వీఆర్వోలకు ప్రత్యేక బాధ్యతలు
ఇటీవల పురపాలికలకు నియమితులైన వీఆర్వోలకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,242 వార్డు అధికారుల పోస్టులను ప్రకటించింది. వీటిలో 280 మాత్రమే భర్తీ చేయనుంది.
సూర్యాపేటలోని మున్సిపల్ కార్యాలయంలో శిక్షణలో పాల్గొన్న వీఆర్వోలు (పాత చిత్రం)
సూర్యాపేట పురపాలిక, న్యూస్టుడే: ఇటీవల పురపాలికలకు నియమితులైన వీఆర్వోలకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,242 వార్డు అధికారుల పోస్టులను ప్రకటించింది. వీటిలో 280 మాత్రమే భర్తీ చేయనుంది. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్, సీనియర్ అకౌంటెంట్, సీనియర్ అసిస్టెంటు, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను ప్రకటించింది. కొత్తగా ఏర్పడిన పురపాలికల్లో ఖాళీగా ఉన్న కొన్ని పోస్టుల్లోనూ వీఆర్వోలను నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది. సూర్యాపేట జిల్లాలోని వివిధ పురపాలికలకు 31 మందిని సర్దుబాటు చేశారు. అత్యధికంగా నేరేడుచర్లకు 10 మందిని సర్దుబాటు చేయగా హుజూర్నగర్లో ఇద్దరు నియమితులయ్యారు. వార్డు అధికారుల పోస్టులు మంజూరైనా, అన్నింటినీ ప్రస్తుతం భర్తీ చేయడం లేదు. పాత పురపాలికల్లో ఖాళీగా ఉన్న కొన్ని పోస్టుల్లో వీఆర్వోలను నియమించింది.
నియామకం ఇలా
* సూర్యాపేట పురపాలికలో 48 వార్డులు ఉన్నాయి. పూర్తిస్థాయిలో వార్డు అధికారులను నియమించలేదు. ఇక్కడికి సర్దుబాటైన ఆరుగురు వీఆర్వోలకు నలుగురిని జూనియర్ అసిస్టెంట్లుగా నియమించారు. మిగతా ఇద్దరు సెలవులో ఉండటంతో వారికి విధులు కేటాయించలేదు.
* కోదాడలో 35 వార్డులు ఉన్నాయి. ఇక్కడికి నలుగురు వీఆర్వోలను సర్దుబాటు చేశారు. ఇద్దరిని వార్డు అధికారులుగా, మరో ఇద్దరిని జూనియర్ అసిస్టెంట్లుగా సర్దుబాటు చేశారు.
* తిరుమలగిరిలో 15 వార్డులు ఉండగా 9 మందికి వార్డు అధికారులుగా, ముగ్గురికి జూనియర్ అసిస్టెంట్లుగా బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ పూర్తిస్థాయిలో వార్డు అధికారులు లేరు.
* నేరేడుచర్లలో 15 వార్డులు ఉండగా పురపాలికకు 10 మంది వీఆర్వోలను కేటాయించారు. నలుగురికి జూనియర్ అసిస్టెంట్లుగా, ఆరుగురికి వార్డు అధికారులుగా కేటాయించారు. పూర్తిస్థాయిలో మాత్రం వార్డు అధికారులు లేరు.
* హుజూర్నగర్లో 28 వార్డులు ఉన్నాయి. ఈ పురపాలికకు ఇద్దరు వీఆర్వోలను కేటాయించగా వారిని జూనియర్ అసిస్టెంట్లుగా సర్దుబాటు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో.. ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలతో పాటూ ఈ ఎన్నిక గెలుపుపైనా దృష్టి సారించాయి. -
ఇంటింటికీ పోల్ చిట్టీలు..!
[ 27-04-2024]
ఓటు వేసేందుకు ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఓటర్లందరికీ ప్రత్యేకంగా పోల్ చిట్టీలు పంపిణీ చేస్తోంది. -
పురంపై సైబర్ ఉచ్చు..!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో రాకేశ్ అనే వ్యాపారికి ఈ నెల 21న సాయంత్రం సెల్ నంబరు 63054 68441 నుంచి ఫోన్ కాల్ వచ్చింది. -
మామిడీలా
[ 27-04-2024]
మామిడి.. భారతదేశపు పండుగా గుర్తింపు పొందింది. ప్రపంచ ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో ఉంది. ఇది నిన్నామొన్నటి మాట. -
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాడు: రాజగోపాల్రెడ్డి
[ 27-04-2024]
రాబోయే నాలుగేళ్లలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తానని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
పద తమ్ముడూ.. పార్టీ మారుదాం!
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీల క్యాడర్ స్వరూపం మారిపోతోంది. రాజకీయ సమీకరణాలూ శరవేగంగా మారుతున్నాయి. -
సమగ్ర సమాచార మార్గదర్శి
[ 27-04-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక రకాల చర్యలు చేపడుతోంది. -
‘గుర్తు’ తెచ్చుకుందాం..రండి
[ 27-04-2024]
రాజకీయ పార్టీల ఉనికిని చాటేది వాటి గుర్తులే. గుర్తుల ఆధారంగానే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించడమే కాకుండా ఓటర్లు ఓటు వేస్తుంటారు. -
ప్రజల మనిషి ధర్మభిక్షం
[ 27-04-2024]
మునుగోడు మండలం ఊకొండిలో కల్లుగీత వృత్తి పని చేసుకునే ధర్మభిక్షం కుటుంబం సూర్యాపేటకు వలసవెళ్లి అక్కడే స్థిరపడింది. -
ఈతకెళ్లి తండ్రీతనయుల మృతి
[ 27-04-2024]
నీటి ప్రమాదాల నుంచి తప్పించుకునేలా తన ఇద్దరు కుమారులకు ఈత నేర్పాలని భావించిన ఆ తండ్రి. -
అవార్డుల ఉపాధ్యాయుడు ఆదె..!
[ 27-04-2024]
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా రెండు దశాబ్దాల నుంచి చిన్నారులకు విద్యాబోధన అందించటమే కాకుండా సమాజంలో విద్యాభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు ఆదె సత్యనారాయణ. -
వీడని మిస్టరీ..!
[ 27-04-2024]
ఈ నెల 18 నుంచి కనిపించకుండా పోయిన సూర్యాపేట మండలం యల్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్య కేసు మిస్టరీ వీడటం లేదు. -
చివరికి మొగి పురుగు దాడి
[ 27-04-2024]
ఈ సీజన్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు ఆలస్యంగా విడుదల కావడంతో తుంగతుర్తి నియోజకవర్గంలో 40 శాతం వరి సాగు జనవరి మాసంలో చేపట్టారు. -
వేతనాలు రాక టీఏల ఇబ్బందులు
[ 27-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి పనులను చూపిస్తూ విధులు నిర్వహిస్తున్న సాంకేతిక సహాయకుల ( టెక్నికల్ అసిస్టెంట్లు)కు రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
బరిలో..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం జరిగిన నామపత్రాల పరిశీలన కార్యక్రమంలో నల్గొండ లోక్సభ పరిధిలో 25 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా లేకపోవడంతో తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు.