ఉత్తమ ప్రతిభావంతులకు పురస్కారాలు
విధుల్లో ఉత్తమ ప్రతిభన కనబరిచిన అటవీశాఖ అధికారులకు ప్రభుత్వం పురస్కారాలు ప్రదానం చేసింది. ఇందులో జిల్లా అటవీశాఖ సిబ్బందికి ఐదు కేటగిరీలలో అవార్డులు లభించాయని డీఎఫ్వో డీవీరెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో జరిగిన గణతంత్ర
జిల్లా అటవీశాఖ సిబ్బందికి ఐదు అవార్డులు
భువనగిరి, న్యూస్టుడే
మల్కాపూర్ బీట్కు చెందిన వన రక్షకులు బి.వకుళకుమారికి ప్రశంసాపత్రం అందజేస్తున్న కలెక్టర్ పమేలాసత్పతి
విధుల్లో ఉత్తమ ప్రతిభన కనబరిచిన అటవీశాఖ అధికారులకు ప్రభుత్వం పురస్కారాలు ప్రదానం చేసింది. ఇందులో జిల్లా అటవీశాఖ సిబ్బందికి ఐదు కేటగిరీలలో అవార్డులు లభించాయని డీఎఫ్వో డీవీరెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో జరిగిన గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ పమేలా సత్పతి వారికి పురస్కారాలు ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతలకు ప్రశంసాపత్రంతో పాటు రూ.10వేల నగదు అందజేశారు.
* ఉత్తమ ప్లాంటేషన్ కేటగిరీలో మల్కాపూర్ బీట్కు చెందిన వన రక్షకులు బి.వకుళకుమారికి అవార్డు లభించింది. మల్కాపూర్ అటవీ బ్లాక్లో ఐదు హెక్టార్లలో ఎల్ఐ పద్ధతిలో ప్లాంటేషన్, 3 హెక్టార్లలో యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ను పెంచారు. ఈ ప్లాంటేషన్ 85శాతం సర్వైవల్తో విజయవంతంగా పెంచినందుకు ప్రభుత్వం వకుళకుమారిని అవార్డుతో సత్కరించింది.
* ఉత్తమ అటవీ బ్లాకుల రక్షణ కేటగిరీలో నారాయణపురంసెక్షన్కు చెందిన వనపాలకులు సీహెచ్ రాములుకు అవార్డు లభించింది. 5.40 హెక్టార్ల యాదాద్రి మోడల్ ప్లాంటేషన్, 554.90 హెక్టార్ల బ్లాక్, ఎస్ఎంఎం, ఎల్ఐ పద్ధతుల ప్లాంటేషన్లను విజయవంతంగా పెంచినందుకు అవార్డుతో సత్కరించారు.
* ఉత్తమ అటవీబ్లాక్ కేటగిరిలో వాసాలమర్రి బీట్కు చెందిన వనరక్షకులు కె.మల్లేశ్కు అవార్డు లభించింది. వాసాలమర్రి, కొండాపూర్ ఖుర్ద్, గోపాల్పూర్-2 అటవీ ప్రాంతంలో పెర్కులేషన్ ట్యాంకులు నాలుగు, ఎస్సీటీలు 1850, చెక్డ్యాంలు రెండు విజయవంతంగా పూర్తిచేసినందుకు అవార్డు ప్రదానం చేశారు.
* ఉత్తమ అటవీ బ్లాకు నివాస స్థలం, సహజ గడ్డి భూముల అభివృద్ధి కేటగిరీలో బొమ్మలరామాం బీట్ ఆఫీసర్ సహాయ వనరక్షకులు పురుషోత్తంకు అవార్డు లభించింది. సహాయ వన రక్షకులు అయినప్పటికీ అటవీ రక్షణలో భాగంగా అన్ని రకాల పనుల్లో చురుగ్గా పాల్గొన్నందుకు అవార్డు లభించింది.
* ఉత్తమ అటవీ బ్లాకు, అటవీ బ్లాకుల పునర్జీవన ప్రణాళిక పూర్తి చేసిన కేటగిరీలో రాయగిరి బీట్ వనరక్షకులు పి.శ్రీనివాస్కు అవార్డు లభించింది. అటవీ బ్లాకుల్లో కష్టతరమైన భూ భాగాలు ఉన్నప్పటికీ మూడు చెక్డ్యాంలు, నాలుగు పెర్కులేషన్ ట్యాంక్లు, 17 ఫార్మ్ ఫాండ్లు చేపట్టినందుకు అవార్డు లభించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో.. ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలతో పాటూ ఈ ఎన్నిక గెలుపుపైనా దృష్టి సారించాయి. -
ఇంటింటికీ పోల్ చిట్టీలు..!
[ 27-04-2024]
ఓటు వేసేందుకు ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఓటర్లందరికీ ప్రత్యేకంగా పోల్ చిట్టీలు పంపిణీ చేస్తోంది. -
పురంపై సైబర్ ఉచ్చు..!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో రాకేశ్ అనే వ్యాపారికి ఈ నెల 21న సాయంత్రం సెల్ నంబరు 63054 68441 నుంచి ఫోన్ కాల్ వచ్చింది. -
మామిడీలా
[ 27-04-2024]
మామిడి.. భారతదేశపు పండుగా గుర్తింపు పొందింది. ప్రపంచ ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో ఉంది. ఇది నిన్నామొన్నటి మాట. -
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాడు: రాజగోపాల్రెడ్డి
[ 27-04-2024]
రాబోయే నాలుగేళ్లలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తానని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
పద తమ్ముడూ.. పార్టీ మారుదాం!
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీల క్యాడర్ స్వరూపం మారిపోతోంది. రాజకీయ సమీకరణాలూ శరవేగంగా మారుతున్నాయి. -
సమగ్ర సమాచార మార్గదర్శి
[ 27-04-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక రకాల చర్యలు చేపడుతోంది. -
‘గుర్తు’ తెచ్చుకుందాం..రండి
[ 27-04-2024]
రాజకీయ పార్టీల ఉనికిని చాటేది వాటి గుర్తులే. గుర్తుల ఆధారంగానే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించడమే కాకుండా ఓటర్లు ఓటు వేస్తుంటారు. -
ప్రజల మనిషి ధర్మభిక్షం
[ 27-04-2024]
మునుగోడు మండలం ఊకొండిలో కల్లుగీత వృత్తి పని చేసుకునే ధర్మభిక్షం కుటుంబం సూర్యాపేటకు వలసవెళ్లి అక్కడే స్థిరపడింది. -
ఈతకెళ్లి తండ్రీతనయుల మృతి
[ 27-04-2024]
నీటి ప్రమాదాల నుంచి తప్పించుకునేలా తన ఇద్దరు కుమారులకు ఈత నేర్పాలని భావించిన ఆ తండ్రి. -
అవార్డుల ఉపాధ్యాయుడు ఆదె..!
[ 27-04-2024]
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా రెండు దశాబ్దాల నుంచి చిన్నారులకు విద్యాబోధన అందించటమే కాకుండా సమాజంలో విద్యాభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు ఆదె సత్యనారాయణ. -
వీడని మిస్టరీ..!
[ 27-04-2024]
ఈ నెల 18 నుంచి కనిపించకుండా పోయిన సూర్యాపేట మండలం యల్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్య కేసు మిస్టరీ వీడటం లేదు. -
చివరికి మొగి పురుగు దాడి
[ 27-04-2024]
ఈ సీజన్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు ఆలస్యంగా విడుదల కావడంతో తుంగతుర్తి నియోజకవర్గంలో 40 శాతం వరి సాగు జనవరి మాసంలో చేపట్టారు. -
వేతనాలు రాక టీఏల ఇబ్బందులు
[ 27-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి పనులను చూపిస్తూ విధులు నిర్వహిస్తున్న సాంకేతిక సహాయకుల ( టెక్నికల్ అసిస్టెంట్లు)కు రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
బరిలో..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం జరిగిన నామపత్రాల పరిశీలన కార్యక్రమంలో నల్గొండ లోక్సభ పరిధిలో 25 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా లేకపోవడంతో తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు.