logo

మోసపూరిత మాటలు చెప్పి కాంగ్రెస్‌ మోసం చేసింది

తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల నిజానికి, వందరోజుల అబద్ధానికి జరుగుతున్న ఈ ఎన్నికల యుధ్ధంలో భారాస విజయం సాధిస్తుందని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు.

Updated : 04 May 2024 19:44 IST

రాజోలి: తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల నిజానికి, వందరోజుల అబద్ధానికి జరుగుతున్న ఈ ఎన్నికల యుధ్ధంలో భారాస విజయం సాధిస్తుందని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. శనివారం అలంపూర్ పట్టణంలో ఆయన ఎమ్మెల్యే విజయుడుతో కలిసి ముఖ్య కార్యకర్తలు, నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలుపు కోసం చేయాల్సిన కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. తెలంగాణ సంక్షేమ కోసం కృషి చేస్తున్న కేసీఆర్‌తో కలిసి ప్రయాణించాలాన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు మోసపూరితమైన మాటలు చెప్పి ప్రజలకు మోసం చేసిందని విమర్శించారు. అలంపూర్ మండలం ముఖ్య నాయకులు, భారాస సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని