నిరుద్యోగులకు వరం... డిజిటల్ గ్రంథాలయం
సర్కారు కొలువులు దక్కించుకోవడానికి నిరుద్యోగులు ఎంతో కష్టపడుతున్నారు. గతంలో గ్రూపు-1 ప్రిలిమినరీ పరీక్ష రెండు సార్లు రాసినా వివిధ కారణాలతో రద్దు కావడంతో నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఆన్లైన్లో పోటీ పరీక్షల సమాచారం
అచ్చంపేట, న్యూస్టుడే: సర్కారు కొలువులు దక్కించుకోవడానికి నిరుద్యోగులు ఎంతో కష్టపడుతున్నారు. గతంలో గ్రూపు-1 ప్రిలిమినరీ పరీక్ష రెండు సార్లు రాసినా వివిధ కారణాలతో రద్దు కావడంతో నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మళ్లీ పోటీ పరీక్షల నోటిఫికేషన్లు వస్తుండటంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో పట్టణాలకు వెళ్లి నెలల తరబడి శిక్షణ తీసుకున్నా పరీక్షలు అనుకున్న సమయానికి నిర్వహించకపోవడంతో నిరాశ చెందారు. పార్లమెంట్ ఎన్నికల ప్రకటన రావడంతో మరోసారి జాప్యం అయ్యే అవకాశాలు ఉన్నా పోటీ పరీక్షల కోసం సన్నద్ధమయ్యేందుకు కృషి చేస్తున్నారు. నిరుద్యోగులు స్థానికంగా అందుబాటులో ఉండే గ్రంథాలయాలను ఆశ్రయించి పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను చదివేందుకు పరిమితమవుతున్నారు. ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న వారు పోటీ పరీక్షల శిక్షణ కోసం మళ్లీ పట్నం బాట పడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ పోటీ పరీక్షలపై ఆశలు పెట్టుకొని నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. వివిధ కోర్సులు, ఉద్యోగ పరీక్షల్లో విజయం సాధించాలంటే ప్రణాళికతో చదవడానికే పరిమితం కాకుండా పరీక్షల్లో వచ్చే సిలబస్కు సంబంధించిన విషయ పరిజ్ఞానం పెంచుకోవడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
నిరుద్యోగులు స్థానికంగా ఉన్న గ్రంథాలయాలు ఉపయోగించుకోవడం వల్ల పూర్తి స్థాయిలో ఉపయోగం ఉండదు. స్థానికంగా కొన్ని రకాల పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. డిజిటల్ గ్రంథాలయాన్ని ఉపయోగించు కోవడంపై దృష్టి సారిస్తే పోటీ పరీక్షల సిలబస్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పటికే గ్రూపు-1, 2, డీఏవో పోస్టులను భర్తీ చేసేందుకు నిర్వహించే పరీక్షల తేదీలను ఇటీవల టీఎస్పీఎస్సీ ఖరారు చేసింది. వీటితో పాటు యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ), బ్యాంకింగ్ తదితర రంగాల్లో ఖాళీల భర్తీకి ఆయా శాఖలు పోటీ పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహించనున్నాయి. ఈ పరీక్షల కోసం నిరుద్యోగులు ఇప్పటికే సాధన చేయడం ప్రారంభించారు.
ఇలా ఉపయోగించుకోవాలి
జాతీయ డిజిటల్ గ్రంథాలయం (ఎన్డీఎల్) పేరుతో అందుబాటులో ఉన్న వెబ్సైట్ను ఖరగ్పూర్ ఐఐటీ అభివృద్ధి చేసింది. ఇందులోని సమాచారాన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ముందుగా నిరుద్యోగ యువత తమ వివరాలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్డీఎల్.సీవోఎం వెబ్సైట్లోకి వెళ్లి లాగిన్ అవ్వాలి. చరవాణిలో ఎన్డీఎల్ అని టైప్ చేస్తే దీనికి సంబంధించిన యాప్ కనిపిస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని వివరాలు నమోదు చేయాలి. ఆ తరువాత అవసరమైన సమాచారాన్ని ఎన్డీఎల్ నుంచి పొందవచ్చు.
అంతర్జాలంలో 68 లక్షల పుస్తకాలు
పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు కొనలేనివారు, శిక్షణ కేంద్రాల్లో ఫీజులు చెల్లించే పరిస్థితులు లేని వారికి అంతర్జాలం తోడ్పాటును అందిస్తోంది. జాతీయ డిజిటల్ గ్రంథాలయం (ఎన్డీఎల్) నిరుద్యోగులకు చక్కటి వేదికగా మారింది. ఆన్లైన్లో వివిధ పోటీ పరీక్షల సమాచారంతో పాటు ఆయా పరీక్షలకు ఉపయోగపడే సిలబస్కు సంబంధించిన పుస్తకాలు ఎన్డీఎల్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే 68 లక్షల పుస్తకాలు నిక్షిప్తమై ఉన్నాయి. జాతీయ విద్య శిక్షణ పరిశోధన సంస్థ (ఎన్సీఈఆర్టీ) రూపొందించిన వివిధ పాఠ్యాంశాలకు సంబంధించిన పుస్తకాలు ఎన్డీఎల్లో అందుబాటులో ఉన్నాయి. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు రూపొందించిన పరిశోధన వ్యాసాలు కూడా ఎన్డీఎల్లో ఉన్నాయి. విషయ పరిజ్ఞానానికి సంబంధించిన ఆరు విభాగాలు ఇందులో ఉన్నాయి. ఏ విభాగానికి సంబంధించిన పుస్తకం కావాలో దానిపై క్లిక్ చేస్తే ఆయా పాఠ్యాంశాలకు సంబంధించిన పేజీలు ప్రత్యక్షమవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుబాటతో గులాబీ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ‘పోరుబాట’ బస్సుయాత్ర శుక్రవారం మహబూబ్నగర్లో విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పాలమూరులో రెండు రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమానికి మొదటి రోజు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. -
తుది జాబితాపై కసరత్తు పూర్తి
[ 27-04-2024]
పాలమూరులో ఓటర్ల తుది జాబితాపై కసరత్తు పూర్తయ్యింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్ఎస్ఆర్-2024కు అదనంగా కొత్త ఓటర్లను జత చేసి తుది జాబితాను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. -
గంజాయి దందా.. యువతే నిండా
[ 27-04-2024]
పాలమూరు పట్టణంలో గంజాయి వ్యాపారం చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఎక్సైజ్, పోలీసు శాఖలు నిఘా పెట్టినా.. వారి కళ్లు గప్పి గంజాయిని విక్రయిస్తూనే ఉన్నారు. ఈ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన వాళ్లు కూడా బయటకు వచ్చాక మళ్లీ అదే దందా చేస్తున్నారు. -
పాలమూరు సిబ్బందికి పరీక్ష!
[ 27-04-2024]
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ)లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి అధికారులు ‘పరీక్ష’ నిర్వహించేందుకు సన్నాహాలు చేయటం దుమారం రేపుతోంది. -
35 నామపత్రాల ఆమోదం.. ఏడు తిరస్కరణ
[ 27-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గానికి దాఖలైన నామపత్రాలను అధికారులు నిశితంగా పరిశీలించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎన్నికల సాధారణ పరిశీలకుడు షెవాంగ్ గ్యాచో భూటియా, రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ జి.రవి నాయక్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. -
గుంభనంగా ద్వితీయ శ్రేణి
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు ప్రచారంలో తేడా ఉంది. అగ్రనాయకుల హడావుడి తప్పా కింది స్థాయి నాయకుల్లో ఇంకా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటికీ కార్యకర్తల్లో ఉత్తేజం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంటనే ఈ ఎన్నికలు రావడంతో అంతటా స్తబ్ధత నెలకొంది. -
అరచేతిలో సకల సమాచారం
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేసింది. డిజిటల్ సాంకేతికత వినియోగించుకుంటూ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అడుగులు వేస్తోంది. -
పెళ్లిళ్లు, శుభకార్యాలకు విరామం
[ 27-04-2024]
పెళ్లిళ్లు, శుభకార్యాలకు శనివారం నుంచి బ్రేక్ పడనుంది. మూఢం వచ్చేసింది. గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని మూఢంగా జ్యోతిష్యులు చెబుతారు. గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినపుడు గురుమౌఢ్యంగా, శుక్రగ్రహం సూర్యగ్రహనికి దగ్గర వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యంగా పిలుస్తారు. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలవరనే ఆందోళనలో సీఎం
[ 27-04-2024]
మహబూబ్నగర్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలిచే పరిస్థితి లేకపోవటంతో తన పదవి ఊడుతుందని సీఎం రేవంత్రెడ్డి భయపడుతున్నారని, అందుకే మహబూబ్నగర్లో తరచూ పర్యటిస్తూ భాజపా అభ్యర్థి డీకే అరుణపై నోరు పారేసుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ విమర్శించారు. -
బీ ఫాం ఉన్న వారికే పార్టీ గుర్తు
[ 27-04-2024]
గ్రామ పంచాయతీ ఎన్నికలు మినహా మిగతా అన్ని ఎన్నికల్లో అభ్యర్థులు రాజకీయ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తే బీ ఫారం అందజేయాల్సి ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ తరపున ఏ అభ్యర్థి అయితే బీ ఫారం అందజేస్తారో ఆ అభ్యర్థికే పార్టీ గుర్తు కేటాయిస్తారు. -
ప్రతి ఓటరుకు స్లిప్పు అందేలా చర్యలు: కలెక్టర్
[ 27-04-2024]
ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఉదయ్కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. -
తెల్లజొన్నలకు పచ్చరంగు
[ 27-04-2024]
పచ్చజొన్నలకు మార్కెట్లో విపరీతంగా డిమాండ్ ఉండటంతో జోరుగా కల్తీ జరుగుతోంది. ఆరోగ్య సమస్యల దృష్ట్యా మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలతో బాధపడుతున్న వారు బియ్యంనకు బదులు పచ్చజొన్నలపై ఆసక్తి కనబరుస్తున్నారు. -
తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటాం..
[ 27-04-2024]
నిత్యవసర సరకులు, తినుబండారాలను కల్తీ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సహజ సిద్ధంగా పండిన జొన్నలను కల్తీ చేస్తున్నట్లు సమాచారం ఉంది. -
లక్ష్యం బారెడు... సేకరణ మూరెడు
[ 27-04-2024]
జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ లక్ష్యం సుదూరంగా కనిపిస్తోంది. పౌరసరఫరాలశాఖ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 27 రోజులు కావస్తున్నా ఇంతవరకు అనుకున్న లక్ష్యంలో కనీసం ఒకశాతం కూడా సేకరించలేదు. -
సేవల సౌలభ్యానికి అంగన్వాడీల సర్వే
[ 27-04-2024]
అయిజ పట్టణంలోని భరత్నగర్ కాలనీకి చెందిన శాంతమ్మ టీచర్స్ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఉంది. సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రోజూ వెళ్లి రావాలంటే ఇబ్బంది. చిన్నారులను కేంద్రానికి పంపాలన్నా ఇబ్బందే.
తాజా వార్తలు (Latest News)
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో