వడివడిగా సర్వే పనులు
అత్యంత కీలక ప్రాజెక్టుగా చెబుతున్న హైదరాబాద్ ప్రాంతీయ వలయ రహదారి పనులు వడివడిగా ముందుకు సాగుతున్నాయి. జిల్లాలు, ముఖ్య పట్టణాలను కలుపుతూ హైదరాబాద్
ట్రిపుల్ఆర్ ప్రాజెక్టులో ముందడుగు
తుర్కపల్లి మండలంలో నాటిన హద్దురాళ్లు
భువనగిరి, న్యూస్టుడే: అత్యంత కీలక ప్రాజెక్టుగా చెబుతున్న హైదరాబాద్ ప్రాంతీయ వలయ రహదారి పనులు వడివడిగా ముందుకు సాగుతున్నాయి. జిల్లాలు, ముఖ్య పట్టణాలను కలుపుతూ హైదరాబాద్ బాహ్య వలయదారి వెలుపల రీజనల్ రింగ్రోడ్డు పనులకు ప్రతిపాదించిన విషయం విధితమే. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రతిపాదించిన అలైన్మెంట్కు ఆమోదం తెలపడంతో సర్వే పనులు పుంజుకున్నాయి. మొదటి దశలో 158 కి.మీ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పచ్చజెండా ఊపాయి. గత శుక్రవారం మెదక్, సిద్దిపేట జిల్లాల్లో రహదారి వెళ్లే మార్గంలో భూముల సర్వే మొదలుపెట్టారు. సమగ్ర నివేదిక తయారీ కోసం ప్రైవేట్ సంస్థ హద్దురాళ్లు నాటే పనిని చేపట్టింది. గత రెండు రోజులుగా సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం పీర్లపల్లిలో కొలతలు చేపట్టి హద్దురాళ్లు నాటుతున్నారు. ఈ సర్వే పనులు యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా మొదలయ్యాయి. జిల్లాలోని ప్రతిపాదిత ప్రాంతంలో అలైన్మెంట్ కోసం ఐదు కి.మీ ఒక హద్దురాయి చొప్పున నాటడం మొదలుపెట్టారు. తుర్కపల్లి మండలం గంధమల్ల, వీరారెడ్డిపల్లి, కోనాపూర్, ఇబ్రహీంపూర్, దత్తాయిపల్లి, వేల్పుపల్లి మీదుగా యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్, దాతార్పల్లి వరకు సర్వే జరిగింది. దాతారుపల్లి నుంచి భువనగిరి మండలం బస్వాపూర్, రాయగిరి, భువనగిరి, కేసారం మీదుగా హద్దురాళ్లు నాటారు. తుర్కపల్లి మండలంలో ఆరు గ్రామాలు, యాదగిరిగుట్ట మండలంలో రెండు గ్రామాలు, భువనగిరి మండలంలో 9 గ్రామాలు, వలిగొండ మండలంలో నాలుగు గ్రామాల మీదుగా ప్రాంతీయ వలయరహదారి వెళ్లనుంది. హద్దురాళ్లు నాటడంతో రైతులు తమ భూములు పోతాయని ఆందోళన చెందుతున్నారు. ఈ మండలాల్లో పాంతీయ వలయరహదారిపై చర్చ జరుగుతోంది. రహదారి వెళ్తున్న ప్రాంతాన్ని ప్రాథమికంగా గుర్తించి పూర్తిస్థాయిలో సర్వే చేపట్టిన తర్వాత భూయజమానులకు పరిహారం చెల్లింపు పనులు చేపడుతామని సర్వే అధికారి తెలిపారు. జిల్లాలో రహదారి నిర్మాణానికి భూసేకరణకు భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీవోలను ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో.. ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలతో పాటూ ఈ ఎన్నిక గెలుపుపైనా దృష్టి సారించాయి. -
ఇంటింటికీ పోల్ చిట్టీలు..!
[ 27-04-2024]
ఓటు వేసేందుకు ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఓటర్లందరికీ ప్రత్యేకంగా పోల్ చిట్టీలు పంపిణీ చేస్తోంది. -
పురంపై సైబర్ ఉచ్చు..!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో రాకేశ్ అనే వ్యాపారికి ఈ నెల 21న సాయంత్రం సెల్ నంబరు 63054 68441 నుంచి ఫోన్ కాల్ వచ్చింది. -
మామిడీలా
[ 27-04-2024]
మామిడి.. భారతదేశపు పండుగా గుర్తింపు పొందింది. ప్రపంచ ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో ఉంది. ఇది నిన్నామొన్నటి మాట. -
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాడు: రాజగోపాల్రెడ్డి
[ 27-04-2024]
రాబోయే నాలుగేళ్లలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తానని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
పద తమ్ముడూ.. పార్టీ మారుదాం!
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీల క్యాడర్ స్వరూపం మారిపోతోంది. రాజకీయ సమీకరణాలూ శరవేగంగా మారుతున్నాయి. -
సమగ్ర సమాచార మార్గదర్శి
[ 27-04-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక రకాల చర్యలు చేపడుతోంది. -
‘గుర్తు’ తెచ్చుకుందాం..రండి
[ 27-04-2024]
రాజకీయ పార్టీల ఉనికిని చాటేది వాటి గుర్తులే. గుర్తుల ఆధారంగానే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించడమే కాకుండా ఓటర్లు ఓటు వేస్తుంటారు. -
ప్రజల మనిషి ధర్మభిక్షం
[ 27-04-2024]
మునుగోడు మండలం ఊకొండిలో కల్లుగీత వృత్తి పని చేసుకునే ధర్మభిక్షం కుటుంబం సూర్యాపేటకు వలసవెళ్లి అక్కడే స్థిరపడింది. -
ఈతకెళ్లి తండ్రీతనయుల మృతి
[ 27-04-2024]
నీటి ప్రమాదాల నుంచి తప్పించుకునేలా తన ఇద్దరు కుమారులకు ఈత నేర్పాలని భావించిన ఆ తండ్రి. -
అవార్డుల ఉపాధ్యాయుడు ఆదె..!
[ 27-04-2024]
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా రెండు దశాబ్దాల నుంచి చిన్నారులకు విద్యాబోధన అందించటమే కాకుండా సమాజంలో విద్యాభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు ఆదె సత్యనారాయణ. -
వీడని మిస్టరీ..!
[ 27-04-2024]
ఈ నెల 18 నుంచి కనిపించకుండా పోయిన సూర్యాపేట మండలం యల్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్య కేసు మిస్టరీ వీడటం లేదు. -
చివరికి మొగి పురుగు దాడి
[ 27-04-2024]
ఈ సీజన్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు ఆలస్యంగా విడుదల కావడంతో తుంగతుర్తి నియోజకవర్గంలో 40 శాతం వరి సాగు జనవరి మాసంలో చేపట్టారు. -
వేతనాలు రాక టీఏల ఇబ్బందులు
[ 27-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి పనులను చూపిస్తూ విధులు నిర్వహిస్తున్న సాంకేతిక సహాయకుల ( టెక్నికల్ అసిస్టెంట్లు)కు రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
బరిలో..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం జరిగిన నామపత్రాల పరిశీలన కార్యక్రమంలో నల్గొండ లోక్సభ పరిధిలో 25 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా లేకపోవడంతో తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే
-
పవన్కల్యాణ్కు మద్దతుగా వరుణ్తేజ్ ప్రచారం