ముంచుతున్న మాయగాళ్లు!
పార్ట్టైం ఉద్యోగం కోసం వెతుకుతుండగా వాట్సాప్నకు మెసేజ్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేయగానే.. పెట్టుబడి పెట్టండి లాభం తీసుకోండి అంటూ సైబర్ నేరగాడి సందేశం ఉంది.
పటాన్చెరు అర్బన్: పార్ట్టైం ఉద్యోగం కోసం వెతుకుతుండగా వాట్సాప్నకు మెసేజ్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేయగానే.. పెట్టుబడి పెట్టండి లాభం తీసుకోండి అంటూ సైబర్ నేరగాడి సందేశం ఉంది. దీన్ని నమ్మి అతను చెప్పిన విధంగా పెట్టుబడి పెట్టిన ప్రైవేటు కంపెనీ హెచ్ఆర్ ఉద్యోగి నిలువునా మోసపోయాడు. జ్ఞానరాజు పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామ పరిధిలో ఉంటూ.. మాదాపూర్లోని ఓ కంపెనీలో హెచ్ఆర్గా పనిచేస్తున్నాడు. పార్ట్టైం జాబ్కు వెతుకుతుండగా.. ఈ నెల 26న వాట్సాప్కు సందేశం వచ్చింది. అది టెలిగ్రాంలో ఓపెన్ అయ్యింది. జ్ఞానరాజు తొలుత రూ.1000 పెట్టుబడి పెట్టాడు. దీనికి రూ.1,200 వచ్చిందన్నాడు. అనంతరం రూ.5 వేలు పెడితే రూ.6,500 వచ్చిందన్నాడు. ఆ తర్వాత ఒక పోర్టల్ను తెరిపించాడు. అందులో వచ్చిన డబ్బు కనిపిస్తుందని చెప్పాడు. దీంతో రూ.80,000 ఒకసారి, రెండోసారి రూ.2.5 లక్షలు, ఇలా దఫదఫాలుగా రూ.6.5 లక్షలు పెట్టుబడి పెట్టాడు. నలుగురు స్నేహితుల వద్ద అప్పు తీసుకుని మరో రూ.8.09 లక్షల వరకు మూడు రోజుల్లో పెట్టాడు. ‘పోర్టల్లో రూ.22.69 లక్షలు కనిపిస్తోంది.. కానీ విత్డ్రా చేసుకుందామంటే కావడం లేదని చెప్పడంతో అది క్రిప్టో కరెన్సీలో ఉందని భారత కరెన్సీలోకి మార్చేందుకు అదనంగా మరో రూ.3.5 లక్షలు చెల్లించాలన్నారు. మోసపోయానని గ్రహించిన జ్ఞానరాజు సైబర్ క్రైమ్ విభాగంతోపాటు పటాన్చెరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రుణం అంటూ.. : ఓ వ్యక్తి ఐదు సెకన్లలో రూ.5 లక్షల రుణం అని ఇస్తామన్న ప్రకటన చూసి మోసపోయాడు. ఈ ఘటన పటాన్చెరు ఠాణా పరిధిలో జరిగింది. ముత్తంగికి చెందిన పాండు ప్రైవేటు ఉద్యోగి. ఈనెల 25న పాండు తన ఫేస్బుక్ ఓపెన్ చేయగా అందులో 5 సెకన్లలో రూ.5 లక్షల రుణం అనే ప్రకటన చూశాడు. అందులో సూచించిన నంబర్కు ఫోన్ చేశాడు. రుణం కావాలంటే ముందు రూ.2.5 వేలు చెల్లించాలన్నారు. దస్త్రాల ఖర్చు కింద రూ.4.5 వేలు, బీమా కింద రూ.18.9 వేలు, బ్యాంకు సపోర్టు చేయడం లేదని రూ.32 వేలు ఒకసారి, మూడుసార్లు రూ.32.5 వేలు, 15.5 వేలు, రూ.22.25 వేలు చెల్లింపు చేయాలని చెప్పడంతో వారు సూచించిన విధంగా నగదు జమ చేశాడు. మీసేవా నుంచి వారు సూచించిన బ్యాంకు ఖాతాకు రూ.50.40వేలు ఒకసారి, రూ.45 వేలు, రూ.26.3 వేలు ఇలా దఫాదఫాలుగా మొత్తం రూ. 2.48 లక్షలు వేశాడు. అనంతరం అవతల వ్యక్తికి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. మోసపోయాయని గ్రహించి పటాన్చెరు ఠాణాలో ఫిర్యాదు ఇచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధికి భరోసా.. గెలుపునకు దిశానిర్దేశం
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. రానున్న లోకసభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా సురేష్షెట్కార్ను లక్ష మెజారిటీతో గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహించారు. -
‘రాజీనామాలతో కొత్త నాటకం’
[ 27-04-2024]
రాజీనామాల పేరుతో మాజీ మంత్రి హరీశ్రావు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఇద్దరూ రాజీనామాలు చేసేవారు కాదు, పనిచేసే వారు కాదని విమర్శించారు. -
సగం కట్టి.. వదిలిపెట్టి
[ 27-04-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పురపాలికలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు ఏడాదిగా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పురపాలికల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి గత ప్రభుత్వం పూనుకుంది. -
విధుల్లో నిర్లక్ష్యం తగదు
[ 27-04-2024]
విధుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం తగదని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ అన్నారు. శుక్రవారం ఆయన పెద్దశంకరంపేట పీహెచ్సీని సందర్శించారు. ఆస్పత్రి నిర్వహణ తీరు, ప్రసూతి వివరాలను పరిశీలించారు. -
విద్యార్థి అధ్యయనం.. విజ్ఞాన కౌశలం
[ 27-04-2024]
విద్యార్థిలో దాగిన విజ్ఞాన తృష్ణను వెలికితీసి.. నూతన ఆవిష్కరణలకు కళాశాల విద్యా శాఖ కృషి చేస్తోంది. వారి కృషి ఫలితంగా ఏటా నిర్వహిస్తున్న ‘జిజ్ఞాస’ పోటీల్లో పలువురు ప్రతిభ చాటుతున్నారు. -
పరిశీలిస్తారు.. నివేదిస్తారు..
[ 27-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ప్రాధాన్యం మనందరికీ తెలిసిందే. ఎవరికీ ఎక్కువ ఓట్లు పడితే వారే పాలకపక్షాలుగా గద్దెనెక్కవచ్చు. నిర్ణీత వ్యవధిలో నిర్వహించే ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగాలి. -
ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. స్వేచ్ఛాయుతంగా ఓటు వేసేందుకు సకల సౌకర్యాలు కల్పించిన ఎన్నికల సంఘం.. ఓటర్లకు పోల్ చీటీలు పంపిణీ చేస్తోంది. -
ఉల్లంఘనులకు ముకుతాడు
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అభ్యర్థుల నామపత్రాల స్వీకరణ గడువు ముగిసింది. ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. -
భారాస అక్రమాలు బయటపడుతున్నాయి
[ 27-04-2024]
బీసీ బిడ్డ నీలం మధుకు సీఎం రేవంత్రెడ్డి టిక్కెట్ ఇచ్చారని.. ఇక గెలిపించుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. సిద్దిపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, పార్టీ కార్యాలయంలో సమావేశం శుక్రవారం జరిగాయి. -
రాజీనామా పత్రం రాసి పెట్టుకో హరీశ్రావు: పొన్నం
[ 27-04-2024]
వచ్చే ఆగస్టు 15 నాటికి తమ పార్టీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతుందని, మాజీ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ముందుగానే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రం రాసి పెట్టుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
53 ఆమోదం.. ఒకటి తిరస్కరణ
[ 27-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లలో ఒక అభ్యర్థి నామపత్రాన్ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?