బలవర్ధక బియ్యం..ఆరోగ్య భారతం
విద్యార్థులు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించి బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోషకాహార లోపాలను నివారించేందుకు కొత్తగా ప్రధాన మంత్రి పోషణ్ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే పోర్టిఫైడ్
న్యూస్టుడే, మహబూబ్నగర్ విద్యావిభాగం
మహబూబ్నగర్ జిల్లా కేంద్రం షాబజార్ ఉన్నత
పాఠశాలలో భోజనం చేస్తున్న విద్యార్థులు
విద్యార్థులు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించి బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోషకాహార లోపాలను నివారించేందుకు కొత్తగా ప్రధాన మంత్రి పోషణ్ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే పోర్టిఫైడ్ బియ్యాన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేద్రాలకు సరఫరా చేస్తోంది. దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని బడులు, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం బలవర్ధక బియ్యాన్ని పంపిణీ చేస్తోంది.
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పోషక లోపంతో బాధపడుతున్న విద్యార్థులున్నట్లు ఆయా సర్వేల్లో తేలుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజనానికి విటమిన్లు, ఖనిజాలు మిళితం చేసిన సన్నబియ్యంతో వండిన అన్నాన్ని వడ్డిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో జిల్లావ్యాప్తంగా 5 లక్షల మంది విద్యార్థులకుపైగా లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం భోజనానికి సన్నబియ్యాన్ని వాడుతున్నారు. వాటి స్థానంలో బలవర్థక బియ్యం అందిస్తున్నారు. సాధారణ ప్రక్రియలో బియ్యన్ని పాలిష్ చేసినప్పుడు అందులో సహజంగా ఉండే ఖనిజాలు, పోషకాలు వెళ్లిపోతాయి. వాటిని పెంచేందుకు అవసరమైన ఖనిజ, లవణాలను జత చేయడాన్నే పోర్టిఫికేషన్ అంటారు. పోషకాహార లోపాన్ని నివారించడానికి బియ్యాన్ని పిండి చేసి అందులో ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్ట్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆమోదించిన మోతాదులో విటమిన్లు, ఖనిజాలను కలిపి తిరిగి బియ్యపు గింజలుగా తయారు చేస్తారు. 100 కిలోల సాధారణ బియ్యానికి కిలో ఫోషకాలున్నవి కలిపి సరఫరా చేస్తారు.
పాఠశాలలు, అంగన్వాడీలకు సరఫరా చేస్తున్న బలవర్ధక బియ్యం
ఎంతో ఉపయుక్తం..
సాధారణ బియ్యంలో ఐరన్ తక్కువగా ఉంటుంది. పోషక మిళిత బియ్యంతో వండిన ఆహారం రక్తహీతను నివారిస్తుంది. ఖనిజ లవణాలు అందుతాయి. ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ12తో కణాల ఎదుగుదల, కొత్తవాటి తయారీ వేగవంతమవుతాయి. పోర్టిఫైడ్ బియ్యంతో విద్యార్థుల్లో ఏకాగ్రత, తెలివితేటలు, సామర్థ్యం, రోగనిరోధక శక్తి పెరుగుతాయి. - ఆచార్య డా.ఎన్.సురేశ్, చిన్నపిల్లల విభాగ అధిపతి, ప్రభుత్వ వైద్య కళాశాల, మహబూబ్నగర్
అంగన్వాడీలు, పాఠశాలలకు సరఫరా చేస్తున్నాం..
పోషక విలువలున్న బియ్యాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికిగాను ఈ ఏడాది మే నుంచి సరఫరా చేస్తున్నాం. అంగన్వాడీలకు జనవరి నుంచే ప్రారంభించాం. ఒక్క మహబూబ్నగర్ జిల్లాలోనే నెలకు మధ్యాహ్న భోజనానికి 2వేల క్వింటాళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు 800 క్వింటాళ్లు సరఫరా చేస్తున్నాం. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోషకాలున్న బియ్యం సరఫరా అవుతున్నాయి. - రాజేశ్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజరు, మహబూబ్నగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మందకొడిగా ధాన్యం సేకరణ
[ 18-05-2024]
పాలమూరులోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ మందకొడిగా సాగుతోంది. యాసంగిలో మహబూబ్నగర్లో 1.11 లక్షలు, నాగర్కర్నూల్-1.09 లక్షలు, నారాయణపేట-1.15 లక్షలు, వనపర్తి-91 వేలు, జోగులాంబ గద్వాల-50వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. -
రుణమాఫీపై ఆశలు
[ 18-05-2024]
శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణ మాఫీ అమలుకు ప్రభుత్వం కటాఫ్ తేదీ ప్రకటించటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.రెండు లక్షలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. -
ఆర్టీసీకి పోటెత్తారు
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు సొంతూళ్లకు ఓటేసేందుకు పోటెత్తారు. ఈనెల 13న లోక్సభ ఎన్నికలు జరగడంతో పట్టణాలు, నగరాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు స్వగ్రామాలకు తరలొచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. -
వేసవిలో ముంచెత్తుతున్న వర్షాలు
[ 18-05-2024]
జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారు జామున భారీ వర్షం కురిసింది. గట్టు మండలకేంద్రంలో అత్యధికంగా 10.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
నిఘా నేత్రాలు అరకొర!
[ 18-05-2024]
రద్దీ ప్రాంతాల్లో జేబు దొంగలు తమ వాటం ప్రదర్శిస్తుంటారు. నిత్యం వేలాది మందితో కిటకిటలాడే మహబూబ్నగర్ బస్టాండు ఇందుకు వేదిక అవుతోంది. నెలలో రెండు నుంచి నాలుగు వరకు దొంగతనాలు జరుగుతున్నాయి. మహాలక్ష్మి టిక్కెట్లు అందుబాటులోకి వచ్చాక ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిన సంగతి విధితమే. -
వేధింపుల నివారణకు ప్రత్యేక కమిటీలు
[ 18-05-2024]
పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక కమిషనర్లు విధిగా వేధింపులను నియంత్రించేందుకు కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 19 పురపాలికల్లో కమిటీల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించారు. -
ఈ-శ్రమ్ సద్వినియోగం చేసుకోండి
[ 18-05-2024]
అసంఘటిత కార్మికులు ఈ-శ్రమ్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్.సునీత సూచించారు. శుక్రవారం వనపర్తి కోర్టు ఆవరణలో అసంఘటిత కార్మికులకు ఈ-శ్రమ్ పోర్టల్పై ఉచిత న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. -
పంటల ప్రణాళిక ఖరారు
[ 18-05-2024]
జిల్లాలో వానాకాలం పంటల ప్రణాళికను వ్యవసాయశాఖ ఖరారు చేసింది. అన్ని రకాల పంటలు కలిపి 2,45,953 ఎకరాల్లో సాగు చేస్తారని అధికారులు అంచనాలు తయారు చేశారు. కేవలం వర్షాధారంగానే కాకుండా చెరువులు, బావులు, బోర్ల ఆధారంగా వానాకాలం పంటలను రైతులు సాగు చేస్తారు. -
సాంకేతిక విద్య.. భవితకు భరోసా
[ 18-05-2024]
విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకొని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందాలంటే వారికి సాంకేతిక విద్య అవసరం. దీనికోసం ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరానికి ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. -
ఇంట్లో కుక్కుంది.. పెంపకంలో లెక్కుంది
[ 18-05-2024]
వికారాబాద్ జిల్లా తాండూరులో ఓ పెంపుడు కుక్క ఆ ఇంట్లో చిన్నారిని తీవ్రంగా గాయపరిచి, చంపేసింది. ప్రేమకు ప్రతిరూపాలుగా భావించే పెంపుడు జంతువులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన తెలియజేస్తోంది. ఇంట్లో పెంచే పప్పీలు, పెద్దజాతి కుక్కల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఏమిటో తెలుసుకుందాం. -
పిల్లలూ కథలు చదివేద్దామా.!
[ 18-05-2024]
వేసవి సెలవుల్లో విద్యార్థులు ఆన్లైన్ గేమ్స్, సామాజిక మాధ్యమాలకు పరిమితం కాకుండా వారిలో పఠనాశక్తి పెంచే దిశగా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఎన్సీఈఆర్టీ సహకారంతో రూమ్ టూ రీడ్ సంస్థ ‘లిటరసీ క్లౌడ్’ మాధ్యమం ద్వారా ఇంటి వద్దనే ప్రాథమిక స్థాయి విద్యార్థులు కథలు చదువుకునేలా ఏర్పాటు చేసింది. -
పోలింగ్ సిబ్బందికి చెల్లింపుల్లో వ్యత్యాసం
[ 18-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి పారితోషికం చెల్లింపుల్లో వ్యత్యాసం ఉండటంతో ఉపాధ్యాయులు, ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
సెలవులు పూర్తయ్యేసరికి బడులకు వసతులు:ఏసీ
[ 18-05-2024]
వేసవి సెలవులు పూర్తయ్యేలోపు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు పనులను పూర్తి చేయాలని, విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్ సూచించారు. చిన్నపొర్ల పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీల పనులను శుక్రవారం పరిశీలించి మాట్లాడారు. -
మరమ్మతులకు ఇదే తరుణం!
[ 18-05-2024]
ఒకప్పుడు కరవు కాటకాలకు, వలసలకు పాలమూరు జిల్లా చిరునామాగా ఉండేది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి అప్పట్లో మంజూరైనదే భీమా ప్రాజెక్టు. మొదటిదశ కింద మక్తల్ నియోజకవర్గంలో 1998లో రెండు జలాశయాలు నిర్మించతలపెట్టారు. -
ఆరోగ్య కేంద్రాల్లో మరిన్ని ప్రత్యేక సేవలు
[ 18-05-2024]
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఇప్పటికే అందిస్తున్న ఐదు రకాల వైద్యసేవలతోపాటు మరో ఏడు కొత్త సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు వైద్య,ఆరోగ్యశాఖ చర్యలు చేపడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీకిదే చివరి సీజనా? విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
-
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి
-
స్వాతి మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ అరెస్ట్
-
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
-
23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
-
ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప