logo

మరికల్‌లో భారీ చోరీ

మరికల్‌ పట్టణంలో శుక్రవారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. బంగారం, నగదు కలిపి సుమారుగా రూ. 34 లక్షలు విలువ చేసే సొత్తును దొంగలు ఎత్తుకెళ్లారు.

Published : 05 May 2024 02:13 IST

40 తులాల బంగారం, రూ.10లక్షల నగదు మాయం

బాధిత కుటుంబికులతో మాట్లాడుతున్న ఎసీˆ్ప యోగేశ్‌ గౌతమ్‌ తదితరులు

మరికల్‌ (ధన్వాడ), న్యూస్‌టుడే : మరికల్‌ పట్టణంలో శుక్రవారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. బంగారం, నగదు కలిపి సుమారుగా రూ. 34 లక్షలు విలువ చేసే సొత్తును దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం గౌడపోళ్ల రాములు ఇల్లు గుండాలఏరియా(కొత్త బస్టాండ్‌ వెనుక భాగాన)లో ఉంది. శుక్రవారం రాత్రి కొడుకు, కోడలు ఒక పోర్షన్‌లో నిద్రించగా, ఏసీ వసతి ఉన్న మరో పోర్షన్‌లో రాములు, భార్య, పిల్లలు ఇంటికి తాళం వేసి బయట నిద్రపోయారు. ఇంటి తాళాలు కిటికీ వద్ద ఉంచారు. మధ్యరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా కిటికీలోని తాళాలు తీసుకొని ఇల్లు తెరిచారు. ఇంట్లో ఉన్న బీరువా తాళాలను సైతం తీసుకొని అందులో 40 తులాల బంగారం ఆభరణాలు, రూ. పదిలక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఎప్పటి మాదిరిగా బీరువా, ఇంటికి తాళాలు వేసి మొదట ఉన్న చోటనే తాళాలను ఉంచి పరారయ్యారు. ఉదయం నిద్రలేచిన తర్వాత దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించిన రాములు స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పేట ఎస్పీ యోగేశ్‌ గౌతమ్‌, డీఎస్పీ లింగయ్య, సీఐ రాజేందర్‌రెడ్డి, ఎస్‌ఐ మురళి సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని