హ్యాట్రిక్ విజయం ఖాయం: హరీశ్రావు
అబద్ధపు పునాదుల మీద స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్, భాజపాలకు తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
ప్రసంగిస్తున్న హరీశ్రావు, చిత్రంలో అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి
మిరుదొడ్డి, న్యూస్టుడే: అబద్ధపు పునాదుల మీద స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్, భాజపాలకు తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి అక్బర్పేట-భూంపల్లి మండల కేంద్రంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి భారాస మెదక్ పార్లమెంటు అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ఉద్యమాల పురిటిగడ్డ మెదక్ స్థానంపై మూడోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. వంద రోజుల్లో అమలు చేస్తానన్న ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. నాణ్యమైన విద్యుత్తు సరఫరా లేక మోటార్లు కాలిపోతున్నాయన్నారు. కుల రాజకీయాలకు పాల్పడుతున్న పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్ బస్సు యాత్ర సూపర్ హిట్ కావడంతో కాంగ్రెస్, భాజపాలు తమ ఉనికిని కాపాడుకోవడానికి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ఆగస్టు 15న రూ.రెండు లక్షల రుణమాఫీ చేయకుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మతం పేరుతో భాజపా, రిజర్వేషన్ల ప్రచారంతో కాంగ్రెస్ ఓట్లు దండుకోవాలని చూస్తున్నాయన్నారు.
జాబ్మేళాతో ఉద్యోగాలు: అభ్యర్థుల గుణగణాలు చూసి ఓటేయాలని ఎంపీ అభ్యర్థి పి.వెంకట్రామిరెడ్డి మిరుదొడ్డిలో జరిగిన ప్రచారంలో మాట్లాడుతూ అన్నారు. కలెక్టర్ గా పనిచేసిన సమయంలో ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు ఫీజు సాయం చేశామన్నారు. నిరుపేద యువతి యువకులకు ఉచితంగా కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, శిక్షణ అందించి, జాబ్ మేళాలతో ఉద్యోగాలకు అవకాశం కల్పిస్తామన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో హామీలు ఇచ్చి మోసం చేసిన రఘునందన్ను మరోసారి చిత్తుగా ఓడించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల చేసుకోవడానికి ధర్నాలు చేయాల్సి వచ్చిందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక స్థానిక సమరం
[ 18-05-2024]
మరో ఎన్నికల సందడి రానుంది. పార్లమెంట్ ఎన్నికలు పూర్తికావడంతో పరిపాలనపై దృష్టి సారించనున్న రాష్ట్ర ప్రభుత్వం.. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు మొగ్గుచూపుతోంది. -
కొనుగోళ్లలో జాప్యంపై కర్షకుల కన్నెర్ర
[ 18-05-2024]
ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ మండల పరిధిలోని మిన్పూర్ గ్రామ రైతులు శుక్రవారం మెదక్-బోడ్మట్పల్లి రహదారిపై ఆందోళనకు దిగారు. -
సొంతింటి కల..నెరవేరేనా?
[ 18-05-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రంలో నిర్మించిన కొన్ని ఇళ్ల పనులు కొసరు పనులతో నిలిచిపోగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. -
భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించండి
[ 18-05-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గం భారాస అభ్యర్థి పి.వెంకట్రామిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని భాజపా మెదక్ అభ్యర్థి ఎం.రఘునందన్రావు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్కు ఫిర్యాదు చేశారు. -
ఉపాధి కూలీలకు ఊరట
[ 18-05-2024]
ఈ ఏడాది వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
ఒక్క రూపాయైనా జమ కాలేదు
[ 18-05-2024]
జిల్లావ్యాప్తంగా యాసంగిలో రైతులు ఉత్సాహంగా జొన్న పంట సాగు చేశారు. దిగుబడులు చేతికొస్తున్నాయి. -
శిథిల భవనాలు.. కానరాని చర్యలు
[ 18-05-2024]
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం జనం ప్రాణాలను బలిగొంటోంది. -
పల్లెల్లో మొదలైన సందడి
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారా..? అనే ప్రశ్నకు అవుననే సంకేతాలు వస్తున్నాయి. -
గుర్తించని జోన్లు.. ట్రాఫిక్ ఇక్కట్లు
[ 18-05-2024]
పట్టణాల్లో వ్యాపార జోన్లు అటకెక్కాయి. వ్యాపారాలు రహదారుల వెంట కాకుండా.. పురపాలక సంఘాలు ఏర్పాటు చేసిన జోన్లలో నిర్వహించుకునేలా ప్రణాళికలు రూపొంచడంలో యంత్రాంగం విఫలమయిందనే విమర్శలొస్తున్నాయి. -
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత
[ 18-05-2024]
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని రాష్ట్ర అదనపు ఎన్నికల కమిషనర్ లోకేష్కుమార్ అన్నారు. -
వాన రాకతో ధాన్యం ఆరక..
[ 18-05-2024]
వేసవికాలంలో జిల్లాలో వాతావరణంలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. -
నచ్చిన కోర్సు ఎంచుకోండి దోస్త్
[ 18-05-2024]
ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. డిగ్రీ కోర్సుల వైపు చూసే వారే ఎక్కువ మందే ఉంటారు. -
నిర్లక్ష్యం.. ప్రాణాంతకం
[ 18-05-2024]
ప్రజాప్రయోజనంతో చేపట్టే అభివృద్ధి పనుల పర్యవేక్షణ లోపించి ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
నాన్నను కొట్టి.. పశ్చాత్తాపం చెంది..
[ 18-05-2024]
ఆవేశంలో అకారణంగా నాన్నను కొట్టి.. అనంతరం తండ్రి తప్పేమీ లేదని తెలుసుకున్న కుమారుడు పశ్చాత్తాపంతో ఆవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.