15 ఏళ్లు దాటితే తుక్కే
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలను తక్కుగా పరిగణించాలి. 2022 ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలు అమలు చేయాల్సి ఉంది.
ప్రభుత్వ వాహనాలు 308
వ్యక్తిగత, వాణిజ్య సరుకు రవాణావి 1.18లక్షలు
మహబూబ్నగర్ పట్టణం, న్యూస్టుడే: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలను తక్కుగా పరిగణించాలి. 2022 ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలు అమలు చేయాల్సి ఉంది. విపరీతమైన వాయు, శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు సిఫార్సు చేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలు 308 ఉన్నాయి. ఆర్టీసీతోపాటు ఇతర జీపులు, కార్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆయా శాఖలకు జిల్లా రవాణా శాఖ అధికారుల ద్వారా నోటీసులు జారీ చేశారు. ఈ ప్రక్రియ కొనసాగుతోంది. వీటన్నింటిని త్వరలో తుక్కు పరిశ్రమలకు తరలించనున్నారు. ఇవి కాకుండా ఉమ్మడి జిల్లాలో ప్రైవేటుకు సంబంధించి వ్యక్తిగత, వాణిజ్య వాహనాలన్నీ కలుపుకొని 1.18 లక్షలకు పైగా ఉన్నాయి. ప్రజారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని కాలుష్యాన్ని వెదజల్లే ఈ వాహనాలకు చెక్ పెట్టనున్నారు.
ఆర్టీసీ బస్సులు 270 : ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి 15 ఏళ్లు పూర్తయిన వాహనాలు రవాణా శాఖ రికార్డుల్లో 308 ఉన్నాయి. వాటిలో అత్యధికంగా ఆర్టీసీ బస్సులు 270 ఉన్నాయి. ఇతర వాహనాలు 24, కార్లు 9, సరుకు రవాణాకు సంబంధించినవి 5 ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాలో 272 ఉన్నాయి. వీటిలో ఆర్టీసీ బస్సులు 242, ఇతర వాహనాలు 21, మోటారు కార్లు 7, సరుకు రవాణా 2 ఉన్నాయి. నాగర్కర్నూల్లో 18 బస్సులు, 3 ఇతర వాహనాలు, రెండు కార్లు, మూడు సరుకు రవాణా వాహనాలున్నాయి. వనపర్తిలో 6 బస్సులు మాత్రమే ఉన్నట్లు తేలింది. జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో 2 చొప్పున ఆర్టీసీ బస్సులు మాత్రమే 15 ఏళ్లు పూర్తయినవి రికార్డుల్లో నమోదై ఉన్నాయి.
* ప్రస్తుత నిబంధనల మేరకు వ్యక్తిగత వాహనాలకు 15 ఏళ్ల తర్వాత సామర్థ్య పరీక్షలు తప్పనిసరి. వాహనం కండీషన్లో ఉంటే అధికారులు పరీక్షలు నిర్వహించి మరో ఐదేళ్లు వాహనం రోడ్డుపై తిరిగేలా అనుమతిస్తారు. వాణిజ్య వాహనాలకు ఏటా సామర్థ్య పరీక్షలు చేపట్టాలి. వ్యక్తిగత వాహనాలు 20 ఏళ్లు, వాణిజ్య వాహనాలను 15 ఏళ్ల తర్వాత తుక్కుగా మార్చాలి. ఏప్రిల్ 1, 2022 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త పాలసీ ప్రకారం పాత వాహనాలను తుక్కుగా మార్చిన తరువాత వాటి యజమానులు కొనుగోలు చేసే కొత్త వాహనాలకు రహదారి పన్నులో 25 శాతం వరకూ రాయితీ ఇస్తారు.
* కేంద్రం ఆదేశాల మేరకు జిల్లాల్లో గడువు తీరిన వాహనాల జాబితా ప్రకారం ఆయా శాఖలకు నోటీసులు జారీ చేశాం. వాహనాల వివరాలు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 1.18 లక్షలకుపైగా కాలం చెల్లిన వాహనాలు రెన్యువల్ చేసుకొని నడిపిస్తున్నారు. సామర్థ్య పరీక్షల్లో నెగ్గితేనే రోడ్లపై తిరిగేలా చర్యలు తీసుకుంటున్నాం.
దుర్గాప్రమీల, రవాణాశాఖ ఉప కమిషనర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుబాటతో గులాబీ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ‘పోరుబాట’ బస్సుయాత్ర శుక్రవారం మహబూబ్నగర్లో విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పాలమూరులో రెండు రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమానికి మొదటి రోజు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. -
తుది జాబితాపై కసరత్తు పూర్తి
[ 27-04-2024]
పాలమూరులో ఓటర్ల తుది జాబితాపై కసరత్తు పూర్తయ్యింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్ఎస్ఆర్-2024కు అదనంగా కొత్త ఓటర్లను జత చేసి తుది జాబితాను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. -
గంజాయి దందా.. యువతే నిండా
[ 27-04-2024]
పాలమూరు పట్టణంలో గంజాయి వ్యాపారం చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఎక్సైజ్, పోలీసు శాఖలు నిఘా పెట్టినా.. వారి కళ్లు గప్పి గంజాయిని విక్రయిస్తూనే ఉన్నారు. ఈ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన వాళ్లు కూడా బయటకు వచ్చాక మళ్లీ అదే దందా చేస్తున్నారు. -
పాలమూరు సిబ్బందికి పరీక్ష!
[ 27-04-2024]
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ)లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి అధికారులు ‘పరీక్ష’ నిర్వహించేందుకు సన్నాహాలు చేయటం దుమారం రేపుతోంది. -
35 నామపత్రాల ఆమోదం.. ఏడు తిరస్కరణ
[ 27-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గానికి దాఖలైన నామపత్రాలను అధికారులు నిశితంగా పరిశీలించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎన్నికల సాధారణ పరిశీలకుడు షెవాంగ్ గ్యాచో భూటియా, రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ జి.రవి నాయక్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. -
గుంభనంగా ద్వితీయ శ్రేణి
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు ప్రచారంలో తేడా ఉంది. అగ్రనాయకుల హడావుడి తప్పా కింది స్థాయి నాయకుల్లో ఇంకా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటికీ కార్యకర్తల్లో ఉత్తేజం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంటనే ఈ ఎన్నికలు రావడంతో అంతటా స్తబ్ధత నెలకొంది. -
అరచేతిలో సకల సమాచారం
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేసింది. డిజిటల్ సాంకేతికత వినియోగించుకుంటూ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అడుగులు వేస్తోంది. -
పెళ్లిళ్లు, శుభకార్యాలకు విరామం
[ 27-04-2024]
పెళ్లిళ్లు, శుభకార్యాలకు శనివారం నుంచి బ్రేక్ పడనుంది. మూఢం వచ్చేసింది. గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని మూఢంగా జ్యోతిష్యులు చెబుతారు. గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినపుడు గురుమౌఢ్యంగా, శుక్రగ్రహం సూర్యగ్రహనికి దగ్గర వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యంగా పిలుస్తారు. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలవరనే ఆందోళనలో సీఎం
[ 27-04-2024]
మహబూబ్నగర్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలిచే పరిస్థితి లేకపోవటంతో తన పదవి ఊడుతుందని సీఎం రేవంత్రెడ్డి భయపడుతున్నారని, అందుకే మహబూబ్నగర్లో తరచూ పర్యటిస్తూ భాజపా అభ్యర్థి డీకే అరుణపై నోరు పారేసుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ విమర్శించారు. -
బీ ఫాం ఉన్న వారికే పార్టీ గుర్తు
[ 27-04-2024]
గ్రామ పంచాయతీ ఎన్నికలు మినహా మిగతా అన్ని ఎన్నికల్లో అభ్యర్థులు రాజకీయ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తే బీ ఫారం అందజేయాల్సి ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ తరపున ఏ అభ్యర్థి అయితే బీ ఫారం అందజేస్తారో ఆ అభ్యర్థికే పార్టీ గుర్తు కేటాయిస్తారు. -
ప్రతి ఓటరుకు స్లిప్పు అందేలా చర్యలు: కలెక్టర్
[ 27-04-2024]
ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఉదయ్కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. -
తెల్లజొన్నలకు పచ్చరంగు
[ 27-04-2024]
పచ్చజొన్నలకు మార్కెట్లో విపరీతంగా డిమాండ్ ఉండటంతో జోరుగా కల్తీ జరుగుతోంది. ఆరోగ్య సమస్యల దృష్ట్యా మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలతో బాధపడుతున్న వారు బియ్యంనకు బదులు పచ్చజొన్నలపై ఆసక్తి కనబరుస్తున్నారు. -
తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటాం..
[ 27-04-2024]
నిత్యవసర సరకులు, తినుబండారాలను కల్తీ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సహజ సిద్ధంగా పండిన జొన్నలను కల్తీ చేస్తున్నట్లు సమాచారం ఉంది. -
లక్ష్యం బారెడు... సేకరణ మూరెడు
[ 27-04-2024]
జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ లక్ష్యం సుదూరంగా కనిపిస్తోంది. పౌరసరఫరాలశాఖ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 27 రోజులు కావస్తున్నా ఇంతవరకు అనుకున్న లక్ష్యంలో కనీసం ఒకశాతం కూడా సేకరించలేదు. -
సేవల సౌలభ్యానికి అంగన్వాడీల సర్వే
[ 27-04-2024]
అయిజ పట్టణంలోని భరత్నగర్ కాలనీకి చెందిన శాంతమ్మ టీచర్స్ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఉంది. సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రోజూ వెళ్లి రావాలంటే ఇబ్బంది. చిన్నారులను కేంద్రానికి పంపాలన్నా ఇబ్బందే.