logo

ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు

100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలను పూర్తిగా మోసం చేసిందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి ఆరోపించారు.

Updated : 05 May 2024 12:00 IST

రాజోలి: 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలను పూర్తిగా మోసం చేసిందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి ఆరోపించారు. ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఆయన ఆదివారం పట్టణంలోని రాఘవేంద్ర కాలనీలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా ఆయన కాలనీలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. భారాస పార్టీ పేద ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందని వెల్లడించారు. 9వ వార్డులో పలువురు నాయకులు భారాస పార్టీలోకి చేరారు. నిత్యావసర సరుకుల ధరలు పెంచిన భాజపా ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా భారాస సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ రాజశేఖర్, వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, మున్సిపల్ వైస్ ఛైర్మన్ బాబర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని