ఉద్యమ కలానికి పట్టం
నెహ్రూ మరణ వార్త విన్న వేణు సంకోజు తన ఆవేదనను అక్షర రూపంగా మలిచారు. అప్పటి నుంచి కవితలపై ఆసక్తి పెంచుకున్నారు. తొలి, మలి దశ ఉద్యమంలో తెలంగాణ అస్థిత్వం కోసం ఎన్నో రచనలు చేశారు. ఉద్యమ సమయంలో
దాశరథి పురస్కారానికి వేణు సంకోజు ఎంపిక
నీలగిరి, మోత్కూరు- న్యూస్టుడే: నెహ్రూ మరణ వార్త విన్న వేణు సంకోజు తన ఆవేదనను అక్షర రూపంగా మలిచారు. అప్పటి నుంచి కవితలపై ఆసక్తి పెంచుకున్నారు. తొలి, మలి దశ ఉద్యమంలో తెలంగాణ అస్థిత్వం కోసం ఎన్నో రచనలు చేశారు. ఉద్యమ సమయంలో సాహిత్యపరంగా ఆయన చేసిన సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ ఏడాదికి ప్రజా కవి దాశరథి కృష్ణామాచార్య పురస్కారానికి నల్గొండ జిల్లాకు చెందిన కవి రచయిత, విశ్రాంత అధ్యాపకుడు వేణు సంకోజును ఎంపిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాశరథి జయంతి సందర్భంగా ఈ నెల 22న హైదరాబాద్లోని రవీంద్రభారతిలో పురస్కారం కింద ఆయనకు రూ.1,01,116 అందజేయనున్నారు.
నల్గొండ జిల్లా చండూరుకు చెందిన వేణు సంకోజు విద్యాభ్యాసం హైదరాబాద్లోనే జరిగింది. ఎంఏ రాజనీతి శాస్త్రంలో ఎంఫిల్ పూర్తి చేశారు. డిప్లొమా ఇన్ జర్నలిజం చేశారు. 1969 ఉద్యమంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. తొలి సంపుటి ‘‘మనిషిగా పూచే మట్టి’’ని 1995లో కాళోజీ నారాయణరావు ఆవిష్కరించారు. ఉద్యమ సమయంలో, కాళోజీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రతి నెలా కాళోజీ రచనలపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రచయితల సంఘం ప్రారంభించారు. సాహిత్య కార్యక్రమాలు తన ఇంట్లో నిర్వహించారు. నవ రచయితలకు మెలకువలు చెబుతూ ప్రోత్సహించారు. విద్యార్థులకు సాహిత్యం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఉద్యమంలో సాహిత్య సాంస్కృతిక రంగాలను ఏకం చేస్తూ ప్రత్యేక భూమిక పోషించారు. అధ్యాపకుడిగా పనిచేస్తూనే 12 పుస్తకాలు రాసి అచ్చు వేయించారు. వివిధ సాహితీ సంస్థలకు మార్గ దర్శనం చేస్తూ రచయితలకు అండగా నిలిచారు. సాహిత్యంపై అభిరుచి ఉన్న విద్యార్థులను రచయితలుగా ప్రోత్సహిస్తూ వారు రాసిన కవితలతో ‘చలనం’ ప్రత్యేక సంచికను తీసుకొచ్చారు.
ఆనందంగా ఉంది -వేణు సంకోజు
గొప్ప కవి దాశరథి కృష్ణామాచార్య అవార్డును తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. దాశరథి గొప్ప స్థాయి కలిగిన వ్యక్తులు. ఆయన పేరు మీద రావడం సంతోషంగా ఉంది. చిన్నతనం నుంచే దాశరథి, సి.నారాయణరెడ్డి కవిత్వాలు ఆకర్షించాయి. కవి అంటే ఎలా ఉండాలో వారు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సృజనాత్మకతకు, సంస్కృతికి తగిన గౌరవం ఇచ్చింది. సాంస్కృతిక పరమైన పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ప్రతి రోజు కవితలు రాస్తాను. అవి రాశాకే భోజనం చేస్తాను.
ఆవిష్కరణలు.. రచనలు
* తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2 నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాల రచనల సిలబస్ రచన కమిటీ సభ్యుడిగా కీలక భూమిక పోషించారు. తెలుగు అకాడమీ ప్రచురించే ఇంటర్మీడియట్, డిగ్రీ తరగతుల కోసం పాఠ్యాంశాల రచనలు చేశారు.
* 1984లో ‘‘జయమిత్ర’’ సాహిత్య సాంస్కృతిక వేదిక స్థాపించారు. ఆ సంస్థ ద్వారా 100కుపైగా రచనలు ప్రచురించడమే కాకుండా 150 పుస్తకాలను ఆవిష్కరించారు. వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు.
* 1995లో తొలి సంపుటి ‘మనిషి పూచే మట్టి’ని కాళోజీ నారాయణరావు ఆవిష్కరించారు.
* 2001లో మనం కవితా సంపుటిని ఆవిష్కరించారు.
* 2008లో నేల కల, ప్రాణప్రదమైన, సర్శ కథల సంపుటి
* సుద్దాల హనుమంతు జీవిత చరిత్ర పుస్తకాన్ని రచించారు.
* విద్యార్థులతో ‘చలనం’ అనే కథా సంపుటిని తీసుకొచ్చారు.
* తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సేవా పురస్కారం. కాళోజీ శతజయంతి ఉత్సవాల్లో కాళోజీ పురస్కారం లభించింది. ప్రస్తుతం దాశరథి కృష్ణామాచార్య అవార్ఢు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస దిల్లీలో లేదు గల్లీలో లేదు
[ 02-05-2024]
భారాస పార్టీ గల్లీలో లేదు దిల్లీలో లేదని ఆ పార్టీకి ఇక భవిష్యత్తు ఉండదని భాజపా భువనగిరి లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. -
బకాయిదారులే తెరుచుకున్నాయ్!
[ 02-05-2024]
ఉమ్మడి జిల్లాలో 2022-23 రెండు సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ ధాన్యం తీసుకుని కోట్ల రూపాయల బియ్యం ఇవ్వకుండా పౌరసరఫరాల అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న మిల్లర్లు ఉన్నారు. -
గుర్తుల గుబులు
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారం ముగియడంతో.. ప్రధాన పార్టీల అభ్యర్థులకు గుర్తుల గుబులు పట్టుకుంది. -
శిక్షణకు సిద్ధం
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ అధికారులు, సిబ్బందికి రెండో విడత శిక్షణ కార్యక్రమం ఈ నెల 2 నుంచి 4 వరకు నిర్వహించనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో శిక్షణ తరగతులు ఏర్పాటు చేయనున్నారు. -
ఓట్ల ఆధారంగానే పార్టీలకు గుర్తింపు
[ 02-05-2024]
మనం తరచూ జాతీయ, ప్రాంతీయ పార్టీలు అంటూ వింటుంటాం. ఎన్నికల సమయంలో నేతలు ఎక్కువగా వీటిని ప్రస్తావిస్తుంటారు. జాతీయ పార్టీలు అంటే దిల్లీ కేంద్రంగా పనిచేస్తాయని, ప్రాంతీయ పార్టీలు స్థానిక సమస్యలను పరిష్కరిస్తుంటాయని చెబుతుంటారు. -
ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ
[ 02-05-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చిన మేరకు ఆగస్టు 15లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. -
సినీ ఫక్కీలో ఎల్లయ్య హత్య
[ 02-05-2024]
గత నెల 19న ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు వచ్చి అదృశ్యమైనట్లు కేసు నమోదైన సూర్యాపేట మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్యను కొంతమందితో కలిసి హత్య చేసినట్లు సూర్యాపేట జిల్లాకు చెందిన తాడూరి శ్రీకాంతరాజు (చారి) ఒప్పుకొన్నారు. -
పోలీసులకూ అనుమతి లేదు సుమా..!
[ 02-05-2024]
మొత్తం ఎన్నికల నిర్వహణలో పోలీసులది కీలకపాత్ర. దాదాపు ఎన్నికల ప్రక్రియలో అన్ని చోట్లా వారి జోక్యం ఉంటుంది. ఎన్నికల ప్రచారాలకు, సభలకు, ర్యాలీలకు వారి అనుమతులు తప్పనిసరి. -
ఎండ వేఢీ.. చిక్కని ఓటరు నాడి
[ 02-05-2024]
శారీరక శ్రమకు అలవాటు పడి.. ప్రతి నిత్యం పనిలో నిమగ్నమై.. స్వేదం చిందించే కార్మికులను, కర్షకులను సైతం ఈ ఏడాది ఎండలు హడలెత్తిస్తున్నాయి. -
ఆయుధాలు అప్పగించారు..!
[ 02-05-2024]
వ్యక్తిగత భద్రత కోసం లైసెన్సు తీసుకొని వెంట ఉంచుకున్న ఆయుధాలను ఉమ్మడి నల్గొండ జిల్లావాసులు ఠాణాలకు అప్పగించారు. -
ఆరో తరగతిలో వేయి పడగలు నవల చదివా
[ 02-05-2024]
మాది భువనగిరి. 12వ తరగతి వరకు అక్కడే చదివాను. ఆరో తరగతి చదివే రోజుల్లో వేసవి సెలవులొస్తే స్నేహితులు యంజాల గోపాల్, బుద్దగిరి లక్ష్మీనర్సయ్య, చల్ల కృష్ణలతో కలిసి నార్ఖాన్ బావికి ఈతకు వెళ్లేవాళ్లం. -
నీలగిరి.. నిప్పుల కొలిమి!
[ 02-05-2024]
భానుడి భగభగలతో ఉమ్మడి జిల్లా నిప్పుల కుంపటిలా మారుతోంది. రోజురోజుకీ రాష్ట్రంలోనే అత్యధికంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రతిభా అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
[ 02-05-2024]
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న ప్రతిభా అవార్డులు ప్రదానం చేయనున్నట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ సోషల్ సైంటిస్ట్ డబ్ల్యూజీ ప్రసన్నకుమార్ తెలిపారు. -
పేరు చెప్పనందుకు ఓటు కట్
[ 02-05-2024]
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక 1951లో ఓటర్ల నమోదు చేపట్టారు. అప్పట్లో 21 సంవత్సరాలు నిండిన అందరికీ ఓటు హక్కును రాజ్యాంగం కల్పించింది. -
పోలింగ్ కేంద్రాల్లో అధికారుల నంబర్లు
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల్లో కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. బయట గోడలపై పోలింగ్ కేంద్రం, లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గ నంబర్లు వేస్తున్నారు. -
18 ఏళ్లకు ఓటుహక్కు ఎప్పుడు కల్పించారంటే..!
[ 02-05-2024]
1952లో సాధారణ ఎన్నికల సందర్భంగా అధికరణ 326 ద్వారా సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించారు. దీని ద్వారా 21 ఏళ్లు పైబడిన వారు ఓటు హక్కును వినియోగించుకునేవారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం
-
అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్ షురూ.. స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు ఇవిగో..