logo

భారాస అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి

భువనగిరి పట్టణంలో జిల్లా భారాస పార్టీ కార్యాలయంలో పట్టణ బూత్ కమిటీల సమావేశం ఏర్పాటు చేశారు.

Updated : 04 May 2024 17:03 IST

భువనగిరి: భువనగిరి పట్టణంలో జిల్లా భారాస పార్టీ కార్యాలయంలో పట్టణ బూత్ కమిటీల సమావేశం ఏర్పాటు చేశారు. భారాస పట్టణ అధ్యక్షుడు ఏవీ కిరణ్ కుమార్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు, డాక్టర్ జడల అమరేందర్, రైతుబంధు సమితి అధ్యక్షుడు కొలుపుల అమరేందర్ మాట్లాడుతూ.. భారాస ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఆదివారం నుంచి ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్య నాయకులు ఎనబోయిన ఆంజనేయులు, రచ్చ శ్రీనివాస్, సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, చింతల క్రిస్టియ్య ఎండీ అజీమ్, కడారి వినోద్, కో ఆప్షన్ నెంబర్లు, అన్ని బూత్‌ల నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని