అనుత్తీర్ణులపై ప్రత్యేక శ్రద్ధ
ఇంటర్మీడియట్ ఫలితాలు ఈసారి ఆశించిన స్థాయిలో రాలేదు. గత ఏడాదితో పోల్చితే రెండు స్థానాలు ఎగబాకి ఈ ఏడాది కాస్త మెరుగైన ఫలితాలు వచ్చాయి
ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
పరీక్ష కేంద్రంలో విద్యార్థులు
మెదక్ టౌన్, న్యూస్టుడే : ఇంటర్మీడియట్ ఫలితాలు ఈసారి ఆశించిన స్థాయిలో రాలేదు. గత ఏడాదితో పోల్చితే రెండు స్థానాలు ఎగబాకి ఈ ఏడాది కాస్త మెరుగైన ఫలితాలు వచ్చాయి. కానీ ప్రత్యేక తరగతులు, సిలబస్ తదితర కార్యక్రమాలు చేపట్టినా.. రాష్ట్ర స్థాయిలో జిల్లా ఉత్తమ ప్రతిభ కనబర్చలేకపోతుంది. త్వరలో ప్రారంభంకానున్న సప్లిమెంటరీ ఫలితాల్లో అయినా విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అనుత్తీర్ణులైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. ఇంటర్ విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేయనున్నారు.
ఆన్లైన్ ద్వారా బోధన..
ప్రస్తుతం వేసవి సెలవులు కొనసాగుతుండడంతో పాటు ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో విద్యార్థులకు పాఠ్యాంశాల వారీగా అధ్యాపకులతో ఆన్లైన్ ద్వారా బోధన నిర్వహించనున్నారు. ఫెయిల్ అయిన సబ్జెక్టులపై ప్రత్యేక తర్ఫీదు ఇవ్వనున్నారు. ప్రస్తుతం అధ్యాపకులకు ఎన్నికలకు సంబంధించిన శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. అందువల్ల వారి వీలు ప్రకారం తరగతులు తీసుకుంటున్నారు. ఎన్నికల అనంతరం ఒక క్రమ పద్ధతిలో బోధన తరగతులు నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 3641 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు. ఇందులో జనరల్ విభాగంలో 3489 మంది, ఒకేషనల్లో 152 మంది విద్యార్థులు ఉన్నారు. ద్వితీయ సంవత్సరానికి 2283 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు. ఇందులో జనరల్ విభాగంలో 2149 మంది, ఒకేషనల్లో 134 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఫీజులు చెల్లించారు.
పోటీ పరీక్షలకు సైతం
ప్రభుత్వ కళాశాలల్లో అభ్యసించి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఎంసెట్, నీట్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. కఠిన అంశాలపై సమగ్ర పట్టు సాధించేలా చర్యలు చేపడుతారు. రసాయనశాస్త్రం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రంలోని అన్ని అంశాలపై విద్యార్థులకు వివరించనున్నారు. ఎలాంటి సందేహాలున్నా అప్పటికప్పుడు నివృత్తి చేయనున్నారు.
ఉత్తమ ఫలితాలు సాధించమే లక్ష్యం
- సత్యనారాయణ, జిల్లా ఇంటర్ నోడల్ అధికారి
ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో పనిచేయాలని జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాలలకు సూచించాం. కొన్ని కళాశాలల్లో ఒక్కో సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఉన్నారు. అలాంటి వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తే వారు ఉత్తీర్ణత సాధించడంతో పాటు రాష్ట్రంలో జిల్లా ఉన్నత స్థాయిలో ఉంటుంది. ప్రస్తుతం ఎన్నిక ప్రక్రియ కొనసాగుతున్నందున సరైన సమయాల్లో విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించడం లేదు. ఎన్నికల తర్వాత ప్రత్యేక దృష్టి సారించి ఉత్తీర్ణత శాతాన్ని పెంచుతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బంగారు ఆభరణాలు చోరీ
[ 18-05-2024]
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో బంగారం చోరీకి గురైంది. బస్సు ఎక్కుతున్న మహిళ బ్యాగు లోంచి 8 తులాల బంగారు ఆభరణాలను దుండగులు చోరీ చేశారు. -
ఇక స్థానిక సమరం
[ 18-05-2024]
మరో ఎన్నికల సందడి రానుంది. పార్లమెంట్ ఎన్నికలు పూర్తికావడంతో పరిపాలనపై దృష్టి సారించనున్న రాష్ట్ర ప్రభుత్వం.. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు మొగ్గుచూపుతోంది. -
కొనుగోళ్లలో జాప్యంపై కర్షకుల కన్నెర్ర
[ 18-05-2024]
ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ మండల పరిధిలోని మిన్పూర్ గ్రామ రైతులు శుక్రవారం మెదక్-బోడ్మట్పల్లి రహదారిపై ఆందోళనకు దిగారు. -
సొంతింటి కల..నెరవేరేనా?
[ 18-05-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రంలో నిర్మించిన కొన్ని ఇళ్ల పనులు కొసరు పనులతో నిలిచిపోగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. -
భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించండి
[ 18-05-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గం భారాస అభ్యర్థి పి.వెంకట్రామిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని భాజపా మెదక్ అభ్యర్థి ఎం.రఘునందన్రావు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్కు ఫిర్యాదు చేశారు. -
ఉపాధి కూలీలకు ఊరట
[ 18-05-2024]
ఈ ఏడాది వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
ఒక్క రూపాయైనా జమ కాలేదు
[ 18-05-2024]
జిల్లావ్యాప్తంగా యాసంగిలో రైతులు ఉత్సాహంగా జొన్న పంట సాగు చేశారు. దిగుబడులు చేతికొస్తున్నాయి. -
శిథిల భవనాలు.. కానరాని చర్యలు
[ 18-05-2024]
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం జనం ప్రాణాలను బలిగొంటోంది. -
పల్లెల్లో మొదలైన సందడి
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారా..? అనే ప్రశ్నకు అవుననే సంకేతాలు వస్తున్నాయి. -
గుర్తించని జోన్లు.. ట్రాఫిక్ ఇక్కట్లు
[ 18-05-2024]
పట్టణాల్లో వ్యాపార జోన్లు అటకెక్కాయి. వ్యాపారాలు రహదారుల వెంట కాకుండా.. పురపాలక సంఘాలు ఏర్పాటు చేసిన జోన్లలో నిర్వహించుకునేలా ప్రణాళికలు రూపొంచడంలో యంత్రాంగం విఫలమయిందనే విమర్శలొస్తున్నాయి. -
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత
[ 18-05-2024]
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని రాష్ట్ర అదనపు ఎన్నికల కమిషనర్ లోకేష్కుమార్ అన్నారు. -
వాన రాకతో ధాన్యం ఆరక..
[ 18-05-2024]
వేసవికాలంలో జిల్లాలో వాతావరణంలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. -
నచ్చిన కోర్సు ఎంచుకోండి దోస్త్
[ 18-05-2024]
ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. డిగ్రీ కోర్సుల వైపు చూసే వారే ఎక్కువ మందే ఉంటారు. -
నిర్లక్ష్యం.. ప్రాణాంతకం
[ 18-05-2024]
ప్రజాప్రయోజనంతో చేపట్టే అభివృద్ధి పనుల పర్యవేక్షణ లోపించి ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
నాన్నను కొట్టి.. పశ్చాత్తాపం చెంది..
[ 18-05-2024]
ఆవేశంలో అకారణంగా నాన్నను కొట్టి.. అనంతరం తండ్రి తప్పేమీ లేదని తెలుసుకున్న కుమారుడు పశ్చాత్తాపంతో ఆవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీ నాతో చర్చకు వస్తే అడిగే ప్రశ్నలివే..: రాహుల్ గాంధీ
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు