పేదలకు సంక్షేమ ఫలాలు: కలెక్టర్
భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ జాతీయ జెండాను ఎగురవేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కలెక్టరేట్లో బుధవారం గణతంత్ర దినోత్సవ
నల్గొండ కలెక్టరేట్, న్యూస్టుడే: భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ జాతీయ జెండాను ఎగురవేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కలెక్టరేట్లో బుధవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఉదయం 10 గంటలకు కలెక్టర్ ముందుగా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు నిరుపేదలకు అందేలా కృషి చేయాలన్నారు. ఎస్పీ రెమా రాజేశ్వరి, జడ్పీ ఛైర్మన్ బండా నరేందర్రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, నల్గొండ, మిర్యాలగూడ, సాగర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, భాస్కర్రావు, నోముల భగత్, పురపాలిక ఛైర్మన్ మందడి సైదిరెడ్డి, అదనపు కలెక్టర్లు రాహుల్శర్మ, చంద్రశేఖర్, సహాయ శిక్షణ కలెక్టర్ అపూర్వ్ చౌహాన్, అధికారులు పాల్గొన్నారు.
75 మీటర్ల జాతీయ జెండాతో ప్రదర్శన
నల్గొండ విద్యావిభాగం, న్యూస్టుడే: ఆజాదికా అమృత్ వారోత్సవాలలో భాగంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏబీవీపీ ఆధ్వర్యంలో నల్గొండలో 75మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఏబీవీపీ కార్యాలయం నుంచి పెద్ద గడియారం వరకు జాతీయ జెండాతో ప్రదర్శనగా వచ్చిన నాయకులు, విద్యార్థులు భారత్మాతాకు జై అంటూ నినాదాలు చేశారు.
జన గణ మన సంబరం
కలెక్టరేట్లో జాతీయ జెండా ఎగురవేసి వందనం సమర్పిస్తున్న కలెక్టర్ పమేలా సత్పతి,
చిత్రంలో డీఎస్పీ నారాయణరెడ్డి, తదితరులు
భువనగిరి, న్యూస్టుడే: కలెక్టరేట్లో గణతంత్ర వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. కలెక్టర్ పమేలా సత్పతి జాతీయజెండా ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అటవీశాఖలో ఉత్తమ సేవలందించిన సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర అయిల్ఫెడ్ ఛైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు శ్రీనివాస్రెడ్డి, దీపక్ తివారి, డీసీపీ నారాయణరెడ్డి, భువనగిరి ఆర్డీవో భూపాల్రెడ్డి, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. భువనగిరి పట్టణంలోని జడ్పీ కార్యాలయంలో ఛైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
భువనగిరి: జడ్పీ కార్యాలయంలో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, వైస్ ఛైర్మన్
బీకూ నాయక్, డిప్యూటీ సీఈవో శ్రీనివాస్రావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో.. ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలతో పాటూ ఈ ఎన్నిక గెలుపుపైనా దృష్టి సారించాయి. -
ఇంటింటికీ పోల్ చిట్టీలు..!
[ 27-04-2024]
ఓటు వేసేందుకు ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఓటర్లందరికీ ప్రత్యేకంగా పోల్ చిట్టీలు పంపిణీ చేస్తోంది. -
పురంపై సైబర్ ఉచ్చు..!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో రాకేశ్ అనే వ్యాపారికి ఈ నెల 21న సాయంత్రం సెల్ నంబరు 63054 68441 నుంచి ఫోన్ కాల్ వచ్చింది. -
మామిడీలా
[ 27-04-2024]
మామిడి.. భారతదేశపు పండుగా గుర్తింపు పొందింది. ప్రపంచ ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో ఉంది. ఇది నిన్నామొన్నటి మాట. -
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాడు: రాజగోపాల్రెడ్డి
[ 27-04-2024]
రాబోయే నాలుగేళ్లలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తానని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
పద తమ్ముడూ.. పార్టీ మారుదాం!
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీల క్యాడర్ స్వరూపం మారిపోతోంది. రాజకీయ సమీకరణాలూ శరవేగంగా మారుతున్నాయి. -
సమగ్ర సమాచార మార్గదర్శి
[ 27-04-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక రకాల చర్యలు చేపడుతోంది. -
‘గుర్తు’ తెచ్చుకుందాం..రండి
[ 27-04-2024]
రాజకీయ పార్టీల ఉనికిని చాటేది వాటి గుర్తులే. గుర్తుల ఆధారంగానే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించడమే కాకుండా ఓటర్లు ఓటు వేస్తుంటారు. -
ప్రజల మనిషి ధర్మభిక్షం
[ 27-04-2024]
మునుగోడు మండలం ఊకొండిలో కల్లుగీత వృత్తి పని చేసుకునే ధర్మభిక్షం కుటుంబం సూర్యాపేటకు వలసవెళ్లి అక్కడే స్థిరపడింది. -
ఈతకెళ్లి తండ్రీతనయుల మృతి
[ 27-04-2024]
నీటి ప్రమాదాల నుంచి తప్పించుకునేలా తన ఇద్దరు కుమారులకు ఈత నేర్పాలని భావించిన ఆ తండ్రి. -
అవార్డుల ఉపాధ్యాయుడు ఆదె..!
[ 27-04-2024]
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా రెండు దశాబ్దాల నుంచి చిన్నారులకు విద్యాబోధన అందించటమే కాకుండా సమాజంలో విద్యాభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు ఆదె సత్యనారాయణ. -
వీడని మిస్టరీ..!
[ 27-04-2024]
ఈ నెల 18 నుంచి కనిపించకుండా పోయిన సూర్యాపేట మండలం యల్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్య కేసు మిస్టరీ వీడటం లేదు. -
చివరికి మొగి పురుగు దాడి
[ 27-04-2024]
ఈ సీజన్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు ఆలస్యంగా విడుదల కావడంతో తుంగతుర్తి నియోజకవర్గంలో 40 శాతం వరి సాగు జనవరి మాసంలో చేపట్టారు. -
వేతనాలు రాక టీఏల ఇబ్బందులు
[ 27-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి పనులను చూపిస్తూ విధులు నిర్వహిస్తున్న సాంకేతిక సహాయకుల ( టెక్నికల్ అసిస్టెంట్లు)కు రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
బరిలో..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం జరిగిన నామపత్రాల పరిశీలన కార్యక్రమంలో నల్గొండ లోక్సభ పరిధిలో 25 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా లేకపోవడంతో తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే
-
పవన్కల్యాణ్కు మద్దతుగా వరుణ్తేజ్ ప్రచారం