చేతికందే స్థితి నుంచి చేదుకునే వరకు..!
జోరుగా సాగు.. అతిగా బోర్ల వినియోగం.. పైగా వేసవి కాలం.. ఫలితం భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో పడిపోతున్న భూగర్భజలాలు
సూర్యాపేట కలెక్టరేట్, న్యూస్టుడే: జోరుగా సాగు.. అతిగా బోర్ల వినియోగం.. పైగా వేసవి కాలం.. ఫలితం భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. ప్రజలు ఈ విషయం గమనించి బోర్ల వినియోగాన్ని తగ్గించినట్లయితే ఈ పరిస్థితి నుంచి కాస్తయినా బయటపడే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు బాగానే కురియడంతో భూగర్భ జలాలు ఆశించిన స్థాయిలో ఉంటాయనుకున్నారు. కానీ రెండు నెలలుగా పరిస్థితి తలకిందులైంది. గత ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే పరిస్థితి దారుణంగా ఉంది. ఇంకొంతకాలం వ్యవసాయానికి బోర్ల వినియోగం ఉండటంతో ఇంకా తగ్గు ముఖం పట్టే అవకాశం ఉంది.
* ఉమ్మడి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాకాలంలో బావుల్లో చేతికందే స్థాయిలో నీరు ఉంది. అయితే యాసంగి ఆరంభం నుంచే తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం నీటిని చేదుకోవాల్సిన దుస్థితి నెలకొంది. బోర్లలో సైతం ఉబికివచ్చిన నీరు ప్రస్తుతం ఆగిఆగి వస్తున్నాయి. దీంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు.
* సూర్యాపేట జిల్లాలోని నూతనకల్, నాగారం మండలాల్లో భూగర్భ నీటి మట్టాలు దారుణంగా పడిపోయాయి. గత ఏడాది నాగారంలో 2.75 మీటర్ల లోతులో ఉండగా ప్రస్తుతం 11.19 మీటర్లకు పడిపోయాయి. నూతనకల్ మండలంలో సైతం అదే స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది 4.05 మీటర్ల లోతులో ఉండగా.. ప్రస్తుతం 11.16 మీటర్ల లోతులో ఉన్నాయి. జిల్లాలో భూగర్భ జలాలు తగ్గుతూ వస్తున్నాయని, భవిష్యత్తులో ఇంకా తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నల్గొండ జిల్లాలోని దేవరకొండ, నకిరేకల్, మునుగోడు ప్రాంతాల్లో సైతం అదే పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. యాదాద్రి జిల్లాలో తుర్కపల్లి, అడ్డగూడురు, రాజపేట మండలాల్లో నీటి మట్టం పడిపోయింది.
తాగునీటికి ఇబ్బందులు తప్పవా!
గ్రామీణ ప్రాంతాలు బోర్లపై ఆధారపడటంతో..ఈ సారి తాగునీటికి ఇబ్బందులు తప్పేలా లేదని తెలుస్తోంది. మరో రెండు నెలల్లో బోర్లు చాలా వరకు ఎండిపోయే పరిస్థితి. అధికారులు ఇప్పటి నుంచే మిషన్ భగీరథ నీటి ద్వారా తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కసరత్తు చేస్తున్నారు. వరికి సైతం మరో కొద్ది రోజులు నీటిని పెట్టాల్సి ఉంది. బోర్ల ఆగి పోస్తుండటంతో పూర్తి స్థాయిలో పొలానికి నీరు సరిపోని పరిస్థితి నెలకొంది. దీంతో చేసేది లేక చివరి పొలాన్ని వదిలేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో గత ఏడాది, ప్రస్తుత మార్చి నెలలో నీటి మట్టం వివరాలు (మీటర్లలో)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో.. ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలతో పాటూ ఈ ఎన్నిక గెలుపుపైనా దృష్టి సారించాయి. -
ఇంటింటికీ పోల్ చిట్టీలు..!
[ 27-04-2024]
ఓటు వేసేందుకు ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఓటర్లందరికీ ప్రత్యేకంగా పోల్ చిట్టీలు పంపిణీ చేస్తోంది. -
పురంపై సైబర్ ఉచ్చు..!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో రాకేశ్ అనే వ్యాపారికి ఈ నెల 21న సాయంత్రం సెల్ నంబరు 63054 68441 నుంచి ఫోన్ కాల్ వచ్చింది. -
మామిడీలా
[ 27-04-2024]
మామిడి.. భారతదేశపు పండుగా గుర్తింపు పొందింది. ప్రపంచ ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో ఉంది. ఇది నిన్నామొన్నటి మాట. -
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాడు: రాజగోపాల్రెడ్డి
[ 27-04-2024]
రాబోయే నాలుగేళ్లలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తానని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
పద తమ్ముడూ.. పార్టీ మారుదాం!
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీల క్యాడర్ స్వరూపం మారిపోతోంది. రాజకీయ సమీకరణాలూ శరవేగంగా మారుతున్నాయి. -
సమగ్ర సమాచార మార్గదర్శి
[ 27-04-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక రకాల చర్యలు చేపడుతోంది. -
‘గుర్తు’ తెచ్చుకుందాం..రండి
[ 27-04-2024]
రాజకీయ పార్టీల ఉనికిని చాటేది వాటి గుర్తులే. గుర్తుల ఆధారంగానే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించడమే కాకుండా ఓటర్లు ఓటు వేస్తుంటారు. -
ప్రజల మనిషి ధర్మభిక్షం
[ 27-04-2024]
మునుగోడు మండలం ఊకొండిలో కల్లుగీత వృత్తి పని చేసుకునే ధర్మభిక్షం కుటుంబం సూర్యాపేటకు వలసవెళ్లి అక్కడే స్థిరపడింది. -
ఈతకెళ్లి తండ్రీతనయుల మృతి
[ 27-04-2024]
నీటి ప్రమాదాల నుంచి తప్పించుకునేలా తన ఇద్దరు కుమారులకు ఈత నేర్పాలని భావించిన ఆ తండ్రి. -
అవార్డుల ఉపాధ్యాయుడు ఆదె..!
[ 27-04-2024]
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా రెండు దశాబ్దాల నుంచి చిన్నారులకు విద్యాబోధన అందించటమే కాకుండా సమాజంలో విద్యాభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు ఆదె సత్యనారాయణ. -
వీడని మిస్టరీ..!
[ 27-04-2024]
ఈ నెల 18 నుంచి కనిపించకుండా పోయిన సూర్యాపేట మండలం యల్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్య కేసు మిస్టరీ వీడటం లేదు. -
చివరికి మొగి పురుగు దాడి
[ 27-04-2024]
ఈ సీజన్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు ఆలస్యంగా విడుదల కావడంతో తుంగతుర్తి నియోజకవర్గంలో 40 శాతం వరి సాగు జనవరి మాసంలో చేపట్టారు. -
వేతనాలు రాక టీఏల ఇబ్బందులు
[ 27-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి పనులను చూపిస్తూ విధులు నిర్వహిస్తున్న సాంకేతిక సహాయకుల ( టెక్నికల్ అసిస్టెంట్లు)కు రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
బరిలో..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం జరిగిన నామపత్రాల పరిశీలన కార్యక్రమంలో నల్గొండ లోక్సభ పరిధిలో 25 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా లేకపోవడంతో తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే
-
పవన్కల్యాణ్కు మద్దతుగా వరుణ్తేజ్ ప్రచారం