logo

కోహీర్‌లో యువకుడి దారుణ హత్య

కోహీర్‌లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో అర్ధరాత్రి దాటాక దాడి చేసి హత్య చేశారు.

Updated : 23 Apr 2024 12:22 IST

కోహీర్‌: కోహీర్‌లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో అర్ధరాత్రి దాటాక వేట కొడవళ్లు, మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశారు. మృతుడు ఏపీలోని కర్నూలు జిల్లా బనగానపల్లికి చెందిన అన్వర్ అలీ(28)గా పోలీసులు గుర్తించారు. అన్వర్ అలీ కొంతకాలంగా హైదరాబాద్‌లో నివాసం ఉంటూ ఆటో డ్రైవర్‌గా ఉపాధి పొందుతున్నాడు. పాత నేరస్థులైన తోటి ఆటో డ్రైవర్లు అతడిని కోహిర్‌కు తీసుకొచ్చి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఘటన స్థలాన్ని జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, సీఐ రవి సందర్శించి వివరాలు సేకరించారు. హత్యకు పాల్పడిన నిందితుల్లో ఒకరు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని