వసతులు కొరవడి.. అన్నదాత అలజడి
జిల్లాలో యాసంగి వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఉత్పత్తులు చేతికి అందడంతో ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకు వస్తున్నారు.
మెదక్లోని కేంద్రంలో అద్దె టార్పాలిన్లలో వడ్లు ఆరబోస్తూ..
న్యూస్టుడే, మెదక్ టౌన్: జిల్లాలో యాసంగి వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఉత్పత్తులు చేతికి అందడంతో ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకు వస్తున్నారు. అయితే అకాల వర్షాలతో వారు ఆందోళనకు గురవుతున్నారు. ఇందుకు కారణం కేంద్రాల వద్ద సరైన సౌకర్యాలు లేకపోవడమే. వర్షం కురిస్తే ధాన్యం తడవకుండా ఉండేందుకు నిర్వాహకులు టార్పాలిన్లు సమకూర్చడం లేదు. దీంతో వాటిని అద్దెకు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.జిల్లా వ్యాప్తంగా 410 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఇప్పటి వరకు 28 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. కేంద్రాలకు రైతులు తీసుకువచ్చే ధాన్యాన్ని బట్టి టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలి. కొన్ని అందజేశామని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది.
సౌకర్యాల కల్పనలో విఫలం
పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఐకేపీ, పీఏసీఎస్ల ద్వారా ధాన్యాన్ని సేకరిస్తున్నారు. తూకం యంత్రాలు, గన్నీబస్తాలు, తదితర వాటిని సమకూర్చాల్సిన బాధ్యత మార్కెటింగ్ శాఖ అధికారులదే. ఇందుకోసం వరి కోతల ప్రారంభానికి ముందే అంచనాతో కార్యాచరణ రూపొందిస్తారు. సీజన్కు ముందుగానే మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా, అరకొరగా ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఎండలు మండుతున్నా, కనీసం తాగునీటి వసతి కల్పించడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఆయా కేంద్రాలకు ప్రస్తుత సీజన్లో 565 టార్పాలిన్లు పంపిణీ చేశారు. వీటిని కొన్నికేంద్రాల్లో ఇస్తుండగా, మరికొన్ని చోట్ల ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు.
ఇబ్బందులు ఎదురవ్వకుండా చూస్తాం
- నాగరాజు, ఇన్ఛార్జి జిల్లా మార్కెటింగ్ అధికారి, మెదక్
ఈ సీజన్లో 565 టార్పాలిన్లు కేంద్రం నిర్వాహకులకు పంపిణీ చేశాం. వాటిని రైతులకు తప్పనిసరిగా ఇవ్వాలి. ఒక వేళ ఇవ్వకపోతే మా దృష్టికి తీసుకువస్తే సమస్యను పరిష్కరిస్తాం. ఇబ్బందులు ఎదురవ్వకుండా తగిన చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అకాల వర్షం.. అపారనష్టం
[ 17-05-2024]
జిల్లాలో పాపన్నపేట, టేక్మాల్, హవేలిఘనపూర్ మండలాల్లో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో వర్షం కురిసింది. పాపన్నపేట కొనుగోలు కేంద్రంలోని వడ్ల కుప్పల వద్ద వర్షపు నీరు చేరింది. -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే : ఎమ్మెల్యే సునీతారెడ్డి
[ 17-05-2024]
వరి పండించిన రైతులకు మద్దతు ధరలతో పాటు, రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి మాట తప్పిందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. -
బడులకు భద్రతేదీ!
[ 17-05-2024]
పెద్దశంకరంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరునెలల క్రితం వంటశాలలో పాత్రలను అపహరించుకుపోయారు. అనంతరం తరగతి గదుల కిటికీలు, తలుపులు పగులగొట్టారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఉక్కుపాదం
[ 17-05-2024]
దిగుబడుల ఆశచూపి అన్నదాతలకు నకిలీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకునే దళారులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం యంత్రాంగం నడుం బిగించింది. -
మూగబోనున్న తెర
[ 17-05-2024]
ప్రజలకు వినోదాన్ని పంచే సినిమా థియేటర్లు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కరోనా కంటే ముందు ప్రేక్షకుల ఆదరణతో నడిచిన సినిమా హాళ్లు ప్రస్తుతం ఆదరణకు నోచుకోవడం లేదు. -
ప్రాథమిక విద్యకు సాంకేతిక ఊతం
[ 17-05-2024]
ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ పకడ్బందీ చర్యలు చేపడుతోంది. తొలిమెట్టు పేరుతో రెండేళ్ల నుంచి ప్రత్యేక బోధన చేయిస్తోంది. -
మహిళాభ్యున్నతికి బాటలు
[ 17-05-2024]
మహిళలు రాణిస్తే ప్రగతి సాధ్యం. ఇదే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలు ఇప్పించడం ఇందులో భాగమే. -
A .. యాపిల్ Z .. జహీరాబాద్
[ 17-05-2024]
శీతల ప్రాంతాల్లో ఎక్కువగా పండే పంట యాపిల్. కశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి చల్లటి వాతావరణంలో మాత్రమే ఆ చెట్లు పెరిగి కాస్తాయి. అలాంటి పంటను తెలుగు రాష్ట్రాల్లో చలి ఎక్కువగా ఉండే ఏపీలోని లంబసింగి, -
వినూత్న తీర్పు
[ 17-05-2024]
మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన నిందితులు నలుగురికి తాండూరు స్పెషల్ క్లాస్ జ్యుడీషియల్ న్యాయమూర్తి నామాల అశోక్ వినూత్న తీర్పు ఇచ్చారు. -
ఇంటిపైన వనం.. ఖాళీ స్థలం సద్వినియోగం
[ 17-05-2024]
కూరగాయల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పైగా రసాయనాలు, పురుగుల మందుల వాడకంతో అవి కలుషితమవుతున్నాయి. వాటిని కొనుగోలు చేసి తిన్నవారి ఖర్చులు పెరగడంతో పాటు అనారోగ్యానికి గురవుతున్నారు. -
అర్హులకు దక్కని ఓటు
[ 17-05-2024]
ఓటరు జాబితాలో తప్పులు సర్వ సాధారణమైంది. వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓటరు జాబితాలో తప్పులున్నాయి. -
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలి
[ 17-05-2024]
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలైన ఘటన మండలంలోని అప్పాజీపల్లిలో గురువారం జరిగింది. ఎస్సై మహ్మద్ గౌస్ తెలిపిన వివరాలు.. -
హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ కౌన్సిలర్గా సంగారెడ్డి వాసి విజయం
[ 17-05-2024]
బ్రిటన్లోని హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ వార్డు కౌన్సిలర్గా సంగారెడ్డికి చెందిన బొంకూర్ కార్తిక్ కుమార్ అధికార లేబర్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 1,763 ఓట్లు పోలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ