‘పది’ పరీక్షలకు 98 % హాజరు
పదో తరగతి పరీక్షలు సోమవారం జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. రెండేళ్ల తర్వాత పరీక్షలు నిర్వహిస్తుండటంతో కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల....
మెదక్లోని ప్రభుత్వ బాలురోన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రంలోకి వెళ్తూ..
మెదక్, న్యూస్టుడే: పదో తరగతి పరీక్షలు సోమవారం జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. రెండేళ్ల తర్వాత పరీక్షలు నిర్వహిస్తుండటంతో కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు మొదటి భాష (పేపర్-1) పరీక్ష జరిగింది. తొలి రోజు 98.84 శాతం మంది హాజరయ్యారు. 11,393 మంది పరీక్షలు రాసేందుకు జిల్లా వ్యాప్తంగా 72 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 11,261 మంది పరీక్ష రాయగా, 132 మంది గైర్హాజరయ్యారు. విద్యార్థులు ఉదయం 8 గంటల వరకే కేంద్రాలకు చేరుకున్నారు. 8.30కు లోపలికి వెళ్లేందుకు అనుమతినిచ్చారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ధైర్యం చెప్పి పంపించారు. డీఈవో రమేశ్ మెదక్, పాపన్నపేటలోని కేంద్రాలను తనిఖీ చేశారు. శివ్వంపేటలోని పరీక్షా కేంద్రాన్ని రాష్ట్ర మోడల్ స్కూల్ సొసైటీ (టీఎస్ఎంఎస్) డైరెక్టర్ ఉషారాణి తనిఖీ చేశారు.
జిల్లా కేంద్రంలో పరీక్ష రాస్తున్న విద్యార్థులు
శస్త్రచికిత్స జరిగినా..
రామాయంపేట, కౌడిపల్లి, న్యూస్టుడే: రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామానికి చెందిన సంపత్ కుమార్కు ఏడు రోజుల క్రితం అపెండిక్స్ శస్త్రచికిత్స జరిగింది. అతడికి ఇంకా కుట్టు విప్పలేదు. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో కుటుంబ సభ్యుల సాయంతో హాజరయ్యారు. రామాయంపేట పట్టణ శివారులోని ఆదర్శ పాఠశాలలో చదివారు. మాసాయిపేట మండలం కోనాయిపల్లి గ్రామానికి కె.శశివర్ధన్కు సైతం అపెండిక్స్ శస్త్రచికిత్స పది రోజుల కిందట జరిగింది. ఈయన కౌడిపల్లిలోని బీసీ గురుకుల పాఠశాలలో పరీక్ష రాశారు. తండ్రి మహేశ్ సాయంతో కేంద్రానికి వచ్చాడు.
తొలి రోజు సజావుగా ‘పది’ పరీక్షలు
99.61 శాతం విద్యార్థుల హాజరు
న్యూస్టుడే, సిద్దిపేట
జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ జడ్పీ ఉన్నత పాఠశాల గేటుకు గడియారం..
సంగారెడ్డి జిల్లాలో.. తొలిరోజు సజావుగా పది పరీక్షలు
సంగారెడ్డిలో పరీక్ష కేంద్రంలో వరుసలో వెళుతున్న విద్యార్థులు
న్యూస్టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం సజావుగా ప్రారంభమయ్యాయి. రెండేళ్ల తరువాత పరీక్షలు జరుగుతుండడంతో విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉదయం 8 గంటలకే కేంద్రాలకు తీసుకువచ్చారు. భయపడవ్దదని, ధైర్యంగా రాయాలని సూచనలు చేశారు. తొలి రోజు తెలుగు పరీక్షకు మొత్తం 22,555 మందికి 22,346 మంది పరీక్ష రాశారు. సంగారెడ్డిలోని కరుణ ఉన్నత పాఠశాలలో రెండు కేంద్రాలను అదనపు పాలనాధికారి వీరారెడ్డి, కొండాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలను అదనపు పాలనాధికారి రాజర్షిషా, సంగారెడ్డి, కంది, సదాశివపేటలోని కేంద్రాలను జిల్లా విద్యాధికారి రాజేష్ పరిశీలించారు.
ఆఖరి నిమిషంలో పరీక్షా కేంద్రానికి చేర్చిన పోలీసు...
బాలికను పరీక్ష కేంద్రానికి తీసుకెళ్తున్న కానిస్టేబుల్
హత్నూర: బోర్పట్ల గ్రామానికి చెందిన గంగోత్రికి హత్నూరలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు. ఈ విషయంలో అవగాహన లేని గంగోత్రి హత్నూరలోని బాలురు ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా చేరుకుంది. అప్పటికే విద్యార్థులంతా కేంద్రం లోపలికి వెళ్లారు. అక్కడి నోటీస్ బోర్డుపై తన హాల్టికెట్ సంఖ్య కనిపించకపోవడంతో ఆమె కంగారు పడింది. చీఫ్ సూపరింటెండెంట్ రాజిరెడ్డి గుర్తించి పరీక్ష కేంద్రం గురుకుల పాఠశాల అని చెప్పడంతో అక్కడికి ఎలా వెళ్లాలో తెలియక బోరున విలపించింది. దీంతో అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ రవికుమార్ వెంటనే స్పందించి బాలికను తన ద్విచక్ర వాహనంపైన తీసుకెళ్లి ఆఖరి నిమిషంలో కేంద్రానికి చేర్చారు. కానిస్టేబుల్ సకాలంలో స్పందించి విద్యార్థినిని కేంద్రానికి చేర్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధికి భరోసా.. గెలుపునకు దిశానిర్దేశం
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. రానున్న లోకసభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా సురేష్షెట్కార్ను లక్ష మెజారిటీతో గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహించారు. -
‘రాజీనామాలతో కొత్త నాటకం’
[ 27-04-2024]
రాజీనామాల పేరుతో మాజీ మంత్రి హరీశ్రావు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఇద్దరూ రాజీనామాలు చేసేవారు కాదు, పనిచేసే వారు కాదని విమర్శించారు. -
సగం కట్టి.. వదిలిపెట్టి
[ 27-04-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పురపాలికలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు ఏడాదిగా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పురపాలికల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి గత ప్రభుత్వం పూనుకుంది. -
విధుల్లో నిర్లక్ష్యం తగదు
[ 27-04-2024]
విధుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం తగదని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ అన్నారు. శుక్రవారం ఆయన పెద్దశంకరంపేట పీహెచ్సీని సందర్శించారు. ఆస్పత్రి నిర్వహణ తీరు, ప్రసూతి వివరాలను పరిశీలించారు. -
విద్యార్థి అధ్యయనం.. విజ్ఞాన కౌశలం
[ 27-04-2024]
విద్యార్థిలో దాగిన విజ్ఞాన తృష్ణను వెలికితీసి.. నూతన ఆవిష్కరణలకు కళాశాల విద్యా శాఖ కృషి చేస్తోంది. వారి కృషి ఫలితంగా ఏటా నిర్వహిస్తున్న ‘జిజ్ఞాస’ పోటీల్లో పలువురు ప్రతిభ చాటుతున్నారు. -
పరిశీలిస్తారు.. నివేదిస్తారు..
[ 27-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ప్రాధాన్యం మనందరికీ తెలిసిందే. ఎవరికీ ఎక్కువ ఓట్లు పడితే వారే పాలకపక్షాలుగా గద్దెనెక్కవచ్చు. నిర్ణీత వ్యవధిలో నిర్వహించే ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగాలి. -
ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. స్వేచ్ఛాయుతంగా ఓటు వేసేందుకు సకల సౌకర్యాలు కల్పించిన ఎన్నికల సంఘం.. ఓటర్లకు పోల్ చీటీలు పంపిణీ చేస్తోంది. -
ఉల్లంఘనులకు ముకుతాడు
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అభ్యర్థుల నామపత్రాల స్వీకరణ గడువు ముగిసింది. ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. -
భారాస అక్రమాలు బయటపడుతున్నాయి
[ 27-04-2024]
బీసీ బిడ్డ నీలం మధుకు సీఎం రేవంత్రెడ్డి టిక్కెట్ ఇచ్చారని.. ఇక గెలిపించుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. సిద్దిపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, పార్టీ కార్యాలయంలో సమావేశం శుక్రవారం జరిగాయి. -
రాజీనామా పత్రం రాసి పెట్టుకో హరీశ్రావు: పొన్నం
[ 27-04-2024]
వచ్చే ఆగస్టు 15 నాటికి తమ పార్టీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతుందని, మాజీ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ముందుగానే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రం రాసి పెట్టుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
53 ఆమోదం.. ఒకటి తిరస్కరణ
[ 27-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లలో ఒక అభ్యర్థి నామపత్రాన్ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?