ఆసక్తి గుర్తించి.. అభిరుచి తెలుసుకుని
మహిళలు ప్రేమాభిమానాలతో పాటు పట్టుదల, కృషి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకలే. అన్ని రంగాల్లో విజయం సాధించగల సత్తా వారికి ఉంటుంది. కరోనా అన్ని రంగాలపై ప్రభావం చూపటంతో చాలా కుటుంబాల జీవన విధానంలో మార్పులోచ్చాయి.
మహిళలకు ఇంటి వద్దే నైపుణ్య శిక్షణ అందిస్తున్న కేవీకే
మిర్యాలగూడ శ్రీనివాసనగర్లో శిక్షణ ఇస్తున్న శాస్త్రవేత్త
గరిడేపల్లి, న్యూస్టుడే: మహిళలు ప్రేమాభిమానాలతో పాటు పట్టుదల, కృషి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకలే. అన్ని రంగాల్లో విజయం సాధించగల సత్తా వారికి ఉంటుంది. కరోనా అన్ని రంగాలపై ప్రభావం చూపటంతో చాలా కుటుంబాల జీవన విధానంలో మార్పులోచ్చాయి. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తున్నారు. అయితే పారిశ్రామిక రంగాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు స్థాపించాలంటే కచ్చితంగా శిక్షణ అవసరం. కుటుంబం నుంచి ప్రోత్సహాం లభించిన వారు శిక్షణ తీసుకుని స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించి రాణిస్తున్నారు. ఇంకా కొందరైతే ఇంట్లో భర్త, పిల్లలు, కుటుంబ బాధ్యతల భారంతో బయటకు రాలేకపోతున్నారు. నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నా కుటుంబ భారం మోస్తూ అలాగే ఉండి పోతున్నారు. అయితే ఇలాంటి వారి కోసం గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఓ కోత్త కార్యక్రమాన్ని రూపోందించింది. వారి ఇంటికో, గ్రామానికో వెళ్లి అక్కడే స్వయం ఉపాధి కార్యక్రమాల్లో శిక్షణ అందిస్తుంది.
సర్వే చేపట్టి.. కోర్సులు రూపొందించి
గృహ విజ్ఞాన విభాగం సహాయ శాస్త్రవేత్త సుగంధి కేవీకే పరిధిలో గ్రామాల్లో ప్రత్యేకంగా సర్వే చేపట్టారు. మహిళ ఆసక్తి, అభిరుచిని తెలుసుకొని అందకనుగుణంగా కొన్ని కోర్సులను రూపొందించారు. పుట్టగొడుగుల పెంపకం, చిరుధాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్, ఎంబ్రాయిండరీ, పెయింటింగ్, చీరల రోలింగ్, బ్లౌజ్ల డిజైనింగ్లో నిపుణులతో శిక్షణ అందిస్తారు. తర్వాత వారు ఉపాధి పొందేందుకు అవసరమైన రుణం పొందేందుకు సహాయం చేస్తారు. గ్రామంలో 25 నుంచి 30 మంది మహిళలు జట్టుగా ఏర్పడి కేవీకేలో నమోదు చేసుకుంటే చాలు. ఈ శిక్షణ కార్యక్రమాలు వారం నుంచి 15 రోజుల వ్యవధి ఉంటాయి. ఈ కార్యక్రమం అగ్రికల్చర్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్థిక సహకారంతో నడుస్తుంది.
గ్రామాల్లో మంచి స్పందన
నూతన విధానానికి గ్రామాల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు కేవీకే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా పుట్టగొడుగుల పెంపకం, చిరుధాన్యాల నుంచి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ వైపు మహిళలు మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు. చిలుకూరు, నేరేడుచర్ల మండలం పెంచికలదిన్నె, పెన్పహాడ్ మండలం లింగాల, తుంగతుర్తి మండలం సంగెం గ్రామాలలో పుట్టగొడుగుల తయారీపై శిక్షణ అందించారు. పెంచికలదిన్నెలో గ్రూపునకు శిక్షణ ఇవ్వనున్నారు. చిరు ధాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్లో పిండి వంటకాలు, బలవర్థక ఆహారం తయారీపై శిక్షణ ఇచ్చారు. సభ్యులంతా ప్రస్తుతం ఉపాధి పొందుతున్నారు. పెంచికలదిన్నెలో శిక్షణ ఇవ్వడానికి సన్నద్దమవుతున్నారు.
గ్రామాలకు వెళ్తున్నాం..
సుగంధి, శాస్త్రవేత్త, కేవీకే
మహిళల ఆసక్తి తగ్గట్లుగా శిక్షణ కార్యక్రమాలు రూపొందించాం. ఆయకట్టు ప్రాంతాల్లో మహిళలు బయటకు వచ్చేందుకు సమయం ఉండదు. అందుకే మేమే గ్రామాలకు వెళ్తున్నాం. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తుంది. శిక్షణ పొందిన వారు ఇంటి దగ్గరే ఉపాధి పొందుతున్నారు.
పుట్టగొడుగులు పెంచుతున్నా..
మేకల సావిత్రి, పెంచికల్దిన్న
కేవీకే శిక్షణతో పుట్టగొడుగుల తయారీ చేస్తున్నా. దీని ఇంట్లోనే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకున్నాం. మిర్యాలగూడలోని హోటళ్లు, రెస్టారెంట్లు సరఫరా చేస్తున్నా. వారే ఇంటికి వచ్చి తీసుకెళ్తున్నారు. పెద్ద మొత్తంలో కావాలన్న ముందస్తుగా ఆర్డర్ ఇస్తే తయారు చేస్తాం. స్వయంగ ఉపాధితో ఆదాయం వస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో.. ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలతో పాటూ ఈ ఎన్నిక గెలుపుపైనా దృష్టి సారించాయి. -
ఇంటింటికీ పోల్ చిట్టీలు..!
[ 27-04-2024]
ఓటు వేసేందుకు ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఓటర్లందరికీ ప్రత్యేకంగా పోల్ చిట్టీలు పంపిణీ చేస్తోంది. -
పురంపై సైబర్ ఉచ్చు..!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో రాకేశ్ అనే వ్యాపారికి ఈ నెల 21న సాయంత్రం సెల్ నంబరు 63054 68441 నుంచి ఫోన్ కాల్ వచ్చింది. -
మామిడీలా
[ 27-04-2024]
మామిడి.. భారతదేశపు పండుగా గుర్తింపు పొందింది. ప్రపంచ ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో ఉంది. ఇది నిన్నామొన్నటి మాట. -
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాడు: రాజగోపాల్రెడ్డి
[ 27-04-2024]
రాబోయే నాలుగేళ్లలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తానని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
పద తమ్ముడూ.. పార్టీ మారుదాం!
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీల క్యాడర్ స్వరూపం మారిపోతోంది. రాజకీయ సమీకరణాలూ శరవేగంగా మారుతున్నాయి. -
సమగ్ర సమాచార మార్గదర్శి
[ 27-04-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక రకాల చర్యలు చేపడుతోంది. -
‘గుర్తు’ తెచ్చుకుందాం..రండి
[ 27-04-2024]
రాజకీయ పార్టీల ఉనికిని చాటేది వాటి గుర్తులే. గుర్తుల ఆధారంగానే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించడమే కాకుండా ఓటర్లు ఓటు వేస్తుంటారు. -
ప్రజల మనిషి ధర్మభిక్షం
[ 27-04-2024]
మునుగోడు మండలం ఊకొండిలో కల్లుగీత వృత్తి పని చేసుకునే ధర్మభిక్షం కుటుంబం సూర్యాపేటకు వలసవెళ్లి అక్కడే స్థిరపడింది. -
ఈతకెళ్లి తండ్రీతనయుల మృతి
[ 27-04-2024]
నీటి ప్రమాదాల నుంచి తప్పించుకునేలా తన ఇద్దరు కుమారులకు ఈత నేర్పాలని భావించిన ఆ తండ్రి. -
అవార్డుల ఉపాధ్యాయుడు ఆదె..!
[ 27-04-2024]
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా రెండు దశాబ్దాల నుంచి చిన్నారులకు విద్యాబోధన అందించటమే కాకుండా సమాజంలో విద్యాభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు ఆదె సత్యనారాయణ. -
వీడని మిస్టరీ..!
[ 27-04-2024]
ఈ నెల 18 నుంచి కనిపించకుండా పోయిన సూర్యాపేట మండలం యల్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్య కేసు మిస్టరీ వీడటం లేదు. -
చివరికి మొగి పురుగు దాడి
[ 27-04-2024]
ఈ సీజన్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు ఆలస్యంగా విడుదల కావడంతో తుంగతుర్తి నియోజకవర్గంలో 40 శాతం వరి సాగు జనవరి మాసంలో చేపట్టారు. -
వేతనాలు రాక టీఏల ఇబ్బందులు
[ 27-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి పనులను చూపిస్తూ విధులు నిర్వహిస్తున్న సాంకేతిక సహాయకుల ( టెక్నికల్ అసిస్టెంట్లు)కు రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
బరిలో..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం జరిగిన నామపత్రాల పరిశీలన కార్యక్రమంలో నల్గొండ లోక్సభ పరిధిలో 25 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా లేకపోవడంతో తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు.