దేవుళ్లతో రాజకీయం చేయడం సరికాదు
దేవుళ్లతో భాజపా రాజకీయం చేయడం సరికాదని మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం రాత్రి మెదక్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు.
మంత్రి కొండా సురేఖ
మెదక్లో మాట్లాడుతున్న మంత్రి కొండా సురేఖ, చిత్రంలో నీలం మధు
మెదక్ రూరల్, న్యూస్టుడే: దేవుళ్లతో భాజపా రాజకీయం చేయడం సరికాదని మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం రాత్రి మెదక్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. తన చిన్నప్పటి నుంచి శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని.. కొత్తగా భాజపా చేసిందేమీ లేదని అన్నారు. రఘునందన్రావు దుబ్బాకలో గెలిచి ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, ఎంపీ అభ్యర్థి నీలం మధు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్రావు మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మెదక్ పురపాలక సంఘం అధ్యక్షుడు చంద్రపాల్, నాయకులు మోల్సాబ్, అశోక్ , శ్రీనివాస్ చౌదరి, జీవన్రావు, తదితరులు పాల్గొన్నారు.
నర్సాపూర్, న్యూస్టుడే: ప్రతి కార్యకర్త మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నీలంమధు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ సూచించారు. నర్సాపూర్ వచ్చిన ఆమె పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో శనివారం మాట్లాడారు. పార్టీ విజయానికి కలిసికట్టుగా పనిచేయాలన్నారు. నర్సాపూర్ నుంచి నీలంమధుకు అత్యధిక మెజార్టీ ఇవ్వడానికి కృషి చేయాలన్నారు. నర్సాపూర్లో ఈనెల 7న ప్రియాంక గాంధీ సభ ఏర్పాట్లను పరిశీలించాల్సి ఉండగా ఎండవేడిమి కారణంగా నీరసించి పోయిన ఆమె అక్కడికి వెళ్లకుండా పార్టీ కార్యాలయంలోనే విశ్రాంతి తీసుకున్నారు.
హరీశ్రావు జైలుకు వెళ్లడం ఖాయం: మైనంపల్లి
పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాజీ మంత్రి హరీశ్రావు జైలుకు వెళ్లడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆరోపించారు. నర్సాపూర్లో వెల్దుర్తి వెళ్లే మార్గంలో ఈనెల 7వ తేదీన నిర్వహించనున్న కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ బహిరంగ సభ ఏర్పాట్లను మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలంమధు, మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి, డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ ఇన్ఛార్జి రాజిరెడ్డిలతో కలిసి శనివారం స్థల పరిశీలన చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుకుని, రంగనాయకసాగర్ ప్రాజెక్టు నిర్మాణం, ఫోన్ ట్యాపింగ్, మిషన్ భగీరథ, అసైన్డు, ప్రభుత్వ, వక్ఫ్ భూముల కబ్జాల్లో హరీశ్రావు జైలుకు వెళ్లనున్నారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి కాంగ్రెస్కు మెజార్టీ వస్తుందని, వారు ఎన్ని డబ్బులు పంచినా ప్రజలు ఈసారి కాంగ్రెస్కు ఓటు వేయాలని నిర్ణయించారని అన్నారు. ఆగస్టు 15న రాజీనామాకు హరీశ్రావు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. పెద్దాయన అని కూడా చూడకుండా మదన్రెడ్డిపై హరీశ్రావు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రియాంక గాంధీ బహిరంగసభకు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జనాలను తరలిస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక స్థానిక సమరం
[ 18-05-2024]
మరో ఎన్నికల సందడి రానుంది. పార్లమెంట్ ఎన్నికలు పూర్తికావడంతో పరిపాలనపై దృష్టి సారించనున్న రాష్ట్ర ప్రభుత్వం.. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు మొగ్గుచూపుతోంది. -
కొనుగోళ్లలో జాప్యంపై కర్షకుల కన్నెర్ర
[ 18-05-2024]
ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ మండల పరిధిలోని మిన్పూర్ గ్రామ రైతులు శుక్రవారం మెదక్-బోడ్మట్పల్లి రహదారిపై ఆందోళనకు దిగారు. -
సొంతింటి కల..నెరవేరేనా?
[ 18-05-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రంలో నిర్మించిన కొన్ని ఇళ్ల పనులు కొసరు పనులతో నిలిచిపోగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. -
భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించండి
[ 18-05-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గం భారాస అభ్యర్థి పి.వెంకట్రామిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని భాజపా మెదక్ అభ్యర్థి ఎం.రఘునందన్రావు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్కు ఫిర్యాదు చేశారు. -
ఉపాధి కూలీలకు ఊరట
[ 18-05-2024]
ఈ ఏడాది వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
ఒక్క రూపాయైనా జమ కాలేదు
[ 18-05-2024]
జిల్లావ్యాప్తంగా యాసంగిలో రైతులు ఉత్సాహంగా జొన్న పంట సాగు చేశారు. దిగుబడులు చేతికొస్తున్నాయి. -
శిథిల భవనాలు.. కానరాని చర్యలు
[ 18-05-2024]
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం జనం ప్రాణాలను బలిగొంటోంది. -
పల్లెల్లో మొదలైన సందడి
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారా..? అనే ప్రశ్నకు అవుననే సంకేతాలు వస్తున్నాయి. -
గుర్తించని జోన్లు.. ట్రాఫిక్ ఇక్కట్లు
[ 18-05-2024]
పట్టణాల్లో వ్యాపార జోన్లు అటకెక్కాయి. వ్యాపారాలు రహదారుల వెంట కాకుండా.. పురపాలక సంఘాలు ఏర్పాటు చేసిన జోన్లలో నిర్వహించుకునేలా ప్రణాళికలు రూపొంచడంలో యంత్రాంగం విఫలమయిందనే విమర్శలొస్తున్నాయి. -
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత
[ 18-05-2024]
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని రాష్ట్ర అదనపు ఎన్నికల కమిషనర్ లోకేష్కుమార్ అన్నారు. -
వాన రాకతో ధాన్యం ఆరక..
[ 18-05-2024]
వేసవికాలంలో జిల్లాలో వాతావరణంలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. -
నచ్చిన కోర్సు ఎంచుకోండి దోస్త్
[ 18-05-2024]
ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. డిగ్రీ కోర్సుల వైపు చూసే వారే ఎక్కువ మందే ఉంటారు. -
నిర్లక్ష్యం.. ప్రాణాంతకం
[ 18-05-2024]
ప్రజాప్రయోజనంతో చేపట్టే అభివృద్ధి పనుల పర్యవేక్షణ లోపించి ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
నాన్నను కొట్టి.. పశ్చాత్తాపం చెంది..
[ 18-05-2024]
ఆవేశంలో అకారణంగా నాన్నను కొట్టి.. అనంతరం తండ్రి తప్పేమీ లేదని తెలుసుకున్న కుమారుడు పశ్చాత్తాపంతో ఆవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.