పరీక్షలు 6.79 లక్షలు.. లబ్ధి రూ.22.65 కోట్లు!
తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాలు పేద రోగుల పాలిట వరమవుతున్నాయి.. వచ్చిన రోగం కంటే అయ్యే ఖర్చుకే భయపడాల్సిన పరిస్థితుల్లో టీహబ్ ద్వారా అందుతున్న సేవలు ఉపశమనంగా నిలుస్తున్నాయి.. ఏడాదిన్నర వ్యవధిలో ఉమ్మడి జిల్లాలో 6.79 లక్షల నమూనాలకు పరీక్షలు
తెలంగాణ డయాగ్నస్టిక్స్తో పేదలకు మేలు
నమూనాల ఫలితాలను పరిశీలిస్తున్న టీ హబ్ నోడల్ అధికారి డా.సృజన
న్యూస్టుడే, పాలమూరు: తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాలు పేద రోగుల పాలిట వరమవుతున్నాయి.. వచ్చిన రోగం కంటే అయ్యే ఖర్చుకే భయపడాల్సిన పరిస్థితుల్లో టీహబ్ ద్వారా అందుతున్న సేవలు ఉపశమనంగా నిలుస్తున్నాయి.. ఏడాదిన్నర వ్యవధిలో ఉమ్మడి జిల్లాలో 6.79 లక్షల నమూనాలకు పరీక్షలు నిర్వహించిన తీరు ఈ కేంద్రాల సద్వినియోగాన్ని తెలియజేస్తున్నాయి.. ఈ పరీక్షల ద్వారా రూ.22.65 కోట్ల మేర పేదలకు లబ్ధి చేకూరినట్లు అంచనా.
ఆస్పత్రులకు వచ్చే రోగులకు రోగ నిర్ధారణ కోసం రక్త పరీక్షలు తప్పనిసరి అవుతున్నాయి. ప్రైవేటు ల్యాబ్లలో రూ.200ల నుంచి రూ.2 వేల వరకు ఈ పరీక్షలకు వ్యయమవుతుంది. టీ హబ్ ద్వారా ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్స్ కేంద్రాల్లో పైసా ఖర్చు లేకుండా పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇస్తుండటం రోగులకు వెసులుబాటుగా ఉంటుంది. ప్రస్తుతం గద్వాల, మహబూబ్నగర్లలో మాత్రమే ఈ కేంద్రాలు ఉండగా త్వరలోనే నారాయణపేటలో కేంద్రం ప్రారంభం కానుంది. నాగర్కర్నూల్, వనపర్తిలకూ మంజూరవుతాయని తెలుస్తోంది.
* జోగులాంబ గద్వాల, మహబూబ్నగర్ జిల్లాల్లోని ప్రతి పీహెచ్సీ, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో సేకరించిన నమూనాలను అదే రోజు ఆయా టీ హబ్ కేంద్రాలకు పంపిస్తారు.
* 24 గంటల్లోనే ఫలితాలు వస్తాయి. మరుసటి రోజు ఆస్పత్రులకు నివేదికలు పంపిస్తారు.
* నివేదికలు వైద్యులకు చూపించి రోగులు సేవలు పొందవచ్చు
రాష్ట్రంలోనే గద్వాల కేంద్రానికి మొదటిస్థానం
గద్వాలలో జనవరి 9, 2021న తెలంగాణ డయాగ్నస్టిక్స్ కేంద్రం ప్రారంభించారు. ఆ సమయంలో ప్రారంభించిన ఇతర జిల్లాల కేంద్రాలతో పోలిస్తే ఈ కేంద్రంలో ఎక్కువ పరీక్షలు నిర్వహించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 1,34,638 మంది రోగుల నుంచి 2,90,854 రక్త నమూనాలను సేకరించగా, ఈ కేంద్రంలో 5,11,376 రకాల పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల విలువ రూ.16.15 కోట్లు ఉంటుంది. సీబీపీ, థైరాయిడ్, ఎల్ఎఫ్టీ, ఆర్ఎఫ్టీ, డయాబెటిక్స్ తదితర పరీక్షలకు ఎక్కువ సంఖ్యలో రక్త నమూనాలు వచ్చాయి. ప్రతి నెలా 30 వేల నుంచి 35 వేల వరకు శాంపిళ్లు వస్తున్నాయి.
మహబూబ్నగర్లోనూ సద్వినియోగం
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో టీ హబ్ కేంద్రం జూన్ 9, 2021న ప్రారంభించారు. 53,319 మంది రోగులకు చెందిన 89,745 రక్త నమూనాలకు 1,67,985 పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల విలువ రూ.6.50 కోట్ల వరకు ఉంటుంది. ప్రతి రోజు పీహెచ్సీల నుంచి 1,000 నుంచి 1,500ల వరకు శాంపిళ్లు వస్తున్నాయి.
కొత్తగా రేడియాలజీ విభాగం
మహబూబ్నగర్లో టీ హబ్కు రేడియాలజీ విభాగం మంజూరు అయింది. ప్రస్తుతం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వెనుక భాగంలో భవనాన్ని నిర్మిస్తున్నారు. అందులోనే అన్నిరకాల పరికరాలు, యంత్రాలను సమకూర్చనున్నారు. ఇప్పటికే చెస్ట్ ఎక్స్రే, గుండెకు సంబంధించిన ఈసీజీ, 2డీ ఇకో తదితర యంత్రాలు వచ్చాయి. వాటిని ఆసుపత్రిలో ఉంచి రోగులకు సేవలను అందిస్తున్నారు. ఎంఆర్ఐ సేవలు కూడా త్వరలోనే జిల్లాకు రానున్నట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణ డయాగ్నస్టిక్స్ నోడల్ అధికారి డా.సృజన మాట్లాడుతూ ఉచిత పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. రోగులు తమ పీహెచ్సీలకు వెళ్లి నమూనాలు ఇస్తే సరి అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుబాటతో గులాబీ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ‘పోరుబాట’ బస్సుయాత్ర శుక్రవారం మహబూబ్నగర్లో విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పాలమూరులో రెండు రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమానికి మొదటి రోజు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. -
తుది జాబితాపై కసరత్తు పూర్తి
[ 27-04-2024]
పాలమూరులో ఓటర్ల తుది జాబితాపై కసరత్తు పూర్తయ్యింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్ఎస్ఆర్-2024కు అదనంగా కొత్త ఓటర్లను జత చేసి తుది జాబితాను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. -
గంజాయి దందా.. యువతే నిండా
[ 27-04-2024]
పాలమూరు పట్టణంలో గంజాయి వ్యాపారం చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఎక్సైజ్, పోలీసు శాఖలు నిఘా పెట్టినా.. వారి కళ్లు గప్పి గంజాయిని విక్రయిస్తూనే ఉన్నారు. ఈ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన వాళ్లు కూడా బయటకు వచ్చాక మళ్లీ అదే దందా చేస్తున్నారు. -
పాలమూరు సిబ్బందికి పరీక్ష!
[ 27-04-2024]
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ)లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి అధికారులు ‘పరీక్ష’ నిర్వహించేందుకు సన్నాహాలు చేయటం దుమారం రేపుతోంది. -
35 నామపత్రాల ఆమోదం.. ఏడు తిరస్కరణ
[ 27-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గానికి దాఖలైన నామపత్రాలను అధికారులు నిశితంగా పరిశీలించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎన్నికల సాధారణ పరిశీలకుడు షెవాంగ్ గ్యాచో భూటియా, రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ జి.రవి నాయక్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. -
గుంభనంగా ద్వితీయ శ్రేణి
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు ప్రచారంలో తేడా ఉంది. అగ్రనాయకుల హడావుడి తప్పా కింది స్థాయి నాయకుల్లో ఇంకా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటికీ కార్యకర్తల్లో ఉత్తేజం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంటనే ఈ ఎన్నికలు రావడంతో అంతటా స్తబ్ధత నెలకొంది. -
అరచేతిలో సకల సమాచారం
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేసింది. డిజిటల్ సాంకేతికత వినియోగించుకుంటూ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అడుగులు వేస్తోంది. -
పెళ్లిళ్లు, శుభకార్యాలకు విరామం
[ 27-04-2024]
పెళ్లిళ్లు, శుభకార్యాలకు శనివారం నుంచి బ్రేక్ పడనుంది. మూఢం వచ్చేసింది. గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని మూఢంగా జ్యోతిష్యులు చెబుతారు. గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినపుడు గురుమౌఢ్యంగా, శుక్రగ్రహం సూర్యగ్రహనికి దగ్గర వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యంగా పిలుస్తారు. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలవరనే ఆందోళనలో సీఎం
[ 27-04-2024]
మహబూబ్నగర్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలిచే పరిస్థితి లేకపోవటంతో తన పదవి ఊడుతుందని సీఎం రేవంత్రెడ్డి భయపడుతున్నారని, అందుకే మహబూబ్నగర్లో తరచూ పర్యటిస్తూ భాజపా అభ్యర్థి డీకే అరుణపై నోరు పారేసుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ విమర్శించారు. -
బీ ఫాం ఉన్న వారికే పార్టీ గుర్తు
[ 27-04-2024]
గ్రామ పంచాయతీ ఎన్నికలు మినహా మిగతా అన్ని ఎన్నికల్లో అభ్యర్థులు రాజకీయ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తే బీ ఫారం అందజేయాల్సి ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ తరపున ఏ అభ్యర్థి అయితే బీ ఫారం అందజేస్తారో ఆ అభ్యర్థికే పార్టీ గుర్తు కేటాయిస్తారు. -
ప్రతి ఓటరుకు స్లిప్పు అందేలా చర్యలు: కలెక్టర్
[ 27-04-2024]
ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఉదయ్కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. -
తెల్లజొన్నలకు పచ్చరంగు
[ 27-04-2024]
పచ్చజొన్నలకు మార్కెట్లో విపరీతంగా డిమాండ్ ఉండటంతో జోరుగా కల్తీ జరుగుతోంది. ఆరోగ్య సమస్యల దృష్ట్యా మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలతో బాధపడుతున్న వారు బియ్యంనకు బదులు పచ్చజొన్నలపై ఆసక్తి కనబరుస్తున్నారు. -
తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటాం..
[ 27-04-2024]
నిత్యవసర సరకులు, తినుబండారాలను కల్తీ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సహజ సిద్ధంగా పండిన జొన్నలను కల్తీ చేస్తున్నట్లు సమాచారం ఉంది. -
లక్ష్యం బారెడు... సేకరణ మూరెడు
[ 27-04-2024]
జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ లక్ష్యం సుదూరంగా కనిపిస్తోంది. పౌరసరఫరాలశాఖ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 27 రోజులు కావస్తున్నా ఇంతవరకు అనుకున్న లక్ష్యంలో కనీసం ఒకశాతం కూడా సేకరించలేదు. -
సేవల సౌలభ్యానికి అంగన్వాడీల సర్వే
[ 27-04-2024]
అయిజ పట్టణంలోని భరత్నగర్ కాలనీకి చెందిన శాంతమ్మ టీచర్స్ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఉంది. సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రోజూ వెళ్లి రావాలంటే ఇబ్బంది. చిన్నారులను కేంద్రానికి పంపాలన్నా ఇబ్బందే.