Komuravelle: కొమురవెల్లిలో 1 నుంచి ‘మల్లన్న’ మూలవిరాట్ దర్శనం నిలిపివేత
కొమురవెల్లి మల్లికార్జునస్వామి మూలవిరాట్ (నిజరూప) దర్శనం జనవరి 1 (సోమవారం)వ తేదీ సాయంత్రం నుంచి నిలిపివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆలూరు బాలాజీ వెల్లడించారు. శుక్రవారం ఈవో కార్యాలయంలో మాట్లాడుతూ.. వచ్చే నెల 7న స్వామి కల్యాణంతో పాటు జాతర ప్రారంభం కానుందన్నారు
చేర్యాల, న్యూస్టుడే: కొమురవెల్లి మల్లికార్జునస్వామి మూలవిరాట్ (నిజరూప) దర్శనం జనవరి 1 (సోమవారం)వ తేదీ సాయంత్రం నుంచి నిలిపివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆలూరు బాలాజీ వెల్లడించారు. శుక్రవారం ఈవో కార్యాలయంలో మాట్లాడుతూ.. వచ్చే నెల 7న స్వామి కల్యాణంతో పాటు జాతర ప్రారంభం కానుందన్నారు. ఈ సందర్భంగా వారం రోజుల పాటు ఆలయ సుందరీకరణ, గర్భగుడిలోని స్వామి, అమ్మవార్ల మూలవిరాట్ విగ్రహాలను అలంకరిస్తారని చెప్పారు. ఈ మేరకు దర్శనాన్ని బంద్ చేయనున్నట్లు తెలిపారు. ఈనెల 31 రాత్రి నుంచే దర్శనం నిలిపివేయాల్సి ఉండగా, మరుసటి రోజు సోమవారం నూతన సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున నిర్ణయాన్ని మార్చినట్లు వివరించారు. జనవరి 2 ఉదయం నుంచి అర్థమండపంలోనే ఉత్సవ విగ్రహాలకు పూజలు నిర్వహిస్తామని, విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బంగారు ఆభరణాలు చోరీ
[ 18-05-2024]
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో బంగారం చోరీకి గురైంది. బస్సు ఎక్కుతున్న మహిళ బ్యాగు లోంచి 8 తులాల బంగారు ఆభరణాలను దుండగులు చోరీ చేశారు. -
ఇక స్థానిక సమరం
[ 18-05-2024]
మరో ఎన్నికల సందడి రానుంది. పార్లమెంట్ ఎన్నికలు పూర్తికావడంతో పరిపాలనపై దృష్టి సారించనున్న రాష్ట్ర ప్రభుత్వం.. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు మొగ్గుచూపుతోంది. -
కొనుగోళ్లలో జాప్యంపై కర్షకుల కన్నెర్ర
[ 18-05-2024]
ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ మండల పరిధిలోని మిన్పూర్ గ్రామ రైతులు శుక్రవారం మెదక్-బోడ్మట్పల్లి రహదారిపై ఆందోళనకు దిగారు. -
సొంతింటి కల..నెరవేరేనా?
[ 18-05-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రంలో నిర్మించిన కొన్ని ఇళ్ల పనులు కొసరు పనులతో నిలిచిపోగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. -
భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించండి
[ 18-05-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గం భారాస అభ్యర్థి పి.వెంకట్రామిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని భాజపా మెదక్ అభ్యర్థి ఎం.రఘునందన్రావు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్కు ఫిర్యాదు చేశారు. -
ఉపాధి కూలీలకు ఊరట
[ 18-05-2024]
ఈ ఏడాది వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
ఒక్క రూపాయైనా జమ కాలేదు
[ 18-05-2024]
జిల్లావ్యాప్తంగా యాసంగిలో రైతులు ఉత్సాహంగా జొన్న పంట సాగు చేశారు. దిగుబడులు చేతికొస్తున్నాయి. -
శిథిల భవనాలు.. కానరాని చర్యలు
[ 18-05-2024]
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం జనం ప్రాణాలను బలిగొంటోంది. -
పల్లెల్లో మొదలైన సందడి
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారా..? అనే ప్రశ్నకు అవుననే సంకేతాలు వస్తున్నాయి. -
గుర్తించని జోన్లు.. ట్రాఫిక్ ఇక్కట్లు
[ 18-05-2024]
పట్టణాల్లో వ్యాపార జోన్లు అటకెక్కాయి. వ్యాపారాలు రహదారుల వెంట కాకుండా.. పురపాలక సంఘాలు ఏర్పాటు చేసిన జోన్లలో నిర్వహించుకునేలా ప్రణాళికలు రూపొంచడంలో యంత్రాంగం విఫలమయిందనే విమర్శలొస్తున్నాయి. -
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత
[ 18-05-2024]
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని రాష్ట్ర అదనపు ఎన్నికల కమిషనర్ లోకేష్కుమార్ అన్నారు. -
వాన రాకతో ధాన్యం ఆరక..
[ 18-05-2024]
వేసవికాలంలో జిల్లాలో వాతావరణంలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. -
నచ్చిన కోర్సు ఎంచుకోండి దోస్త్
[ 18-05-2024]
ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. డిగ్రీ కోర్సుల వైపు చూసే వారే ఎక్కువ మందే ఉంటారు. -
నిర్లక్ష్యం.. ప్రాణాంతకం
[ 18-05-2024]
ప్రజాప్రయోజనంతో చేపట్టే అభివృద్ధి పనుల పర్యవేక్షణ లోపించి ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
నాన్నను కొట్టి.. పశ్చాత్తాపం చెంది..
[ 18-05-2024]
ఆవేశంలో అకారణంగా నాన్నను కొట్టి.. అనంతరం తండ్రి తప్పేమీ లేదని తెలుసుకున్న కుమారుడు పశ్చాత్తాపంతో ఆవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తాజా వార్తలు (Latest News)
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు..!’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన