వాడే ముందు జాగ్రత్త
రోడ్డు ప్రమాదంలో కోదాడ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కాలికి స్వల్ప గాయమవడంతో పట్టణంలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ కాలపరిమితి దాటిన బ్యాండేజీ కాలుకి కట్టడంతో వాపు తగ్గలేదు.
ఇటీవల కోదాడలో డ్రగ్ అధికారులు తనిఖీలు నిర్వహించగా బయటపడిన కాలం చెల్లిన మందులు
రోడ్డు ప్రమాదంలో కోదాడ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కాలికి స్వల్ప గాయమవడంతో పట్టణంలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ కాలపరిమితి దాటిన బ్యాండేజీ కాలుకి కట్టడంతో వాపు తగ్గలేదు. దీంతో సదరు వ్యక్తి కాలం చెల్లిన బ్యాండేజీ ఇచ్చారని ఆస్పత్రి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా, వారు నిర్లక్ష్యం వహించారు. ఇదే విషయం జిల్లా డ్రగ్ అధికారులకు తెలియడంతో వారు తనిఖీలు నిర్వహించగా సుమారు రూ.12 లక్షల విలువైన మందులు పట్టుబడ్డాయి. వీటిలో అధికారుల అనుమతి లేని, కాలం చెల్లిన మందులు ఉన్నాయి.
కోదాడ, న్యూస్టుడే: కాలపరిమితి అయినపోయిన వస్తువును వాడితే వ్యర్థమే. అలాంటిది రోగం వస్తే కాపాడాల్సిన ఔషధాల్లో కూడా కాలం చెల్లినవి విక్రయిస్తున్న ఘటనలు ఉన్నాయి. ఆ మందులను వినియోగిస్తే రోగం తగ్గకపోగా అదనంగా మరింత అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. ఇటీవల కోదాడలో డ్రగ్ అధికారులు తనిఖీలు చేసి పలు దుకాణాల్లో సుమారు రూ.40 లక్షలకు పైగా విలువైన మందులను సీజ్ చేశారు. వీటిలో 70 శాతం మందులు కాలం చెల్లినవే కావడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా అధికారులు తనిఖీలు నిర్వహిస్తే మరిన్ని దుకాణాల్లో ఇలాంటి మందులు దొరికే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి కాలం చెల్లిన మందులను విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
చెరిపేసి విక్రయం: కొందరు ఆస్పత్రుల నిర్వాహకులు లేజర్ గన్ల ద్వారా మెడికల్ షీట్ మీద ఉన్న వివరాలు చెరిపేసి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆస్పత్రుల పరిధిలో నడిచే మెడికల్ దుకాణాల్లోనే ఇలాంటి వ్యవహారం ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో ఇచ్చే మందులను రోగులు వెంటనే వినియోగిస్తారనే నమ్మకంతోనే ఈ వ్యవహారం గుట్టుగా జరుగుతోంది.
కాలం చెల్లిన మందులు గ్రామాల్లోకి
కాలం చెల్లిన మందులు పట్టణాల్లో కంటే గ్రామాల్లో ఎక్కువగా విక్రయిస్తున్నారు. ఆర్ఎంపీ వైద్యుల్లో ఎక్కువగా ఈ మందులనే వాడుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. కొన్ని దుకాణాల్లో రెండు రకాల మందులు ఉంటాయని, కొనే వారిని బట్టి అమ్మకాలు ఉంటాయనే ఆరోపణలు ఉన్నాయి. పట్టణాల్లో నివసించే ప్రజలకు మెడిసిన్ చివరి తేదీ చూసి ఇస్తారు. గ్రామాల్లో ప్రజలకు ఈ వ్యవహారం తెలియక ఆ మందులు వాడే అవకాశం ఉంది.
కఠిన చర్యలు తీసుకుంటాం
దాసు, అసిస్టెంట్ డైరెక్టర్, డ్రగ్ కంట్రోల్ డిపార్టుమెంట్, ఉమ్మడి నల్గొండ
ఇటీవల కోదాడ పట్టణంలో తనిఖీలు నిర్వహించగా పలు దుకాణాలల్లో కాలం చెల్లిన మందులు దొరికాయి. కాలం చెల్లిన మందులు విక్రయించి ప్రజల ప్రాణాల ముప్పునకు కారణమయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. దుకాణాల్లో కాలం చెల్లిన మందులు విక్రయిస్తే స్థానికులు నేరుగా మాకు ఫిర్యాదు చేయవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో.. ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలతో పాటూ ఈ ఎన్నిక గెలుపుపైనా దృష్టి సారించాయి. -
ఇంటింటికీ పోల్ చిట్టీలు..!
[ 27-04-2024]
ఓటు వేసేందుకు ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఓటర్లందరికీ ప్రత్యేకంగా పోల్ చిట్టీలు పంపిణీ చేస్తోంది. -
పురంపై సైబర్ ఉచ్చు..!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో రాకేశ్ అనే వ్యాపారికి ఈ నెల 21న సాయంత్రం సెల్ నంబరు 63054 68441 నుంచి ఫోన్ కాల్ వచ్చింది. -
మామిడీలా
[ 27-04-2024]
మామిడి.. భారతదేశపు పండుగా గుర్తింపు పొందింది. ప్రపంచ ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో ఉంది. ఇది నిన్నామొన్నటి మాట. -
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాడు: రాజగోపాల్రెడ్డి
[ 27-04-2024]
రాబోయే నాలుగేళ్లలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తానని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
పద తమ్ముడూ.. పార్టీ మారుదాం!
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీల క్యాడర్ స్వరూపం మారిపోతోంది. రాజకీయ సమీకరణాలూ శరవేగంగా మారుతున్నాయి. -
సమగ్ర సమాచార మార్గదర్శి
[ 27-04-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక రకాల చర్యలు చేపడుతోంది. -
‘గుర్తు’ తెచ్చుకుందాం..రండి
[ 27-04-2024]
రాజకీయ పార్టీల ఉనికిని చాటేది వాటి గుర్తులే. గుర్తుల ఆధారంగానే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించడమే కాకుండా ఓటర్లు ఓటు వేస్తుంటారు. -
ప్రజల మనిషి ధర్మభిక్షం
[ 27-04-2024]
మునుగోడు మండలం ఊకొండిలో కల్లుగీత వృత్తి పని చేసుకునే ధర్మభిక్షం కుటుంబం సూర్యాపేటకు వలసవెళ్లి అక్కడే స్థిరపడింది. -
ఈతకెళ్లి తండ్రీతనయుల మృతి
[ 27-04-2024]
నీటి ప్రమాదాల నుంచి తప్పించుకునేలా తన ఇద్దరు కుమారులకు ఈత నేర్పాలని భావించిన ఆ తండ్రి. -
అవార్డుల ఉపాధ్యాయుడు ఆదె..!
[ 27-04-2024]
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా రెండు దశాబ్దాల నుంచి చిన్నారులకు విద్యాబోధన అందించటమే కాకుండా సమాజంలో విద్యాభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు ఆదె సత్యనారాయణ. -
వీడని మిస్టరీ..!
[ 27-04-2024]
ఈ నెల 18 నుంచి కనిపించకుండా పోయిన సూర్యాపేట మండలం యల్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్య కేసు మిస్టరీ వీడటం లేదు. -
చివరికి మొగి పురుగు దాడి
[ 27-04-2024]
ఈ సీజన్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు ఆలస్యంగా విడుదల కావడంతో తుంగతుర్తి నియోజకవర్గంలో 40 శాతం వరి సాగు జనవరి మాసంలో చేపట్టారు. -
వేతనాలు రాక టీఏల ఇబ్బందులు
[ 27-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి పనులను చూపిస్తూ విధులు నిర్వహిస్తున్న సాంకేతిక సహాయకుల ( టెక్నికల్ అసిస్టెంట్లు)కు రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
బరిలో..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం జరిగిన నామపత్రాల పరిశీలన కార్యక్రమంలో నల్గొండ లోక్సభ పరిధిలో 25 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా లేకపోవడంతో తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం