చిచ్చర పిడుగులు.. బ్యాడ్మింటన్లో మెరుపులు
ఆసక్తికి ఉత్తమ శిక్షణ తోడైతే అత్యుత్తమ ఫలితాలు సాధిస్తామని నిరూపిస్తున్నారు ఈ చిన్నారులు. అటు చదువులో, ఇటు రాష్ట్ర, జాతీయ స్థాయిలో కీడ్రాపోటీల్లో ప్రతిభ కనబరుస్తూ తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. బ్యాడ్మింటన్లో రాణిస్తున్న
- మిర్యాలగూడ పట్టణం, న్యూస్టుడే
ఆసక్తికి ఉత్తమ శిక్షణ తోడైతే అత్యుత్తమ ఫలితాలు సాధిస్తామని నిరూపిస్తున్నారు ఈ చిన్నారులు. అటు చదువులో, ఇటు రాష్ట్ర, జాతీయ స్థాయిలో కీడ్రాపోటీల్లో ప్రతిభ కనబరుస్తూ తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. బ్యాడ్మింటన్లో రాణిస్తున్న చిన్నారులపై ‘న్యూస్టుడే’ కథనం.
చిన్నప్పటి నుంచే ఆసక్తి
జిల్లా శిక్షకుడు రామకృష్ణ వద్ద శిక్షణ పొందుతున్న వెంకటసాయి వైష్ణవి
మిర్యాలగూడ పట్టణానికి చెందిన పెండెం ప్రేమ్కుమార్-పార్వతిదేవి దంపతుల కుమార్తె వెంకటసాయి వైష్ణవి ప్రసుత్తం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతుంది. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వైష్ణవి చిన్నప్పటి నుంచే బ్యాడ్మింటన్పై ఆసక్తి కనబరుస్తుండడంతో నాలుగేళ్ల క్రితం స్థానిక ఇండోర్ స్టేడియంలో జిల్లా శిక్షకుడు మారబోయిన రామకృష్ణ వద్ద చేర్పించగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తుంది వైష్ణవి. అంతర్జాతీయ స్థాయిలో రాణించి.. దేశానికి, తల్లిదండ్రులకు గొప్ప పేరు తీసుకురావడమే లక్ష్యమని బెబుతోంది ఈ చిన్నారి.
వైష్ణవి ఘనతలు...
* 2020లో హైదరాబాద్లో నిర్వహించిన అండర్-14 రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకం.
* 2019లో బెంగళూరులో అండర్- 9 జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ.
* 2019లో హైదరాబాద్లో జరిగిన అండర్-9 రాష్ట్ర స్థాయి పోటీల్లో వెండి పతకం.
* 2019లో ఎస్.ఎస్.బ్యాడ్మింటన్ అకాడమీ వారి అండర్-9 రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకం.
* 2019లో చేతన్ ఆనంద్ అకాడమీ రాష్ట్ర స్థాయి అండర్-9 పోటీల్లో సింగిల్స్, డబుల్స్లో బంగారు పతకాలు.
* 2019లో నిర్వహించిన ఎంపిక పోటీల్లో అండర్-13 విభాగంలో రాష్ట్ర స్థాయికి ఎంపిక.
* 2019లో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి అండర్-9 పోటీల్లో బంగారు పతకం.
గోపీచంద్ అకాడమీలో శిక్షణ
గవ్వ అశ్మిత్రెడ్డి
సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన గవ్వ వెంకట్రెడ్డి-శిల్పారెడ్డిలు తమ వ్యాపార రీత్యా హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు అక్షిత్రెడ్డి, అశ్మిత్రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న అక్షిత్రెడ్డి బ్యాడ్మింటన్లో అంతర్జాతీయ స్థాయి పోటీల్లో సైతం పాల్గొన్నాడు. తన అన్నను చూస్తూ తను కూడా చిన్నప్పటి నుంచే బ్యాడ్మింటన్పై ఇష్టం పెంచుకున్న అశ్మిత్రెడ్డి పలు పోటీల్లో రాణిస్తున్నారు. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్న అశ్మిత్ పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో రెండేళ్లుగా శిక్షణ పొందుతున్నాడు. చదువుతో పాటు బ్యాడ్మింటన్లో రాణిస్తున్న అశ్మిత్ పలు రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చాటాడు. మంచి ఉద్యోగంతో పాటు బ్యాడ్మింటన్లో దేశం తరపున ఆడడమే తన లక్ష్యంగా సాధన చేస్తున్నాడు.
అశ్మిత్ విజయాలు...
* 2021లో సూర్యాపేట జిల్లా స్థాయి పోటీల్లో రజత పతకం.
* 2019లో హైదరాబాద్లో నిర్వహించిన స్పోర్ట్స్ ఫర్ ఆల్ రాష్ట్ర స్థాయి పోటీల్లో వెండి పతకం.
* 2019లో హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకం.
* 2019లో హైదరాబాద్లో నిర్వహించిన ఖేల్ ఉత్సవ్ రాష్ట్ర స్థాయి పోటీల్లో వెండి పతకం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో.. ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలతో పాటూ ఈ ఎన్నిక గెలుపుపైనా దృష్టి సారించాయి. -
ఇంటింటికీ పోల్ చిట్టీలు..!
[ 27-04-2024]
ఓటు వేసేందుకు ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఓటర్లందరికీ ప్రత్యేకంగా పోల్ చిట్టీలు పంపిణీ చేస్తోంది. -
పురంపై సైబర్ ఉచ్చు..!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో రాకేశ్ అనే వ్యాపారికి ఈ నెల 21న సాయంత్రం సెల్ నంబరు 63054 68441 నుంచి ఫోన్ కాల్ వచ్చింది. -
మామిడీలా
[ 27-04-2024]
మామిడి.. భారతదేశపు పండుగా గుర్తింపు పొందింది. ప్రపంచ ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో ఉంది. ఇది నిన్నామొన్నటి మాట. -
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాడు: రాజగోపాల్రెడ్డి
[ 27-04-2024]
రాబోయే నాలుగేళ్లలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తానని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
పద తమ్ముడూ.. పార్టీ మారుదాం!
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీల క్యాడర్ స్వరూపం మారిపోతోంది. రాజకీయ సమీకరణాలూ శరవేగంగా మారుతున్నాయి. -
సమగ్ర సమాచార మార్గదర్శి
[ 27-04-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక రకాల చర్యలు చేపడుతోంది. -
‘గుర్తు’ తెచ్చుకుందాం..రండి
[ 27-04-2024]
రాజకీయ పార్టీల ఉనికిని చాటేది వాటి గుర్తులే. గుర్తుల ఆధారంగానే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించడమే కాకుండా ఓటర్లు ఓటు వేస్తుంటారు. -
ప్రజల మనిషి ధర్మభిక్షం
[ 27-04-2024]
మునుగోడు మండలం ఊకొండిలో కల్లుగీత వృత్తి పని చేసుకునే ధర్మభిక్షం కుటుంబం సూర్యాపేటకు వలసవెళ్లి అక్కడే స్థిరపడింది. -
ఈతకెళ్లి తండ్రీతనయుల మృతి
[ 27-04-2024]
నీటి ప్రమాదాల నుంచి తప్పించుకునేలా తన ఇద్దరు కుమారులకు ఈత నేర్పాలని భావించిన ఆ తండ్రి. -
అవార్డుల ఉపాధ్యాయుడు ఆదె..!
[ 27-04-2024]
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా రెండు దశాబ్దాల నుంచి చిన్నారులకు విద్యాబోధన అందించటమే కాకుండా సమాజంలో విద్యాభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు ఆదె సత్యనారాయణ. -
వీడని మిస్టరీ..!
[ 27-04-2024]
ఈ నెల 18 నుంచి కనిపించకుండా పోయిన సూర్యాపేట మండలం యల్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్య కేసు మిస్టరీ వీడటం లేదు. -
చివరికి మొగి పురుగు దాడి
[ 27-04-2024]
ఈ సీజన్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు ఆలస్యంగా విడుదల కావడంతో తుంగతుర్తి నియోజకవర్గంలో 40 శాతం వరి సాగు జనవరి మాసంలో చేపట్టారు. -
వేతనాలు రాక టీఏల ఇబ్బందులు
[ 27-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి పనులను చూపిస్తూ విధులు నిర్వహిస్తున్న సాంకేతిక సహాయకుల ( టెక్నికల్ అసిస్టెంట్లు)కు రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
బరిలో..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం జరిగిన నామపత్రాల పరిశీలన కార్యక్రమంలో నల్గొండ లోక్సభ పరిధిలో 25 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా లేకపోవడంతో తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు.