కాస్త దృష్టిసారిస్తే ఆరోగ్యమే
ఓ వైపు ఎండ తీవ్రత పెరిగింది. ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ సమయంలోనే లోక్సభ ఎన్నికలు జరుగుతున్న విషయం విదితమే. ప్రచారం శనివారంతో ముగియనుంది.
ఓ వైపు ఎండ తీవ్రత పెరిగింది. ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ సమయంలోనే లోక్సభ ఎన్నికలు జరుగుతున్న విషయం విదితమే. ప్రచారం శనివారంతో ముగియనుంది. ఈ తరుణంలో అభ్యర్థులు తమ విజయానికి ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమయంలో కాస్త ఆరోగ్యంపై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతో ఉంది. నిపుణుల సూచనలు ఇలా..
అలసట దరిచేరకుండా..
సమయానికి భోజనం చేయకపోతే అలసట దరిచేరుతుంది. ప్రచార సమయంలో ఊర్లను చుట్టేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తుంటారు. ఈ సమయంలో సమతుల ఆహారం తీసుకోవడం తప్పనిసరి. తేనీరు ఎక్కువగా తాగితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొబ్బరి నీటిని అధికంగా తీసుకుంటే మేలు. ఇక మధుమేహం ఉంటే సకాలంలో మాత్రలు తీసుకోవడం మరువద్దు. వేళకు భోజనం చేయాలి. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. హెచ్చు, తగ్గులు ఉంటే మెదడుపై ప్రభావం చూపుతుంది. ః రాత్రి 10 గంటల వరకు ప్రచారం చేసుకోవచ్చు. ఎండ తీవ్రతతో తెల్లవారుజామున, సాయంత్రం, రాత్రి సమయాల్లోనే ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు, కీలక నేతలకు నిద్ర లోపించే అవకాశం ఉంది. ఇది పలు రుగ్మతలకు దారి తీస్తుంది. వైద్యులు సూచించిన ప్రకారం కనీసం ఏడు గంటల నిద్ర అవసరం.
ఆందోళనకు గురవకుండా..
- ప్రచారంలో నాయకులు ఆందోళనకు గురవడం సహజమే. ఈ సమయంలో అధిక, అల్ప రక్తపోటు(బీపీ)కు దారి తీస్తుంది. అందుకే నిత్యం రక్తపోటును పరీక్షించుకోవాలి. వైద్యుల సూచనలతో మాత్రలు తీసుకుంటే మంచిది.
- రోజూ ఉదయం కనీసం 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఉదయం నడక ఎంతో మేలు. పలువురు నేతలు దీన్ని చక్కగా వినియోగించుకుంటున్నారు. ఉదయం నడకతో పాటు ప్రచారమూ సాగిస్తున్నారు.
- ప్రచారంలో నెత్తికి టోపీలు ధరించాలి. అవసరమైతే గొడుగులు వాడాలి.
- ఒత్తిడిగా అనిపిస్తే ప్రశాంత వాతావరణంలో యోగా, ధ్యానం చేస్తే మంచిది.
- ఉదయం 10 గంటలలోపు ప్రచారం ముగించాలి. సాయంత్రం 5 తర్వాత మళ్లీ మొదలుపెడితే బాగు. అన్నింటి కంటే ప్రధానంగా పక్కా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగాలి.
న్యూస్టుడే, గజ్వేల్ గ్రామీణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక స్థానిక సమరం
[ 18-05-2024]
మరో ఎన్నికల సందడి రానుంది. పార్లమెంట్ ఎన్నికలు పూర్తికావడంతో పరిపాలనపై దృష్టి సారించనున్న రాష్ట్ర ప్రభుత్వం.. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు మొగ్గుచూపుతోంది. -
కొనుగోళ్లలో జాప్యంపై కర్షకుల కన్నెర్ర
[ 18-05-2024]
ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ మండల పరిధిలోని మిన్పూర్ గ్రామ రైతులు శుక్రవారం మెదక్-బోడ్మట్పల్లి రహదారిపై ఆందోళనకు దిగారు. -
సొంతింటి కల..నెరవేరేనా?
[ 18-05-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రంలో నిర్మించిన కొన్ని ఇళ్ల పనులు కొసరు పనులతో నిలిచిపోగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. -
భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించండి
[ 18-05-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గం భారాస అభ్యర్థి పి.వెంకట్రామిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని భాజపా మెదక్ అభ్యర్థి ఎం.రఘునందన్రావు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్కు ఫిర్యాదు చేశారు. -
ఉపాధి కూలీలకు ఊరట
[ 18-05-2024]
ఈ ఏడాది వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
ఒక్క రూపాయైనా జమ కాలేదు
[ 18-05-2024]
జిల్లావ్యాప్తంగా యాసంగిలో రైతులు ఉత్సాహంగా జొన్న పంట సాగు చేశారు. దిగుబడులు చేతికొస్తున్నాయి. -
శిథిల భవనాలు.. కానరాని చర్యలు
[ 18-05-2024]
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం జనం ప్రాణాలను బలిగొంటోంది. -
పల్లెల్లో మొదలైన సందడి
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారా..? అనే ప్రశ్నకు అవుననే సంకేతాలు వస్తున్నాయి. -
గుర్తించని జోన్లు.. ట్రాఫిక్ ఇక్కట్లు
[ 18-05-2024]
పట్టణాల్లో వ్యాపార జోన్లు అటకెక్కాయి. వ్యాపారాలు రహదారుల వెంట కాకుండా.. పురపాలక సంఘాలు ఏర్పాటు చేసిన జోన్లలో నిర్వహించుకునేలా ప్రణాళికలు రూపొంచడంలో యంత్రాంగం విఫలమయిందనే విమర్శలొస్తున్నాయి. -
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత
[ 18-05-2024]
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని రాష్ట్ర అదనపు ఎన్నికల కమిషనర్ లోకేష్కుమార్ అన్నారు. -
వాన రాకతో ధాన్యం ఆరక..
[ 18-05-2024]
వేసవికాలంలో జిల్లాలో వాతావరణంలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. -
నచ్చిన కోర్సు ఎంచుకోండి దోస్త్
[ 18-05-2024]
ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. డిగ్రీ కోర్సుల వైపు చూసే వారే ఎక్కువ మందే ఉంటారు. -
నిర్లక్ష్యం.. ప్రాణాంతకం
[ 18-05-2024]
ప్రజాప్రయోజనంతో చేపట్టే అభివృద్ధి పనుల పర్యవేక్షణ లోపించి ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
నాన్నను కొట్టి.. పశ్చాత్తాపం చెంది..
[ 18-05-2024]
ఆవేశంలో అకారణంగా నాన్నను కొట్టి.. అనంతరం తండ్రి తప్పేమీ లేదని తెలుసుకున్న కుమారుడు పశ్చాత్తాపంతో ఆవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తాజా వార్తలు (Latest News)
-
కోనసీమ జిల్లాలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి
-
కోడ్పై ఈసీకి ‘విజిల్’ వేశారు.. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్
-
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్
-
హైదరాబాద్లో భారీ వర్షం.. వనస్థలిపురం వద్ద భారీగా వరదనీరు
-
దేవాలయాల్లో లైబ్రరీలు..ఆసక్తికర సూచన చేసిన ఇస్రో ఛైర్మన్