పేదోళ్లు ఇంటర్ చదవద్దా?
ఉమ్మడి పాలమూరులో వెనకబడిన జిల్లా నారాయణపేట. కార్మికులు, వలస కూలీల జిల్లాగా పేరుంది.
కళాశాలలు లేక అవస్థలు
పడకేసిన ప్రతిపాదనలు
న్యూస్టుడే, నారాయణపేట పట్టణం : ఉమ్మడి పాలమూరులో వెనకబడిన జిల్లా నారాయణపేట. కార్మికులు, వలస కూలీల జిల్లాగా పేరుంది. విద్యారంగంలోనూ వెనుకబడి ఉంది. 2019లో కృష్ణా, మరికల్ కొత్త మండలాలుగా ప్రకటిస్తూ 11 మండలాలతో 32వ జిల్లాగా ఏర్పాటు చేశారు. ఆ తరువాత కొత్తపల్లి, గుండుమాల్ ఏర్పాటు చేయడంతో జిల్లాలో మొత్తం 13 మండలాలు అయ్యాయి. మండలానికి ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది. ప్రస్తుతం కోస్గి, మద్దూరు, దామరగిద్ద, నారాయణపేట, ధన్వాడ, ఊట్కూరు, మక్తల్, మాగనూరుల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. నర్వ, కృష్ణా, మరికల్తోపాటు కొత్త మండలాలైన గుండుమాల్, కొత్తపల్లిల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు లేవు. నారాయణపేటలో బాలికల జూనియర్ కళాశాలతోపాటు మరికల్, నర్వల్లో కాలేజీల కోసం ఎన్నో ఏళ్లుగా డిమాండు ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉండి విద్యాసౌకర్యం లేక అనేకమంది పిల్లలు చదువులకు దూరమవుతున్నారు. ఆర్థిక స్థోమత లేకపోవడం, సరైన రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కొందరు విద్యార్థులు పదిలో మంచి మార్కులు సాధించినా చదువుకోలేక వ్యవసాయ కూలీలుగా మారుతున్నారు. వసతిగృహాల్లో సీటు రాని వారి పరిస్థితి దయనీయంగా ఉంది.
మచ్చుకు ఓ ఉదాహరణ: జిల్లా కేంద్రానికి నర్వ 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మక్తల్ 25 కి.మీ, ఆత్మకూర్ 20 కిలోమీటర్లు ఉంటుంది. ఆర్థికంగా స్థోమత ఉన్నవారు రవాణా ఖర్చులు భరించి వెళ్లివస్తున్నారు. బీదాబిక్కీ పిల్లలు కూలీలుగా మారుతున్నారు. అత్యధిక మార్కులు సాధించే అమ్మాయిలకు సైతం పెళ్లిల్లు చేసి అత్తరింటికి సాగనంపుతున్నారు. ఇరవైఏళ్లుగా నర్వలో కాలేజీ కోసం ఆందోళనలు జరగుతున్నాయి. కళాశాల సాధన కమిటిని ఏర్పాటు చేసి ధర్నాలు, నిరసనలు చేపట్టారు. ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు నేటికీ నేరవేరలేదు. కాలేజీ కోసం అప్పట్లో సర్పంచి స్వాతిలక్ష్మీకాంత్రెడ్డి రెండెకరాల స్థలం ఉచితంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అయినా ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదు.
ఈ స్కూళ్ల పిల్లలు ఏమవ్వాలి?: జిల్లాలో జూనియర్ కళాశాల లేని మండలాల్లో జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాలలు సరిపడా ఉన్నాయి. అ్కడి నుంచి ఎంతోమంది ప్రతిభావంతులు తయారవుతున్నారు. వీరందరూ పదోతరగతి పూర్తయ్యాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నర్వ : నర్వ, పెద్దకడుముర్, పాతర్చేడ్, ఉందేకోడ్, కల్వాల్ల్లో ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.
మరికల్ : మరికల్లో బాలురు, బాలికలు, ఉర్దూ హైస్కూళ్లు ఉన్నాయి. పెద్దచింతకుంట, కన్మనూర్ల్లోనూ హైస్కూళ్లు ఉన్నాయి.
కృష్ణా : కృష్ణా, గుడేబల్లూర్, ముడుమాల్ గ్రామాల్లో జడ్పీ ఉన్నతపాఠశాలలు ఉన్నాయి.
గుండుమాల్ : గుండుమాల్, కొమ్మూరు, కొత్తపల్లి మండలంలె భూనీడ్, నిడ్జింతల్లో హైస్కూళ్లు ఉన్నాయి.
చదువుకు దూరమయ్యాను: మాది పెద్దకడ్మూర్. మా ఊళ్లోనే పదోతరగతి వరకు చదివి ఉత్తీర్ణత సాధించాను. ఇంటర్ చదువుకోవాలని ఆశ ఉన్నా దగ్గరలో కాలేజీ లేదు. ప్రైవేటులో చదువుకునే స్థోమత లేదు.కూలిచేసుకుని డబ్బులు దాచుకుని చదువుకుందామన్నా కనీసం ప్రైవేటు కళాశాల కూడా లేదు. వ్యవసాయం చేసుకుంటున్నాను. నాలాంటి పరిస్థితిలో చాలామంది ఉన్నారు.
మహేశ్, పెద్దకడ్మూర్, నర్వ మండలం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆత్మలొచ్చి.. అమ్ముతున్నాయ్..!
[ 17-05-2024]
ఒక్కటే రోజు మొత్తం 40కుపైగా రిజిస్ట్రేషన్లు.. ఇవన్నీ గ్రామ పంచాయతీ లేఅవుట్లు.. తెర వెనుక ఓ పార్టీ నేత. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కేంద్రంగా సాగిన ఈ దందాలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయి. -
పశువైద్యంలో కొత్త పోకడలు
[ 17-05-2024]
తక్కువ ఖర్చుతో, దుష్ప్రభావాలు లేకుండా వ్యాధులు నయం చేసే హోమియో మందులను యూరోపియన్ దేశాల్లో వైద్యులు పశువైద్యంలోనూ వాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పశువైద్యులు కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. -
అభిమాని రక్తంతో ముఖ్యమంత్రి చిత్రం
[ 17-05-2024]
నారాయణపేట జిల్లా మద్దూరుకు చెందిన ఓ అభిమాని తన రక్తంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిత్రాన్ని గీయించి అభిమానం చాటుకున్నారు. -
గద్వాల కేంద్రంగా.. రేషన్ బియ్యం దందా
[ 17-05-2024]
శాంతినగర్లో గత నెల 27వ తేదీ 114 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కొయిలదిన్నెరోడ్డు పక్కన ఉన్న పిండిగిర్ని నడిపే ఓ ఇంట్లో బియ్యం నిల్వ ఉన్నట్లు సమాచారం రావడంతో దాడులు నిర్వహించి పట్టుకున్నారు. -
ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఎక్కడంటే...!
[ 17-05-2024]
రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. 17 స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. -
నల్లమలలో పెరిగిన ఓటింగ్
[ 17-05-2024]
నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేకపోయినా ఎన్నికల సిబ్బంది చెంచు పెంటలకు వెళ్లి రాత్రి అక్కడే బస చేసి పోలింగ్ను విజయవంతం చేశారు. నల్లమలలోని ఆగర్లపెంటకు రెండు కి.మీ. దూరం కాలినడకన అటవీ ప్రాంతంలో ప్రయాణించి అక్కడే బస చేసి భయం గుప్పిట్లో కాలం గడిపారు. -
చిన్నారిపై అత్యాచారయత్నం.. నిందితుడికి మూడేళ్ల జైలు
[ 17-05-2024]
ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించిన నిందితుడికి న్యాయస్థానం మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10,000 జరిమానా విధించింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సునీత కథనం ప్రకారం.. -
అమ్మ కడుపు చల్లగా..
[ 17-05-2024]
వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణతో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు పెరుగుతున్నాయి. అమ్మ కడుపు చల్లగా ఉండాలని అధికారులు సాధారణ ప్రసవాలకు చొరవ తీసుకుంటున్నారు. -
జూరాలకు కృష్ణా జలాలు
[ 17-05-2024]
జూరాల జలాశయంలోకి గురువారం ఉదయం నుంచి 2,510 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. జలాశయంలో తీసుకోదని నీటినిల్వ 0.244 టీఎంసీల మేర ఉంది. -
ప్రవేశాల పెంపే లక్ష్యం
[ 17-05-2024]
ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన విద్య అందిస్తున్నామని చెబుతూ ప్రిన్సిపల్స్, అధ్యాపకులు ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇంటర్మీడియట్లో 2024-25 విద్యా సంవత్సరానికిగాను తొలివిడత ప్రక్రియ ప్రారంభమైంది. -
2021లో మంజూరు.. పూర్తయ్యేదెన్నడో?
[ 17-05-2024]
దేశాభివృద్ధికి పల్లెలే పట్టుగొమ్మలు.. మారుమూల గ్రామాలకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో సరైన రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పల్లెలు పట్టణాలుగా మారుతున్నప్పటికీ వాటిదశ మారకపోవడం విచారకరం. -
బాధ్యత మరచి.. కుటుంబానికి దూరమై
[ 17-05-2024]
ద్విచక్ర వాహన చోదకులు శిరస్త్రాణం ధరించక ప్రమాదాలబారిన పడినప్పుడు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. జిల్లాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో శిరస్త్రాణం ధరించకపోవడం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలున్నాయి. ప్రమాదాల నుంచి పాఠం నేర్చుకోవాల్సిన వాహనదారులు భద్రతను గాలికొదిలేస్తున్నారు. -
అయిజ విండో ఆదర్శం
[ 17-05-2024]
అయిజ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఉమ్మడి జిల్లాలోని ఇతర విండోలు ఆదర్శంగా తీసుకోవాలని నాబార్డ్ ఉమ్మడి జిల్లా డీడీఎంలు షణ్ముఖచారి, మనోహర్రెడ్డి కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ముగ్గురు బందీల మృతదేహాలు లభ్యం.. మృతుల్లో ఆ యువతి కూడా!
-
‘బుజ్జి’ని పరిచయం చేయనున్న ప్రభాస్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే
-
నా కుమారున్ని మీకు అప్పగిస్తున్నాను: సోనియాగాంధీ
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు
-
‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
-
మళ్లీ భాజపా గెలిస్తే.. ఆ నేతలు కటకటాల్లోకే..: కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు