logo

భాజపా విజయానికి కృషి చేయాలి

రానున్న లోక్‌ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు  కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి కోరారు.

Updated : 27 Mar 2024 14:01 IST

రాజోలి : రానున్న లోక్‌ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు  కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి కోరారు.  బుధవారం  ఇటిక్యాల మండలంలోని గ్రామాల్లో మండల అధ్యక్షులు  జగదీశ్వర్‌రెడ్డి  ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  దేశంలో ఎలాంటి అవినీతి పాలన, కుటుంబ పాలన లేని ఏకైక పార్టీ భాజపా అన్నారు. కేంద్రం అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాల గురించి వివరించారు. రానున్న ఎన్నికల్లో భాజపా ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్‌ను  అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఆయన వెంట  మైనార్టీ మోర్చా కార్యవర్గ సభ్యుడు అబ్దుల్లా, జిల్లా కార్యవర్గ సభ్యుడు  మేడికొండ బీమ్సేన్ రావు, నాయకులు  తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని