 గ్రామాలు మరింత అభివృద్ధి దిశగా పయనించనున్నాయి.. 2020 అక్టోబరులో ముడా ఏర్పాటుకు కలెక్టరు వెంకట్రావు ప్రతిపాదనలు పంపించగా.. ఏడాదిన్నర అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..
మూడు పురపాలికలు, 143 గ్రామాలతో ఏర్పాటు
మరింత అభివృద్ధికి పడనున్న అడుగులు
ఈనాడు డిజిటల్, మహబూబ్నగర్
మూడేళ్లుగా ఎదురు చూస్తున్న మహబూబ్నగర్ నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) ఏర్పాటు కల సాకారమయింది. ప్రభుత్వం సోమవారం జీవో విడుదల చేయడంతో స్థానికంగా ఆనందం వ్యక్తమవుతోంది.. మహబూబ్నగర్, జడ్చర్ల, భూత్పూరు పురపాలికలతోపాటు 12 మండలాల పరిధిలోని 143 గ్రామాలు మరింత అభివృద్ధి దిశగా పయనించనున్నాయి.. 2020 అక్టోబరులో ముడా ఏర్పాటుకు కలెక్టరు వెంకట్రావు ప్రతిపాదనలు పంపించగా.. ఏడాదిన్నర అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..
రెండు జలాశయాలూ ముడా పరిధిలోకి.. : పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కర్వెన, ఉదండాపూర్ జలాశయాలూ ముడా పరిధిలోకి రానున్నాయి. జలాశయాల వద్ద సుందరీకరణ, పర్యాటక అభివృద్ధికి ముడా ద్వారా మంజూరయ్యే నిధులు ఉపయోగపడతాయి.
ప్రత్యేక కార్యాలయం అవసరం.. : ముడాకు ప్రత్యేక కార్యాలయం అవసరం ఉంటుంది. అధికారుల నియామకం, సిబ్బంది కేటాయింపు అవసరం. ప్రస్తుతానికి వీటికిపై స్పష్టత లేదు. ముడా ఏర్పాటుతోపాటు ప్రాధికార సంస్థ కమిటీని ప్రకటించారు. మహబూబ్నగర్ జిల్లా కలెక్టరు ఎస్.వెంకట్రావు ఛైర్మన్గా, మహబూబ్నగర్ పురపాలిక కమిషనర్ ప్రదీప్కుమార్ వైస్ ఛైర్మన్గా వ్యవహరించనున్నారు. వీరితోపాటు జడ్చర్ల ఎమ్మెల్యే డా.లక్ష్మారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, సీడీఎంఏ కమిషనర్ సత్యనారాయణ సభ్యులుగా ఉండనున్నారు. ముడా పరిధిలోకి మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర, పరిగి నియోజకవర్గాలకు వచ్చాయి. పరిగి నియోజకవర్గంలోని మహమ్మదాబాద్, సంగాయపల్లి గ్రామాలను కూడా ఈ సంస్థలో కలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలు ముడా పరిధిలోకి వచ్చాయి.
కార్పొరేషన్ కాకుండానే.. : తెలంగాణలోని ప్రస్తుతం ఉన్న నగరాభివృద్ధి సంస్థల కేంద్రాలకు కార్పొరేషన్లు ఉన్నాయి. సాధారణంగా కార్పొరేషన్ ఉన్న నగరాలకే నగరాభివృద్ధి ప్రాధికార సంస్థలు ఏర్పాటు చేస్తారు. కానీ మహబూబ్నగర్ ఇప్పటికీ పురపాలికనే. కార్పొరేషన్ ఏర్పాటు కాకుండానే మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు కావడం విశేషం. మహబూబ్నగర్, జడ్చర్ల, భూత్పూరు పురపాలికలు ప్రస్తుతం ఉన్నవిధంగానే ఉంటాయి. పాలకవర్గాలు అలానే ఉంటాయి. గ్రామాలు అలానే ఉంటాయి. సర్పంచులు, వార్డు సభ్యులు అలానే ఉంటారు. అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపులు, లేఅవుట్లు, వెంచర్ల అనుమతులు మాత్రం ముడా పరిధిలోకి వస్తాయి.
నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పడితే..
* ఆ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ ఉంటుంది.
* 40 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్లానును రూపొందిస్తారు.
* నగరాభివృద్ధి ప్రాధికార సంస్థలకు రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులుంటాయి.
* కేంద్ర ప్రభుత్వ పథకాలైన స్మార్ట్ సిటీ, హృదయ్, అమృత్ పథకం ద్వారా నిధులు భారీగా వస్తాయి.
* ఈ సంస్థ పరిధిలోని అన్ని ప్రాంతాలకు రహదారుల సౌకర్యం కలుగుతుంది.
* పురపాలికలతోపాటు గ్రామాల్లోనూ ఉద్యానవనాలు, చిన్నారుల ఆట స్థలాలు ఏర్పాటు చేస్తారు.
* కూడళ్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తారు.
* పురపాలికలకే పరిమితమైన అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ గ్రామాల్లోనూ పకడ్బందీగా అమలవుతుంది.
* హైమాస్టు లైట్లు, వీధి దీపాలు ఈ ప్రాంతం రహదారుల వెంట ఉంటాయి.
* సుందరీకరణలో భాగంగా రెండు వరసల రహదారులు నిర్మిస్తారు.
* ఇంటి నిర్మాణం చేపట్టాలంటే సెట్ బ్యాక్ నిబంధన అమలు తప్పనిసరి.
* లేఅవుట్లు, వెంచర్లు చేయాలంటే ప్రాధికార సంస్థ నుంచి అనుమతి తప్పనిసరి. అక్రమ లేఅవుట్లకు ఆస్కారం ఉండదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గద్వాలలో భాజపా బహిరంగ సభ
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా ఈ నెల 4న గద్వాల పట్టణంలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. -
కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
[ 02-05-2024]
పదేళ్ల భాజపా ప్రభుత్వాన్ని చూసిన ప్రజలు విసిగిపోయారని, రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలిచి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి, జడ్పీ ఛైర్ పర్సన్ సరిత అన్నారు. -
వంతెన పనులు పూర్తి చేయాలి
[ 02-05-2024]
అయిజ పట్టణంలోని పెద్దవాగుపై రెండేళ్లుగా నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అఖిల పక్షం నాయకులు డిమాండ్ చేశారు. -
కందనూలు.. మొగ్గు ఎటు వైపో..
[ 02-05-2024]
నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గంలో ఓటర్లు విలక్షణ తీర్పు ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చే తీర్పులో మార్పు కనిపిస్తోంది. -
ఉన్నత విద్యావంతులు కొందరే
[ 02-05-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంటర్లోపే విద్యార్హత ఉండటం విశేషం. -
అభ్యర్థికి టాటా.. పెరుగుతోంది నోటా
[ 02-05-2024]
ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే. అభ్యర్థుల గెలుపోటములు నిర్దేశించడంతో పాటు ప్రభుత్వాల ఏర్పాటుకు దోహదపడుతుంది. లోక్సభ ఎన్నికలైనా సరే.. గట్టిపోటీ ఉన్న చోట రెండు, మూడు వేల ఓట్లే కీలకంగా మారే పరిస్థితి ఉంటుంది. -
సూర్యప్రతాపం.. తగ్గిన ప్రచారం
[ 02-05-2024]
ఓ వైపు సూర్యప్రతాపం రోజురోజుకూ అధికం అవుతోంది. మరోవైపు ప్రచార గడువు దగ్గరకు వస్తోంది... ఈ వేడి వాతావరణంలో రాజకీయ పార్టీల ప్రచార సరళి మారిపోయింది. గతంలో ఉన్నంత జోష్ కనిపించడం లేదు. మంది ఉన్నచోట మాట్లాడి వెళ్లిపోతున్నారు. ఇంటింటి ప్రచారం పలచబడింది. -
రైల్వే లైన్ సాధనకు కృషి
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఆశీర్వదిస్తే వనపర్తి ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వే లైన్ సాధనకు కృషి చేస్తానని నాగర్కర్నూల్ భాజపా ఎంపీ అభ్యర్థి భరత్ప్రసాద్ పేర్కొన్నారు. -
కమనీయం శ్రీనివాసుడి కల్యాణం
[ 02-05-2024]
అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు.. ఆపద మొక్కులవాడైన శ్రీవేంకటేశ్వరస్వామి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. -
న్యాయవాదులు ఆలోచించి ఓటేయాలి : డీకే అరుణ
[ 02-05-2024]
మేధావి వర్గమైన న్యాయవాదులు లోక్సభ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని భాజపా లోక్సభ అభ్యర్థి డీకే అరుణ కోరారు. -
సైబర్ నేరాలపై అవగాహన అవసరం
[ 02-05-2024]
సైబర్ నేరాల పట్లపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా సైబర్ సెక్యూరిటీ విభాగం డీఎస్పీ సత్తయ్య పేర్కొన్నారు. -
నాలుగు ప్రాంతాల్లో రెడ్జోన్
[ 02-05-2024]
జోగులాంబ గద్వాల జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలోని నాలుగు ప్రాంతాలు రెడ్జోన్ పరిధిలోకి వెళ్లాయి. -
పొరుగుసేవల దరఖాస్తులపై అనుమానాలెన్నో !
[ 02-05-2024]
గద్వాల మెడికల్ కళాశాలలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో వివిధ విభాగాలలో పనిచేయడానికి సిబ్బంది నియామకానికి అర్హత గల వ్యక్తుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో స్థానిక అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించారు. -
సామాజిక మాధ్యమాలపై నిఘా
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల నామపత్రాల దాఖలు గడువు పూర్తి కావడంతో ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. -
తెలుగులోనూ తప్పారు!
[ 02-05-2024]
పదోతరగతి వార్షిక ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో నాగర్కర్నూల్ జిల్లా 21వ స్థానంలో నిలువడం నిరాశ కలిగించింది. విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి జిల్లా విద్యాశాఖాధికారులు చొరవ చూపలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
భాజపాతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యం
[ 02-05-2024]
కేంద్రంలో భాజపా మూడోసారి అధికారం చేపడితేనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని కేంద్ర ప్రసార, సమాచారశాఖ సహాయమంత్రి మురుగన్ అన్నారు. -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి : ఎస్పీ
[ 02-05-2024]
యువత గంజాయికి బానిసలుగా మారి తమ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని, మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్పీ యోగేశ్గౌతం అన్నారు. -
సార్వత్రిక పరీక్షలకు 804 మంది హాజరు
[ 02-05-2024]
సార్వత్రిక పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు 804 మంది విద్యార్థులు హాజరైనట్లు టాస్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ తెలిపారు. -
పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయండి
[ 02-05-2024]
పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ రక్షితకృష్ణమూర్తి ఆదేశించారు. వనపర్తి సర్కిల్ పరిధిలో వనపర్తి పట్టణం, గ్రామీణం, రేవల్లి, వీపనగండ్ల పోలీస్స్టేషన్లకు సంబంధించి పెండింగ్ కేసులపై బుధవారం ఎస్సైలతో ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి