805 అడుగులకు చేరితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
కృష్ణానదిలో శ్రీశైలం తిరుగుజలాలు గురువారం నాటికి 809 అడుగుల మేర నిల్వ ఉన్నాయి. 805 అడుగుల వరకు నీళ్లు తగ్గితే తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు.
కృష్ణా నదిలో శ్రీశైలం తిరుగుజలాల ఆధారంగా నిర్ణయం
కొల్లాపూర్, న్యూస్టుడే : కృష్ణానదిలో శ్రీశైలం తిరుగుజలాలు గురువారం నాటికి 809 అడుగుల మేర నిల్వ ఉన్నాయి. 805 అడుగుల వరకు నీళ్లు తగ్గితే తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు. ఉన్నతాధికారుల నుంచి మిషన్ భగీరథ పథకం నిర్వహణ అధికారులకు స్పష్టమైన ఆదేశాలున్నాయి. ఈ మేరకు ఈ నెల 15న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా కొల్లాపూర్ మండలం ఎల్లూరు తీరంలో కోతిగుండు, రేగుమాన్గడ్డ ప్రాంతాల్లో శ్రీశైలం తిరుగుజలాల నీటి నిల్వను పరిశీలించారు. ఈ సందర్భంగా నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల కలెక్టర్లు, భగీరథ జిల్లాల అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఆయన సూచనలకనుగుణంగా ఈ వేసవిలో ఏప్రిల్ నెల నుంచి మే, జూన్, జులై నెలలో తాగునీటి సమస్య అధిగమించే విధంగా భగీరథ అధికారులు చర్యలు చేపట్టబోతున్నారు.
నీటి నిల్వలే ప్రధానం.. : మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం (ఎంజీకేఎల్ఐ) ప్రాజెక్టులో ఎల్లూరు రేగుమాన్గడ్డ తీరంలో నిల్వ ఉన్న శ్రీశైలం తిరుగుజలాలను ప్రస్తుతం మోటార్లతో ఎత్తిపోసి ఎల్లూరు జలాశయాన్ని నింపుతున్నారు. ఈ జలాశయం సామర్థ్యం 0.35 టీఎంసీలు. ప్రాజెక్టులో 1, 2, 4వ మోటారు ద్వారా నీటి ఎత్తిపోత కొనసాగుతోంది. 809 అడుగుల నీటినిల్వలో 804 అడుగుల మేర నీళ్లు నిల్వ ఉన్నంత వరకు మోటార్లతో ఎత్తిపోత చేసుకోవచ్చు. అందుకే 805 అడుగుల నీటి నిల్వ వచ్చిన వెంటనే ముందస్తుగా గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు మిషన్ భగీరథ పథకం ఈఈ సుధాకర్సింగ్ చెప్పారు. ఆ విధంగానే తాము ఏర్పాట్లు చేసుకుంటున్నామన్నారు. ఇప్పటికే గ్రామపంచాయతీలు, పురపాలికలలో ఉన్న తాగునీటి వనరులకు మరమ్మతులు, నీళ్లు వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు చెప్పామన్నారు. నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామన్నారు. గతంలోనే రేగుమాన్గడ్డ తీరంలో నీటి నిల్వలు వెనక్కి వెళ్లకుండా కొంతవరకు అడ్డుకట్ట వేశామన్నారు. ఎల్లూరు మిషన్ భగీరథ పథకం ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని గ్రామాలు, పట్టణాలకు లక్ష్యంమేర తాగునీటి సరఫరా చేస్తున్నట్లు ఈఈ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థులకు జడ్పీ ఛైర్పర్సన్ సన్మానం
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను బుధవారం జడ్పీ ఛైర్పర్సన్ సరిత అభినందించారు. -
జోగులాంబ గద్వాల జిల్లాలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత
[ 01-05-2024]
ఈ వేసవి సీజన్ లోనే అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లాలో తొలిసారి 45.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరిక
[ 01-05-2024]
కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరిక -
ఘనంగా మేడే దినోత్సవం
[ 01-05-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో బుధవారం కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో గ్రామంలోని గాంధీ చౌక్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. -
పదిలో బాలికలదే పైచేయి
[ 01-05-2024]
జిల్లాలోని పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్, వివిధ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో కలిపి మొత్తం 10,507 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 9,621 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పది ఫలితాల్లో మెరిసిన బాలికలు
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో బాలికలు మెరిశారు. 89.93 శాతం ఉత్తీర్ణులై బాలురు (84.02 శాతం) కంటే పైచేయి సాధించారు. -
శుద్ధి చేశాకే.. మిషన్ భగీరథ నీటి సరఫరా
[ 01-05-2024]
ప్రైవేటు ప్లాంట్ల కంటే మిషన్ భగీరథ నీరు స్వచ్ఛమైనవని ఈఈ మేఘారెడ్డి అన్నారు. మంగళవారం ‘ఈనాడు’లో ‘నాలుగు రోజులుగా తాగునీటికి పాట్లు’ అనే శీర్షికన ప్రచురితమైన చిత్ర కథనానికి అధికారులు స్పందించారు -
శెభాష్.. పేట
[ 01-05-2024]
పదోతరగతి పరీక్షా ఫలితాల్లో నారాయణపేట జిల్లా ప్రభంజనం సృష్టించింది. ఉమ్మడి జిల్లాలో మొదటి సారిగా ఫలితాల్లో తొలిస్థానంలో నిలిచింది. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో పది జీపీఏలు వచ్చాయి. -
సత్తా చాటిన ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు
[ 01-05-2024]
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రెయిబో పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని యాజమాన్యం తెలిపింది. -
కొలిక్కి వచ్చిన వివాహిత హత్య కేసు
[ 01-05-2024]
మహిళ హత్య కేసులో నిందితుడిని పోలీసులు జుడీషియల్ రిమాండ్కు తరలించారు. ఎస్పీ యోగేశ్గౌతం వివరాలను మంగళవారం విలేకరులకు తెలియజేశారు.. -
అమ్మాయిలదే పైచేయి!
[ 01-05-2024]
పదో తరగతి పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదల కాగా జిల్లాలో అమ్మాయిలే పైచేయి సాధించారు. మొత్తం 12,673 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 11,338 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 6,416కి గాను 5,604 మంది (87.34 శాతం), బాలికలు 6,257కు గాను 5,734 మంది (91.64శాతం) ఉత్తీర్ణత సాధించారు. -
పది ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 01-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో జోగులాంబ గద్వాల జిల్లా 81.38 శాతంతో ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 32వ (చివరి నుంచి రెండో) స్థానంలో నిలిచింది -
‘5న జాతీయ నాయకులతో కాంగ్రెస్ సభ’
[ 01-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా మే 5వ తేదీన జాతీయ నాయకులైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలలో ఒకరితో, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో ఎర్రవల్లిలో బహిరంగ సభ నిర్వహించతలపెట్టినట్లు ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ శాసన సభ్యులు సంపత్కుమార్ తెలిపారు -
ఎన్నికల నిబంధనలు పాటించాల్సిందే..
[ 01-05-2024]
లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు రుచేశ్ జైవన్షి, ఎన్నికల వ్యయ పరిశీలకులు సౌరభ్ సూచించారు -
అసత్య ప్రచారాలు తగవు: కాంగ్రెస్
[ 01-05-2024]
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను అమలు చేస్తోందని, దీనికి తోడు మరో ఐదు గార్యంటీలను అమలు చేసేందుకు సిద్ధపడుతున్న తరుణంలో ప్రతిపక్షాలు తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి ఆరోపించారు -
కార్మికుల దినోత్సవానికి ముస్తాబు
[ 01-05-2024]
మే డే సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ కార్మికులు తమ యూనియన్ దిమ్మెలకు రంగులు వేస్తూ ముస్తాబు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
130 స్కూళ్లకు బెదిరింపు మెయిల్.. ఎన్నికల వేళ ఉగ్ర కుట్రేనా?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘విస్తారా’కు వడగండ్ల దెబ్బ.. విమానం అత్యవసర ల్యాండింగ్
-
కీర్తి సురేశ్తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?