సీఎంఆర్ బియ్యం సమకూరేనా?
మిల్లర్లకు కేటాయించిన సీఎంఆర్ ధాన్యాన్ని మర ఆడించి తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యానికి ప్రభుత్వం ఎన్నో సార్లు గడువు పెంచినా.. వారిలో మాత్రం చలనం రావడం లేదు.
పెబ్బేరు, న్యూస్టుడే : మిల్లర్లకు కేటాయించిన సీఎంఆర్ ధాన్యాన్ని మర ఆడించి తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యానికి ప్రభుత్వం ఎన్నో సార్లు గడువు పెంచినా.. వారిలో మాత్రం చలనం రావడం లేదు. నాలుగేళ్లుగా ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ బియ్యం భారీగా పెండింగ్ ఉండటంతో నూటికి 125 శాతం జరిమానా విధిస్తూ ప్రభుత్వం మరో రెండు నెలల గడువు పెంచింది. ఇటీవల ఉత్తర్వులు జిల్లాల కలెక్టర్లకు వచ్చాయి. మిల్లర్లకు కేటాయించిన వరి ధాన్యంలో క్వింటాకు 67 కిలోల చొప్పున బియ్యం ప్రభుత్వానికి తిరిగివ్వాలి. వనపర్తి జిల్లా వ్యాప్తంగా 66,700 మెట్రిక్ టన్నులు (2,300 ఏసీకేలు) బియ్యం ఇవ్వాల్సి ఉంది. నూటికి 125 శాతం జరిమానా విధించడంతో అదనంగా సుమారు 17 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్ల యజమానులు ఇవ్వాల్సి ఉంది. లేకుంటే రెండు నెలల అనంతరం రెవెన్యూ రికవరీ చట్ట ప్రకారం ఆస్తులు జప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఇతర రాష్ట్రాలకు తరలించడంతోనే..
నాలుగేళ్లుగా ప్రభుత్వం మిల్లర్లకు కేటాయించిన సీఎంఆర్ ధాన్యం యజమానులు అక్రమార్జన కోసం ఇతర రాష్ట్రాలకు తరలించి రూ.కోట్లు సొమ్ము చేసుకున్నారు. తనిఖీలు, దాడులు చేసే అధికారులు నిర్లిప్తంగా ఉండటంతో ధాన్యం రాష్ట్రం దాటిపోయింది. సుమారు 40 శాతం ధాన్యం పక్క రాష్ట్రాలకు తరలిపోగా.. ఆలస్యంగా మేలుకొన్న అధికార యంత్రాగం, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కొన్ని నెలల క్రితం మిల్లులపై దాడులు చేశారు. వనపర్తి జిల్లాలోనే 5 లక్షల సీఎంఆర్ ధాన్యం బస్తాలు మాయమైనట్లు గుర్తించారు. అక్రమాలకు పాల్పడిన మిలర్లపై నామమాత్రంగా చర్యలు తీసుకుని వదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని సార్లు గడువు పెంచినా.. మిల్లర్ల వద్ద ధాన్యమే లేకపోతే ప్రభుత్వానికి ఎలా ఇస్తారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
రాజకీయ నాయకులతో చర్చలు?
వనపర్తి జిల్లాలో 139 రా మిల్లులు, 12 బాయిల్డ్ మిల్లులు ఉన్నాయి. వీటిలో 80 మిల్లులు ప్రభుత్వానికి సీఎంఆర్ బియ్యం ఇవ్వకపోవడంతో డిఫాల్ట్ కింద చేర్చారు. ఈ మిల్లుల నుంచి 2020 నుంచి ఇప్పటి వరకు 2,300 ఏసీకేల బియ్యం ఇవ్వాల్సి ఉంది. ఇంత పెద్ద మొత్తంలో బియ్యం పెండింగ్లో ఉంటే మిల్లర్ల యజమానులపై చర్యలు తీసుకోవడంలో పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు వెనుకంజ వేస్తున్నారు. ఈ 80 మిల్లులకు యాసంగిలో వరి ధాన్యం కూడా కేటాయించలేదు. కేవలం 14 బియ్యం మిల్లులకు మాత్రమే అవకాశమిచ్చారు. చర్యలు చేపట్టకుండా మిలర్ల యజమానులు రాజకీయ పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
రెండు నెలల్లో ఇవ్వకుంటే ఆస్తుల జప్తు
- బాలు నాయక్, పౌరసరఫరాల సంస్థ అదనపు డీఎం, వనపర్తి
బకాయిలో ఉన్న సీఎంఆర్ బియ్యం ఇచ్చేందుకు మిల్లర్లకు ప్రభుత్వం రెండు నెలల అవకాశం ఇచ్చింది. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యంలో నూటికి 125 శాతం జరిమానాతో వసూలు చేస్తాం. అలా ఇవ్వని పక్షంలో రెవెన్యూ రికవరీ చట్ట ప్రకారం మిల్లు యజమాని, మిల్లుకు జామీను ఉన్న వారి ఆస్తులను జప్తు చేస్తాం. ప్రభుత్వ నింబంధనల ప్రకారం మిల్లర్లు నడుచుకోవాలి. లేకుంటే చర్యలు తప్పవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మందకొడిగా ధాన్యం సేకరణ
[ 18-05-2024]
పాలమూరులోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ మందకొడిగా సాగుతోంది. యాసంగిలో మహబూబ్నగర్లో 1.11 లక్షలు, నాగర్కర్నూల్-1.09 లక్షలు, నారాయణపేట-1.15 లక్షలు, వనపర్తి-91 వేలు, జోగులాంబ గద్వాల-50వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. -
రుణమాఫీపై ఆశలు
[ 18-05-2024]
శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణ మాఫీ అమలుకు ప్రభుత్వం కటాఫ్ తేదీ ప్రకటించటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.రెండు లక్షలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. -
ఆర్టీసీకి పోటెత్తారు
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు సొంతూళ్లకు ఓటేసేందుకు పోటెత్తారు. ఈనెల 13న లోక్సభ ఎన్నికలు జరగడంతో పట్టణాలు, నగరాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు స్వగ్రామాలకు తరలొచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. -
వేసవిలో ముంచెత్తుతున్న వర్షాలు
[ 18-05-2024]
జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారు జామున భారీ వర్షం కురిసింది. గట్టు మండలకేంద్రంలో అత్యధికంగా 10.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
నిఘా నేత్రాలు అరకొర!
[ 18-05-2024]
రద్దీ ప్రాంతాల్లో జేబు దొంగలు తమ వాటం ప్రదర్శిస్తుంటారు. నిత్యం వేలాది మందితో కిటకిటలాడే మహబూబ్నగర్ బస్టాండు ఇందుకు వేదిక అవుతోంది. నెలలో రెండు నుంచి నాలుగు వరకు దొంగతనాలు జరుగుతున్నాయి. మహాలక్ష్మి టిక్కెట్లు అందుబాటులోకి వచ్చాక ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిన సంగతి విధితమే. -
వేధింపుల నివారణకు ప్రత్యేక కమిటీలు
[ 18-05-2024]
పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక కమిషనర్లు విధిగా వేధింపులను నియంత్రించేందుకు కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 19 పురపాలికల్లో కమిటీల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించారు. -
ఈ-శ్రమ్ సద్వినియోగం చేసుకోండి
[ 18-05-2024]
అసంఘటిత కార్మికులు ఈ-శ్రమ్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్.సునీత సూచించారు. శుక్రవారం వనపర్తి కోర్టు ఆవరణలో అసంఘటిత కార్మికులకు ఈ-శ్రమ్ పోర్టల్పై ఉచిత న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. -
పంటల ప్రణాళిక ఖరారు
[ 18-05-2024]
జిల్లాలో వానాకాలం పంటల ప్రణాళికను వ్యవసాయశాఖ ఖరారు చేసింది. అన్ని రకాల పంటలు కలిపి 2,45,953 ఎకరాల్లో సాగు చేస్తారని అధికారులు అంచనాలు తయారు చేశారు. కేవలం వర్షాధారంగానే కాకుండా చెరువులు, బావులు, బోర్ల ఆధారంగా వానాకాలం పంటలను రైతులు సాగు చేస్తారు. -
సాంకేతిక విద్య.. భవితకు భరోసా
[ 18-05-2024]
విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకొని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందాలంటే వారికి సాంకేతిక విద్య అవసరం. దీనికోసం ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరానికి ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. -
ఇంట్లో కుక్కుంది.. పెంపకంలో లెక్కుంది
[ 18-05-2024]
వికారాబాద్ జిల్లా తాండూరులో ఓ పెంపుడు కుక్క ఆ ఇంట్లో చిన్నారిని తీవ్రంగా గాయపరిచి, చంపేసింది. ప్రేమకు ప్రతిరూపాలుగా భావించే పెంపుడు జంతువులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన తెలియజేస్తోంది. ఇంట్లో పెంచే పప్పీలు, పెద్దజాతి కుక్కల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఏమిటో తెలుసుకుందాం. -
పిల్లలూ కథలు చదివేద్దామా.!
[ 18-05-2024]
వేసవి సెలవుల్లో విద్యార్థులు ఆన్లైన్ గేమ్స్, సామాజిక మాధ్యమాలకు పరిమితం కాకుండా వారిలో పఠనాశక్తి పెంచే దిశగా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఎన్సీఈఆర్టీ సహకారంతో రూమ్ టూ రీడ్ సంస్థ ‘లిటరసీ క్లౌడ్’ మాధ్యమం ద్వారా ఇంటి వద్దనే ప్రాథమిక స్థాయి విద్యార్థులు కథలు చదువుకునేలా ఏర్పాటు చేసింది. -
పోలింగ్ సిబ్బందికి చెల్లింపుల్లో వ్యత్యాసం
[ 18-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి పారితోషికం చెల్లింపుల్లో వ్యత్యాసం ఉండటంతో ఉపాధ్యాయులు, ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
సెలవులు పూర్తయ్యేసరికి బడులకు వసతులు:ఏసీ
[ 18-05-2024]
వేసవి సెలవులు పూర్తయ్యేలోపు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు పనులను పూర్తి చేయాలని, విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్ సూచించారు. చిన్నపొర్ల పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీల పనులను శుక్రవారం పరిశీలించి మాట్లాడారు. -
మరమ్మతులకు ఇదే తరుణం!
[ 18-05-2024]
ఒకప్పుడు కరవు కాటకాలకు, వలసలకు పాలమూరు జిల్లా చిరునామాగా ఉండేది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి అప్పట్లో మంజూరైనదే భీమా ప్రాజెక్టు. మొదటిదశ కింద మక్తల్ నియోజకవర్గంలో 1998లో రెండు జలాశయాలు నిర్మించతలపెట్టారు. -
ఆరోగ్య కేంద్రాల్లో మరిన్ని ప్రత్యేక సేవలు
[ 18-05-2024]
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఇప్పటికే అందిస్తున్న ఐదు రకాల వైద్యసేవలతోపాటు మరో ఏడు కొత్త సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు వైద్య,ఆరోగ్యశాఖ చర్యలు చేపడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
మోదీ నాతో చర్చకు వస్తే అడిగే ప్రశ్నలివే..: రాహుల్ గాంధీ
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు