logo

Alair: భారాస ఎమ్మెల్యే సునీత ప్రచార ర్యాలీలో తేనెటీగల దాడి

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో నిర్వహించిన భారాస ప్రచార ర్యాలీలో తేనెటీగలు దాడి చేశాయి.

Published : 04 Nov 2023 12:18 IST

ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో నిర్వహించిన భారాస ప్రచార ర్యాలీలో తేనెటీగలు దాడి చేశాయి. ఆలేరు అభ్యర్థి, ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో ప్రచార రథంపై ఉన్న ఆమె అప్రమత్తమై తన వాహనంలోకి వెళ్లి కూర్చున్నారు. కాసేపటి తర్వాత ప్రచారం కొనసాగించారు. తేనెటీగల దాడిలో ఇద్దరు వ్యక్తులకు స్వల్పంగా గాయాలైనట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని