ఫలానావారి కుమార్తెలు 30లక్షల మంది
1951లో తొలిసారి ఓటరు నమోదు చేపట్టారు. అప్పట్లో ఆచారాలు, సంప్రదాయాల కారణంగా మహిళలు తమ పేరుతో పాటు భర్త పేరు చెప్పేందుకు నిరాకరించారు.
1951లో తొలిసారి ఓటరు నమోదు చేపట్టారు. అప్పట్లో ఆచారాలు, సంప్రదాయాల కారణంగా మహిళలు తమ పేరుతో పాటు భర్త పేరు చెప్పేందుకు నిరాకరించారు. కొందరు తండ్రి పేరు మాత్రమే చెప్పడంతో ఎన్నికల సిబ్బంది విధిలేని పరిస్థితుల్లో ఫలానా వారి కుమార్తెగా ఓటర్ల జాబితాలో వివరాలు నమోదు చేసుకున్నారు. ఓటర్ల పేర్లు లేకుండా కేవలం తండ్రుల పేరుతో దేశంలో 30 లక్షల వరకు ఓటర్ల జాబితాలో నమోదు చేశారు. ఈ జాబితాలను పరిశీలించిన ఎన్నికల సంఘం పేరు, భర్త పేరు లేకుండా కేవలం ఫలానా వారి కుమార్తె అని నమోదు చేసిన ఓటర్లందరినీ జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించడంతో ఓటు హక్కు కోల్పోవాల్సి వచ్చింది.
న్యూస్టుడే, అచ్చంపేట
ద్వితీయశ్రేణి.. హడావుడి ఏదీ?
రాజోలి, న్యూస్టుడే : అసెంబ్లీ ఎన్నికల్లో ద్వితీయ శ్రేణి నాయకుల హడావుడి అంతా ఇంతా కాదు. అభ్యర్థి రాకపోయినా, ప్రతి రోజూ ఇంటింటికీ తిరుగుతూ.. కార్యకర్తలను పోగు చేస్తూ.. వారికి కావాల్సిన అవసరాలు తీరుస్తూ.. ప్రచారం చేశారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల ప్రచారంలో అలాంటి హడావుడి ఏమీ కనిపించడం లేదు. ఒకటి, రెండు చోట్ల మినహాయిస్తే.. ద్వితీయ శ్రేణి నాయకులు గుంబనం వీడటం లేదు. పోలింగ్కు సమయం దగ్గర పడుతున్నా కార్యకర్తల్లో ఉత్తేజం, ఉత్సాహం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ఆరు నెలలకే ఈ ఎన్నికలు రావడంతో స్తబ్దత నెలకొన్నట్లు కన్పిస్తోంది.
నిరాసక్తి: ఆర్థిక భారం ఎక్కడ మీదపడుతుందోననే ఉద్దేశంతో కొందరు నాయకులు దూరంగా ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగానే ద్వితీయ శ్రేణి నాయకులను ఏకతాటిపైకి తెచ్చేందుకు ముఖ్య నాయకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదనే చర్చ జరుగుతోంది. ఒక వేళ ఎవరైనా ఖర్చు చేసి, పార్టీ గెలుపునకు కృషి చేసినా, పార్లమెంట్ నియోజకవర్గం కావడంతో గెలిచిన అభ్యర్థి మమ్మల్ని గుర్తించుకుంటాడా? అనే సందిగ్ధం కూడా ద్వితీయశ్రేణి నాయకుల్లో నెలకొంది. ఫలితంగా వారి హడావుడి కనిపించడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మందకొడిగా ధాన్యం సేకరణ
[ 18-05-2024]
పాలమూరులోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ మందకొడిగా సాగుతోంది. యాసంగిలో మహబూబ్నగర్లో 1.11 లక్షలు, నాగర్కర్నూల్-1.09 లక్షలు, నారాయణపేట-1.15 లక్షలు, వనపర్తి-91 వేలు, జోగులాంబ గద్వాల-50వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. -
రుణమాఫీపై ఆశలు
[ 18-05-2024]
శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణ మాఫీ అమలుకు ప్రభుత్వం కటాఫ్ తేదీ ప్రకటించటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.రెండు లక్షలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. -
ఆర్టీసీకి పోటెత్తారు
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు సొంతూళ్లకు ఓటేసేందుకు పోటెత్తారు. ఈనెల 13న లోక్సభ ఎన్నికలు జరగడంతో పట్టణాలు, నగరాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు స్వగ్రామాలకు తరలొచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. -
వేసవిలో ముంచెత్తుతున్న వర్షాలు
[ 18-05-2024]
జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారు జామున భారీ వర్షం కురిసింది. గట్టు మండలకేంద్రంలో అత్యధికంగా 10.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
నిఘా నేత్రాలు అరకొర!
[ 18-05-2024]
రద్దీ ప్రాంతాల్లో జేబు దొంగలు తమ వాటం ప్రదర్శిస్తుంటారు. నిత్యం వేలాది మందితో కిటకిటలాడే మహబూబ్నగర్ బస్టాండు ఇందుకు వేదిక అవుతోంది. నెలలో రెండు నుంచి నాలుగు వరకు దొంగతనాలు జరుగుతున్నాయి. మహాలక్ష్మి టిక్కెట్లు అందుబాటులోకి వచ్చాక ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిన సంగతి విధితమే. -
వేధింపుల నివారణకు ప్రత్యేక కమిటీలు
[ 18-05-2024]
పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక కమిషనర్లు విధిగా వేధింపులను నియంత్రించేందుకు కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 19 పురపాలికల్లో కమిటీల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించారు. -
ఈ-శ్రమ్ సద్వినియోగం చేసుకోండి
[ 18-05-2024]
అసంఘటిత కార్మికులు ఈ-శ్రమ్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్.సునీత సూచించారు. శుక్రవారం వనపర్తి కోర్టు ఆవరణలో అసంఘటిత కార్మికులకు ఈ-శ్రమ్ పోర్టల్పై ఉచిత న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. -
పంటల ప్రణాళిక ఖరారు
[ 18-05-2024]
జిల్లాలో వానాకాలం పంటల ప్రణాళికను వ్యవసాయశాఖ ఖరారు చేసింది. అన్ని రకాల పంటలు కలిపి 2,45,953 ఎకరాల్లో సాగు చేస్తారని అధికారులు అంచనాలు తయారు చేశారు. కేవలం వర్షాధారంగానే కాకుండా చెరువులు, బావులు, బోర్ల ఆధారంగా వానాకాలం పంటలను రైతులు సాగు చేస్తారు. -
సాంకేతిక విద్య.. భవితకు భరోసా
[ 18-05-2024]
విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకొని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందాలంటే వారికి సాంకేతిక విద్య అవసరం. దీనికోసం ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరానికి ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. -
ఇంట్లో కుక్కుంది.. పెంపకంలో లెక్కుంది
[ 18-05-2024]
వికారాబాద్ జిల్లా తాండూరులో ఓ పెంపుడు కుక్క ఆ ఇంట్లో చిన్నారిని తీవ్రంగా గాయపరిచి, చంపేసింది. ప్రేమకు ప్రతిరూపాలుగా భావించే పెంపుడు జంతువులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన తెలియజేస్తోంది. ఇంట్లో పెంచే పప్పీలు, పెద్దజాతి కుక్కల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఏమిటో తెలుసుకుందాం. -
పిల్లలూ కథలు చదివేద్దామా.!
[ 18-05-2024]
వేసవి సెలవుల్లో విద్యార్థులు ఆన్లైన్ గేమ్స్, సామాజిక మాధ్యమాలకు పరిమితం కాకుండా వారిలో పఠనాశక్తి పెంచే దిశగా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఎన్సీఈఆర్టీ సహకారంతో రూమ్ టూ రీడ్ సంస్థ ‘లిటరసీ క్లౌడ్’ మాధ్యమం ద్వారా ఇంటి వద్దనే ప్రాథమిక స్థాయి విద్యార్థులు కథలు చదువుకునేలా ఏర్పాటు చేసింది. -
పోలింగ్ సిబ్బందికి చెల్లింపుల్లో వ్యత్యాసం
[ 18-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి పారితోషికం చెల్లింపుల్లో వ్యత్యాసం ఉండటంతో ఉపాధ్యాయులు, ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
సెలవులు పూర్తయ్యేసరికి బడులకు వసతులు:ఏసీ
[ 18-05-2024]
వేసవి సెలవులు పూర్తయ్యేలోపు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు పనులను పూర్తి చేయాలని, విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్ సూచించారు. చిన్నపొర్ల పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీల పనులను శుక్రవారం పరిశీలించి మాట్లాడారు. -
మరమ్మతులకు ఇదే తరుణం!
[ 18-05-2024]
ఒకప్పుడు కరవు కాటకాలకు, వలసలకు పాలమూరు జిల్లా చిరునామాగా ఉండేది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి అప్పట్లో మంజూరైనదే భీమా ప్రాజెక్టు. మొదటిదశ కింద మక్తల్ నియోజకవర్గంలో 1998లో రెండు జలాశయాలు నిర్మించతలపెట్టారు. -
ఆరోగ్య కేంద్రాల్లో మరిన్ని ప్రత్యేక సేవలు
[ 18-05-2024]
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఇప్పటికే అందిస్తున్న ఐదు రకాల వైద్యసేవలతోపాటు మరో ఏడు కొత్త సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు వైద్య,ఆరోగ్యశాఖ చర్యలు చేపడుతోంది.