పది ఫలితాల్లో బాలికలదే పైచేయి
రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో జోగులాంబ గద్వాల జిల్లా 81.38 శాతంతో ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 32వ (చివరి నుంచి రెండో) స్థానంలో నిలిచింది
పది పరీక్షలు రాసివస్తున్న విద్యార్థులు (పాతచిత్రం)
గద్వాల అర్బన్, న్యూస్టుడే: రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో జోగులాంబ గద్వాల జిల్లా 81.38 శాతంతో ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 32వ (చివరి నుంచి రెండో) స్థానంలో నిలిచింది. 7,175 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 5,839 మంది ఉత్తీర్ణులయ్యారు. 3,512 మంది బాలురకు 78.67 శాతంతో 2,763 మంది, 3,663 మంది బాలికలకు 83.97 శాతంతో 3,076 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలోని 161 పాఠశాలలకు 25 పాఠశాలల్లో నూరు శాతం ఫలితాలు నమోదయ్యాయి. 34 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఇందిర, పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. గతేడాది ఫలితాలతో పోలిస్తే ఉత్తీర్ణతా శాతం పెరిగినా స్థానం దిగజారింది. 27 స్థానం నుంచి 32కు పడిపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఘన నివాళి
[ 21-05-2024]
గద్వాల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. -
శిథిలావస్థలో గూళ్లు
[ 21-05-2024]
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వేల సంఖ్యలో కుటుంబాలు శిథిలావస్థకు చేరిన ఇళ్లు, మట్టి మిద్దెల్లోనే జీవనం సాగిస్తున్నాయి. ఏటా వర్షాకాలం వస్తే ఎప్పుడు ఇల్లు కూలుతుందోనని తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. -
ఉప కులపతి నియామకానికి అన్వేషణ
[ 21-05-2024]
రాష్ట్రంలోని 10 వర్సిటీలకు నూతన ఉప కులపతి(వీసీ)ల నియామకానికి సెర్చ్(అన్వేషణ) కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో యూనివర్సిటీల పాలకమండలి నామినీ, రాష్ట్ర ప్రభుత్వం నామినీ, యూజీసీ నామినీ ముగ్గురు సభ్యులుగా ఉంటారు. -
నిర్లక్ష్యం జాస్తి.. పనులు అసంపూర్తి
[ 21-05-2024]
రెండు జిల్లాలకు వరదాయినిగా ఉన్న మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (ఎంజీకేఎల్)లో మంజూరైన రహదారులు, ప్రధాన కాల్వలకు లైనింగ్ నిర్మాణ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. -
పశుదాణాగా బాలామృతం
[ 21-05-2024]
ఏదైనా డబ్బుపెట్టి కొంటే ఎంతో అపురూపం. అదే ఊరికే వస్తే ఎంత విలువైనదైనా నిర్లక్ష్యమే. శరీరానికి పోషకాలు అందడానికి సగటు మనుషులు డబ్బుపెట్టి తిప్పలు పడుతున్న ఈ రోజుల్లో... పోషకాల గనిగా పేరొందిన బాలామృతాన్ని పశువులకు దాణాగా వేస్తున్నారంటే ఏమనుకోవాలి. -
టీఎస్ స్థానంలో ఇక టీజీ
[ 21-05-2024]
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టీఎస్ స్థానంలో టీజీగా మార్చాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశాలు జారీచేశారు. వివిధ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు ఏజెన్సీ పేర్లలో ఈ మార్పు ఉండాలన్నారు. -
కిసాన్ సమ్మాన్ నిధి.. కొందరికే
[ 21-05-2024]
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన నిధి పథకం కొంత మంది రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూరుతోంది. గత నాలుగేళ్లుగా ఇప్పటి వరకు 16 విడతలుగా ఏటా రూ. 6 వేలను మూడు విడతలుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసింది. -
లక్షలు వెచ్చించినా.. నెరవేరని లక్ష్యం
[ 21-05-2024]
రైతుల సహకారంతో మహిళా సంఘాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం సాగుకు అవసరమయ్యే పరికరాలను తక్కువ ధరకు అద్దెకు ఇచ్చేందుకు జిల్లాలోని పలు మండల మహిళా సంఘాలతో సీహెచ్సీ (ఆధునిక పరికరాల అద్దె కేంద్రాలు)లను ఏర్పాటు చేసింది. -
అప్రమత్తతకు సాంకేతిక దన్ను
[ 21-05-2024]
అకాల వర్షాలు అన్నదాతలకు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. ఏ క్షణాన వర్షం కురుస్తుందో.. ఎక్కడ పిడుగు పడుతుందో తెలియని పరిస్థితి. వర్షాలు, పిడుగుపాటుకు గురై మనుషులు, మూగజీవాలు మృత్యువాత పడిన సంఘటనలు జిల్లాలో ఉన్నాయి. -
తనిఖీలపై దృష్టి.. అయ్యేనా సంపద సృష్టి?
[ 21-05-2024]
సంపద సృష్టి కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా ఆదేశించారు. గత శనివారం ఆయా జిల్లాల పంచాయతీ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలో కంపోస్టు ఎరువులను నిరంతరంగా తయారు చేయాలన్నారు. -
ఇసుక రవాణాను అడ్డుకున్న రైతులు
[ 21-05-2024]
నిత్యం వందలాది ట్రిప్పుల ఇసుకను రవాణా చేస్తుండటంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయని, ఓవర్ లోడుతో భారీ వాహనాలు వెళ్తుండటంతో దారులు దెబ్బతింటున్నాయని సోమవారం కల్వకుర్తి మండలం గుండూరు గ్రామంలో ఇసుక టిప్పర్లను గ్రామస్థులు అడ్డుకున్నారు. -
పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని బాలుడి దుర్మరణం
[ 21-05-2024]
పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని బాలుడు మృతిచెందిన ఘటన మహబూబ్నగర్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై కథనం ప్రకారం.. -
ఇద్దరు మహిళలది హత్యే
[ 21-05-2024]
కర్నూలు మండలం గార్గేయపురం నగరవనం చెరువులో మహిళల మృతికి సంబంధించిన మిస్టరీకి దాదాపు తెరపడింది. ఈనెల 19న చెరువులో ఇద్దరు గుర్తుతెలియని మహిళల మృతదేహాలు, గట్టున మరో మహిళ మృతదేహం బయటపడిన సంగతి విదితమే. -
దంచికొట్టిన వాన
[ 21-05-2024]
జడ్చర్లలో సోమవారం సాయంత్రం అరగంట పాటు వాన దంచికొట్టింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్టణంలో విద్యుత్తు సరఫరాకు ఆటంకం ఏర్పడింది. -
అవిశ్వాసంపై మరోమారు చర్చలు
[ 21-05-2024]
పురపాలిక ఛైర్పర్సన్పై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టేందుకు జడ్చర్లలో సోమవారం మరోమారు భారాస కౌన్సిలర్లు చర్చలు జరిపారు. ఛైర్పర్సన్గా కొత్తగా ఎవరిని ఎంపిక చేసుకోవాలన్న దానిపై అభిప్రాయ సేకరణ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
చైనా ఆక్రమిస్తే.. కిల్ స్విచ్ ఆన్ అవుతుంది: సెమీకండెక్టర్ తయారీ సంస్థల ప్లాన్..!
-
యూరప్ ట్రిప్ మరింత భారం.. షెంజెన్ వీసా ఫీజు పెంపు
-
బీఎస్ఈ మార్కెట్ క్యాప్ @ 5 ట్రిలియన్.. ఫ్లాట్గా ముగిసిన సూచీలు
-
తెలంగాణలో 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీలను నియమించిన ప్రభుత్వం
-
తొలి క్వాలిఫయర్.. అభిషేక్కు ఆ జోడీ నుంచే ముప్పు: భారత మాజీ క్రికెటర్
-
సిట్ నివేదికపై ఈసీ ఆదేశాలు వస్తే ఏం చేద్దాం?.. సీఎస్తో డీజీపీ భేటీ