వనిత..కలత!
ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధిక ఓటర్లు అతివలే. పురుష ఓటర్ల కంటే వారు 1,13,920 మంది ఎక్కువగా ఉన్నారు.
సగానికి పైగా ఓటర్లున్నా లోక్సభలో దక్కని ప్రాతినిధ్యం
ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధిక ఓటర్లు అతివలే. పురుష ఓటర్ల కంటే వారు 1,13,920 మంది ఎక్కువగా ఉన్నారు. ఏ ఎన్నిక జరిగినా గెలుపోటములను ప్రభావితం చేసేది కూడా వారే. అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచినా ఇప్పటివరకు ఎంపీలు మాత్రం కాలేకపోయారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే, చట్టాలు రూపొందించే ప్రజాస్వామ్య మందిరం పార్లమెంట్లో ఇక్కడి అతివలు అడుగు పెట్టలేకపోయారు. ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ స్థానాలు ఉన్నాయి. వాటికి 1952 నుంచి ఇప్పటి వరకు 15 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఇక్కడి రెండు లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల తరఫున పోటీ చేసిన మహిళలు కూడా కొందరే కావటం గమనార్హం.
న్యూస్టుడే, మహబూబ్నగర్ గ్రామీణం, ధరూరు
డీకే అరుణ
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఇప్పటివరకు పోటీచేసిన మహిళ డీకే అరుణ మాత్రమే. మంత్రిగా పనిచేసి, రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమైన మహిళా నేతగా పేరు సంపాదించిన ఆమె 1995లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1996లో తెదేపా ఆమెకు మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి పోటీకి అవకాశం కల్పించింది. ఈ ఎన్నికల్లో డీకే అరుణ కాంగ్రెస్ అభ్యర్థి డా.మల్లికార్జున్ చేతిలో 3,700 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. తర్వాత నడిగడ్డ రాజకీయాలపై దృష్టిసారించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టికెట్ రాకపోవటంతో ఆ పార్టీని వదిలిన డీకే అరుణ భాజపా తరఫున ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఎన్నికలో భారాస అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి చేతిలో ఓడిపోయారు. డీకే అరుణకు మొత్తం 3,33,121 ఓట్లురాగా రెండో స్థానంలో నిలిచారు. ఈసారి కూడా భాజపా అభ్యర్థిగా బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరో ముగ్గురు సరోజనమ్మ, గోవిందమ్మ, విజయ పోటీలో ఉన్నారు.
నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానంలో ఇప్పటివరకు ప్రధాన పార్టీల తరఫున ఇద్దరే మహిళలు పోటీ చేశారు. తెదేపా ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరిన ఇందిరకు 1985లో ఎన్టీఆర్ షాద్నగర్ అసెంబ్లీ టికెట్ ఇవ్వగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989లోనూ తెదేపా నుంచి పోటీ చేయగా ఓటమి పాలయ్యారు. తర్వాత తెదేపాను వీడిన ఇందిర లక్ష్మీపార్వతి పెట్టిన ఎన్టీఆర్ తెదేపాలో చేరారు. ఇందిరకు నాగర్కర్నూల్ ఎంపీ టికెట్ ఇవ్వగా 1996లో పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2004లో బీఎస్పీ తరఫున రాణి రత్నమాల పోటీ చేశారు. సుదీర్ఘ కాలం తర్వాత 2019 ఎన్నికల్లో నాగర్కర్నూల్ లోక్సభ స్థానానికి భాజపా అభ్యర్థిగా బంగారు శృతి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 1,29,021 ఓట్లతో ఆమె మూడో స్థానంలో నిలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో నిలిచి రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన బర్రెలక్క (శిరీష) లోక్సభ ఎన్నికల బరిలోనూ నిలిచారు. దాసరి భారతి, గీత పోటీలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికారుల చోద్యం.. అటకెక్కిన వైద్యం
[ 20-05-2024]
వివిధ పరిశ్రమలు, సంస్థల్లో పనిచేసే కార్మికులు, చిరుద్యోగులు ప్రతి నెలా తమ జీతం నుంచి కొంత మొత్తం ఈఎస్ఐ(ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్) వైద్యసేవల కోసం రుసుంగా చెల్లిస్తుంటారు. -
కళ్లు మూసుకుంటే మోసమే
[ 20-05-2024]
వానాకాలం సాగుకు సమయం అసన్నమవుతోంది. -
నేటి నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష
[ 20-05-2024]
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) - 2024 సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జూన్ 6వ తేదీ వరకు రోజూ పరీక్ష నిర్వహిస్తారు. -
స్ట్రాంగ్రూంల వద్ద పకడ్బందీ భద్రత
[ 20-05-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్రూంల వద్ద నిరంతరం భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షించాలని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ జి.రవి నాయక్ సూచించారు. -
పంచాయతీల్లో పైసల్లేవ్..!
[ 20-05-2024]
గ్రామపంచాయతీ పాలక మండలి గడువుకు ముందే అధికారుల ఒత్తిడితో పలు అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు ఇప్పటికీ వాటి బిల్లులు దక్కలేదు. -
డిజిటల్ విద్యకే అధిక ప్రాధాన్యం
[ 20-05-2024]
ఏటా సర్కారు బడులకు రూ.కోట్ల నిధులు మంజూరవుతున్నా.. వాటిని పూర్తి స్థాయిలో వినియోగించకపోవడంతో వెనక్కి వెళ్తున్న పరిస్థితులున్నాయి. -
సాగు ప్రణాళిక ఖరారు
[ 20-05-2024]
జిల్లాలో ఖరీఫ్ సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు 2024-25 సంవత్సరానికి సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేశారు. -
స్థానిక సమరానికి సమాయత్తం
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించింది. -
నాటే సమయం వచ్చింది.. మొక్కలేవీ?
[ 20-05-2024]
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. -
మళ్లీ చౌకగా నిత్యావసరాలు!
[ 20-05-2024]
రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు తక్కువ ధరకు ఇతర నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
విద్యార్థులను ప్రోత్సహించాలి: చిన్నారెడ్డి
[ 20-05-2024]
చదువుపై ఆసక్తి ఉన్న విద్యార్థులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. -
నిర్వాసితులను మోసంచేసిన వారిపై చర్యలు తీసుకోండి
[ 20-05-2024]
అధిక వడ్డీల ఆశచూపి పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు భూనిర్వాసితుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మోసం చేసిన ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 20-05-2024]
ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్, జిల్లా కన్వీనర్ బక్కన్న తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్ను ఆదుకొన్న తుర్కియే డ్రోన్.. బైరక్తర్ అకిన్సి విశేషాలు..!
-
అధిక వడ్డీ ఆశచూపి రూ.200 కోట్లు మోసం.. పోలీసు స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన
-
భారత జట్టుతోపాటు.. మీ నలుగురికి ఆల్ ది బెస్ట్: నీతా అంబానీ
-
అందుకే మధ్యతరగతి మహిళలు నాకంత ఆసక్తిగా అనిపించరు : సంజయ్ లీలా బన్సాలీ
-
బాధితుల గోడును ప్రసారం చేస్తే మీడియాపై కేసులా?: దేవినేని
-
చిన్నారి వైరల్ వీడియోపై విమర్శలు.. తల్లి ఆత్మహత్య