అమ్మకు భరోసా..!
పదేళ్ల క్రితం వరకు రాష్ట్రంలో ప్రతి లక్ష కాన్పులకు సుమారు వంద మంది వరకు బాలింతలు వివిధ ఆరోగ్యపరమైన కారణాలతో మృత్యువాత పడేవారు. దీంతో వారి పిల్లలు తల్లిలేక అనాథలుగా మారిపోయి.. పరిస్థితి దయనీయంగా ఉండేది.
తగ్గిపోతున్న మాతృ మరణాల సంఖ్య
మిర్యాలగూడ, న్యూస్టుడే
మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రి ప్రసవాల వార్డులో బాలింతలు
పదేళ్ల క్రితం వరకు రాష్ట్రంలో ప్రతి లక్ష కాన్పులకు సుమారు వంద మంది వరకు బాలింతలు వివిధ ఆరోగ్యపరమైన కారణాలతో మృత్యువాత పడేవారు. దీంతో వారి పిల్లలు తల్లిలేక అనాథలుగా మారిపోయి.. పరిస్థితి దయనీయంగా ఉండేది. ఏటా ఈ మరణాల సంఖ్య పెరుగుతూ పోతుండటంతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయి. పలు చర్యలు తీసుకుని వీటిని తగ్గించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి.
ప్రభుత్వ కార్యక్రమాలతో..
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య ఆరోగ్యంపై దృష్టిసారించి పలు కార్యక్రమాలు రూపొందించింది. గ్రామాల్లో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలతో,అంగన్వాడీలతో మహిళలు గర్భం దాల్చిన సమాచారం పక్కాగా సేకరిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులకు ప్రతిరోజు గుడ్డు, పౌష్టికాహారం అందించే ఏర్పాటు చేశారు. గర్భం దాల్చినప్పటి నుంచి కనీసం మూడుసార్లు ఆసుపత్రిలో చూపించుకునేలా ఆశ కార్యకర్తలు పర్యవేక్షిస్తున్నారు.
* కేసీఆర్ కిట్ పేరుతో రూపొందించిన పథకంతో మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి పిల్లలు పుట్టి టీకాలు పూర్తి అయ్యేంత వరకు వివిధ దశల్లో రూ.12 వేలు (అబ్బాయిపుడితే), రూ.13 వేలు (అమ్మాయి పుడితే) చెల్లింపులు జరుపుతున్నారు. దీంతో పాటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పు అయిన వారికి కేసీఆర్ కిట్తో సామగ్రి ఇస్తుండగా శిశువులకు తగిన ప్రాథమిక సేవలు అందుతున్నాయి.
* ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా గర్భిణుల వివరాలు నిరంతరం పర్యవేక్షిస్తూ వారికి అవసరమైన వైద్యసేవలు అందిస్తున్నారు. రక్తహీనత ఉన్నవారికి తగిన వైద్యసేవలు, మందులు ఇస్తున్నారు.
* ఇళ్ల వద్ద కాన్పులు చేయకుండా గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేలా ఆశకార్యకర్తలు, ఏఎన్ఎంలు పర్యవేక్షిస్తున్నారు.
* ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులకు ఆరోగ్య అవగాహన పెరగటం, కేసీఆర్ కిట్ , ఆర్థిక సాయం కారణంగా ఆసుపత్రుల్లోనే కాన్పులు అధికంగా జరుగుతున్నాయి. తల్లికి, శిశువుకు మెరుగైన వైద్యం అందిస్తున్నందున మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతుందని నల్గొండ జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి ఏ.కొండల్రావు తెలిపారు.
మాతా మరణాలకు కారణాలివే..
సరైన వైద్య సౌకర్యాలు లేకపోవటం, గ్రామ స్థాయిలో గర్భిణులు పౌష్టికాహారం తీసుకోక పోవటం, గ్రామాల్లో గర్భం దాల్చినప్పటి నుంచి తగిన రీతిలో వైద్యసేవలు అందించక పోవటం, పేదరికం కారణంగా ఆసుపత్రులకు వెళ్లలేక పోవటం, చాలా వరకు కాన్పులు ఇళ్లవద్దనే జరుగుతుండటం, మహిళలు 30 ఏళ్ల వయసు పైబడిన తరువాత గర్భం దాల్చుతుండటం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో.. ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలతో పాటూ ఈ ఎన్నిక గెలుపుపైనా దృష్టి సారించాయి. -
ఇంటింటికీ పోల్ చిట్టీలు..!
[ 27-04-2024]
ఓటు వేసేందుకు ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఓటర్లందరికీ ప్రత్యేకంగా పోల్ చిట్టీలు పంపిణీ చేస్తోంది. -
పురంపై సైబర్ ఉచ్చు..!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో రాకేశ్ అనే వ్యాపారికి ఈ నెల 21న సాయంత్రం సెల్ నంబరు 63054 68441 నుంచి ఫోన్ కాల్ వచ్చింది. -
మామిడీలా
[ 27-04-2024]
మామిడి.. భారతదేశపు పండుగా గుర్తింపు పొందింది. ప్రపంచ ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో ఉంది. ఇది నిన్నామొన్నటి మాట. -
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాడు: రాజగోపాల్రెడ్డి
[ 27-04-2024]
రాబోయే నాలుగేళ్లలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తానని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
పద తమ్ముడూ.. పార్టీ మారుదాం!
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీల క్యాడర్ స్వరూపం మారిపోతోంది. రాజకీయ సమీకరణాలూ శరవేగంగా మారుతున్నాయి. -
సమగ్ర సమాచార మార్గదర్శి
[ 27-04-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక రకాల చర్యలు చేపడుతోంది. -
‘గుర్తు’ తెచ్చుకుందాం..రండి
[ 27-04-2024]
రాజకీయ పార్టీల ఉనికిని చాటేది వాటి గుర్తులే. గుర్తుల ఆధారంగానే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించడమే కాకుండా ఓటర్లు ఓటు వేస్తుంటారు. -
ప్రజల మనిషి ధర్మభిక్షం
[ 27-04-2024]
మునుగోడు మండలం ఊకొండిలో కల్లుగీత వృత్తి పని చేసుకునే ధర్మభిక్షం కుటుంబం సూర్యాపేటకు వలసవెళ్లి అక్కడే స్థిరపడింది. -
ఈతకెళ్లి తండ్రీతనయుల మృతి
[ 27-04-2024]
నీటి ప్రమాదాల నుంచి తప్పించుకునేలా తన ఇద్దరు కుమారులకు ఈత నేర్పాలని భావించిన ఆ తండ్రి. -
అవార్డుల ఉపాధ్యాయుడు ఆదె..!
[ 27-04-2024]
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా రెండు దశాబ్దాల నుంచి చిన్నారులకు విద్యాబోధన అందించటమే కాకుండా సమాజంలో విద్యాభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు ఆదె సత్యనారాయణ. -
వీడని మిస్టరీ..!
[ 27-04-2024]
ఈ నెల 18 నుంచి కనిపించకుండా పోయిన సూర్యాపేట మండలం యల్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్య కేసు మిస్టరీ వీడటం లేదు. -
చివరికి మొగి పురుగు దాడి
[ 27-04-2024]
ఈ సీజన్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు ఆలస్యంగా విడుదల కావడంతో తుంగతుర్తి నియోజకవర్గంలో 40 శాతం వరి సాగు జనవరి మాసంలో చేపట్టారు. -
వేతనాలు రాక టీఏల ఇబ్బందులు
[ 27-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి పనులను చూపిస్తూ విధులు నిర్వహిస్తున్న సాంకేతిక సహాయకుల ( టెక్నికల్ అసిస్టెంట్లు)కు రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
బరిలో..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం జరిగిన నామపత్రాల పరిశీలన కార్యక్రమంలో నల్గొండ లోక్సభ పరిధిలో 25 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా లేకపోవడంతో తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు.