పెరుగుతున్న ప్రచార వేడి
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు తుది గడువు ఇంకా రెండు రోజులే ఉంది. ఇప్పటికే భాజపా అభ్యర్థి నామినేషన్ వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి తరఫున మెదక్ ఎమ్మెల్యే నామపత్రాలు దాఖలు చేశారు.
రంగంలోకి దిగుతున్న ప్రధాన పార్టీల అగ్రనేతలు
న్యూస్టుడే, మెదక్:లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు తుది గడువు ఇంకా రెండు రోజులే ఉంది. ఇప్పటికే భాజపా అభ్యర్థి నామినేషన్ వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి తరఫున మెదక్ ఎమ్మెల్యే నామపత్రాలు దాఖలు చేశారు. బుధవారం మంచి ముహూర్తం ఉండడంతో మిగతా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఓ వైపు అన్ని పార్టీల ముఖ్య నేతలు ప్రచారం చేస్తూ.. మరోవైపు నియోజకవర్గం, మండలాలు, పట్టణాల వారీగా సమావేశాలను నిర్వహిస్తూ.. శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. మెదక్ లోక్సభ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న ప్రధాన పార్టీల అగ్ర నేతలు స్వయంగా రంగంలోకి దిగి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పోలింగ్ సమీపిస్తుండడంతో సమయాన్ని బట్టి ఆయా పార్టీల ముఖ్యనేతలతో పార్లమెంట్ పరిధిలోని ప్రధాన ప్రాంతాల్లో సభలు, రోడ్డు షో, కార్నర్ మీటింగ్ల నిర్వహణకు సిద్ధమవుతున్నారు.
సంగారెడ్డి, సిద్దిపేటలో సీఎం రేవంత్రెడ్డి సభలు...
మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లా కావడంతో అధికార కాంగ్రెస్.. మెదక్ లోక్సభ స్థానంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎలాగైనా ఈసారి ఎంపీ స్థానాన్ని గెలవాలనే కృతనిశ్చయంతో ఉంది. ప్రముఖుల పర్యటనలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా మెదక్లో ఈనెల 20న ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక రాందాస్ చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్లో ప్రసంగించారు. మెదక్లో ప్రచార కార్యక్రమం విజయవంతం కావడంతో.. సిద్దిపేట, సంగారెడ్డి పట్టణాల్లో సైతం సీఎం సభలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్గాంధీ లేదా ప్రియాంక గాంధీ పార్లమెంట్ పరిధిలో ఏర్పాటు చేసే సభలకు హాజరయ్యే అవకాశం ఉందని సిద్దిపేట, మెదక్ డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి, ఆంజనేయులుగౌడ్ తెలిపారు. ఎన్నికల బరిలో బీసీ అభ్యర్థి ఉండడంతో.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఎన్నికల ప్రచార సభలో పాల్గొనే అవకాశం ఉంది.
రేపు సిద్దిపేటకు అమిత్షా...
కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు కార్యాచరణతో ముందుకెళ్తున్న భాజపా... దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా రాష్ట్రంలో అత్యధిక సీట్లు సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా ఎన్నికల షెడ్యూల్కు ముందు పటాన్చెరులో ప్రధాని మోదీ సభ నిర్వహించారు. పార్టీ అభ్యర్థి రఘునందన్రావు నామినేషన్ వేసిన రోజున గోవా సీఎం ప్రమోద్ సావంత్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి మెదక్లో జరిగిన రోడ్డుషోలో పాల్గొన్నారు. ఈనెల 25 గురువారం సిద్దిపేటకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా రానున్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే సభలో ఆయన పాల్గొంటారు. ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నామలైతో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం నిర్వహించాలని ఈ పార్టీ భావిస్తోంది.
కేసీఆర్ రోడ్డుషోలు..
2004 నుంచి వరుసగా విజయకేతనం ఎగురవేస్తున్న భారాస.. ఈసారీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని భావిస్తోంది. ఈ లోక్సభ స్థానానికి మాజీ మంత్రి హరీశ్రావు ఇన్ఛార్జీగా వ్యవహరిస్తున్నారు. అన్ని సమావేశాలు, రోడ్షోలలో పాల్గొంటున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ.. శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు. భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 24 నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. సొంత జిల్లాలో పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తరఫున ప్రధాన పట్టణాల్లో ఆయన బస్సు యాత్ర కొనసాగనుంది. వచ్చే నెల 7న రాత్రి మెదక్లో రోడ్షోలో పాల్గొంటారు. ఆ రోజు మెదక్లో బస చేసి, మరుసటి రోజు 8న నర్సాపూర్, పటాన్చెరులో సాయంత్రం జరిగే రోడ్షోకు హాజరవుతారు. ఎన్నికల ప్రచారం చివరి రోజైన మే 11న సిద్దిపేటలో సాయంత్రం జరిగే రోడ్షోలో కేసీఆర్ పాల్గొంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తొలి ఓటు వేశారోచ్
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తొలి సారిగా చేపట్టిన ఇంటి నుంచి ఓటు ప్రక్రియ సాఫీగా కొనసాగింది. -
ఈ రోజు ఇలా.. రేపు అలా..
[ 03-05-2024]
పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఓటూ ప్రాధాన్యమే. బూత్ స్థాయి నుంచి అన్ని పార్టీలు శ్రేణులను సిద్ధం చేస్తున్నాయి. -
ఆరు నూరైనా మెతుకు సీమలో గెలవాలి
[ 03-05-2024]
సిద్దిపేటలో నిర్వహించిన కాంగ్రెస్ రోడ్షో శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. -
ఒకేలా కన్పిస్తూ.. గెలుపోటములు శాసిస్తూ..
[ 03-05-2024]
ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులెవరనేది తేలిపోయింది. పోలింగ్కు తక్కువ రోజులే ఉండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. -
కాంగ్రెస్కు ఓటేస్తే.. సీఎం అబద్ధాల్ని ఆమోదించినట్లే
[ 03-05-2024]
‘అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. గద్దెనెక్కాక ప్రజల్ని మోసం చేసింది. -
లోక్సభ పోరు.. మరింత హోరు
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
భాజపాతోనే దేశాభివృద్ధి
[ 03-05-2024]
భాజపాతోనే దేశాభివృద్ధి సాధ్యమని మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. -
ఓటరు చైతన్యంపై ఆడియో ఆవిష్కరణ
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్శాతం పెంచేందుకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ మనుచౌదరి పిలుపునిచ్చారు. -
కల నెరవేరిస్తేనే.. విద్యాప్రగతి
[ 03-05-2024]
విద్యతోనే ప్రగతి సాధ్యం.. పేదరిక నిర్మూలనకు ఎంతో దోహదపడుతుంది.. డిగ్రీ వరకు విద్యాభ్యాసానికి ప్రభుత్వపరంగా వసతులు ఉన్నా ఆపై చదువులకు ఇబ్బందులు తప్పడం లేదు.. ఎన్నికల సమయంలో విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పే నేతలు ఆ తర్వాత వదిలేస్తున్నారు. -
రెండు కళ్లూ చాలవులే..
[ 03-05-2024]
కల్యాణ వేదికపై ఆసీనులైన శ్రీరామచంద్రమూర్తిని సీతమ్మవారు ఓరకంట చూసి చిరుమందహాసం చేస్తోంది.. పక్కనే మరో వేదికపై వరుడి అలంకరణలో ఉన్న పరమేశ్వరుడిని చూసిన పార్వతిదేవి సిగ్గులొలికిస్తోంది. -
విద్వేషాలు రెచ్చగొడుతున్న భాజపా
[ 03-05-2024]
ప్రజా సంక్షేమాన్ని విస్మరించి విద్వేషాలను రెచ్చగొడుతూ అప్రజాస్వామిక రాజకీయాలు సాగిస్తున్న భాజపాను ఓడించాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. -
లక్ష్యం.. సాకారం చేసుకొని..
[ 03-05-2024]
సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఎంతోమంది ఈ కలల ప్రపంచంలోకి అడుగుపెట్టాలని కలలు కంటుంటారు. -
కాంగ్రెస్ సర్కారుతోనే సంక్షేమం: మంత్రి పొన్నం
[ 03-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ప్రజల సంక్షేమం, అభివృద్ధి జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
-
50 గంటల బ్యాటరీ లైఫ్తో నాయిస్ పాప్ బడ్స్.. ధర, ఫీచర్లివే..!
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..