logo

చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలి

కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కొరకు బస్టాండ్ ఏరియాలో ప్రచారం చేపట్టారు.

Updated : 04 May 2024 17:04 IST

భువనగిరి: కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కొరకు బస్టాండ్ ఏరియాలో ప్రచారం చేపట్టారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల కార్డు ప్రతి ఇంటికి పంపిణీ చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌ రెడ్డిని గెలిపించాలన్నారు.  సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు పిట్టల బాలరాజ్, పీసీసీ జనరల్ సెక్రెటరీ పోత్నక్ ప్రమోద్ కుమార్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ బర్రె జహంగీర్, అసెంబ్లీ కోఆర్డినేటర్ సోమ రవీందర్‌ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని