logo

సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రవల్లి మండల కేంద్రంలో జరగనున్న జన జాతర సభ భద్రత ఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్ సంతోష్...

Updated : 04 May 2024 16:57 IST

రాజోలి: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రవల్లి మండల కేంద్రంలో జరగనున్న జన జాతర సభ భద్రత ఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్ సంతోష్, ఎస్పీ రితిరాజ్ పరిశీలించారు. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు హాజరుకానున్న నేపథ్యంలో ఎలాంటి భద్రత తీసుకోవాలి, వాహనాల పార్కింగ్, రూట్ మ్యాప్ తదితర అంశాలను భద్రతా సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని